బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి కసరత్తులు

Publish Date:Mar 10, 2026

Advertisement

 

రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి,  మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రీ–బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరై బడ్జెట్ ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో కోట్లాది ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగిన శాఖలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,  మహిళా శిశు సంక్షేమ శాఖలని పేర్కొన్నారు.

 గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళలు చిన్నారుల సంక్షేమం కోసం ఈ శాఖలకు బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని వారు తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళా భవనాల నిర్మాణం వంటి అంశాలకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన సేవలు అందేలా అవసరమైన నిధులు సమకూర్చే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, సమగ్ర అభివృద్ధి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్న అంశాలని మంత్రులు స్పష్టం చేశారు. ముఖ్యంగా చిన్నారుల సంక్షేమం, పోషకాహార కార్యక్రమాల అమలుకు గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే మరింత ఎక్కువ నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇంటిగ్రేటెడ్ పాఠశాలలతో అనుబంధంగా కొత్త అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. చిన్నారుల విద్య, పోషణ, సంరక్షణ ఒకే వేదికపై అందేలా ఈ కేంద్రాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

అలాగే ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం కోతలు విధిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గకుండా ఉండేలా రాష్ట్రం నుంచి అవసరమైన నిధులు కేటాయించి పథకం అమలు కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, చిన్నారుల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆయా శాఖ‌ల‌కు బడ్జెట్ కేటాంపులుంటాయ‌ని మంత్రులు తెలిపారు.

By
en-us Political News

  
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన పాత రద్దైన నోట్ల పోగుపడ్డాయి. కాదు కాదు పేరుకుపోయాయి. కేంద్రం, అలాగే ఆర్బీఐ కూడా వీటి మార్పిడిని అనుమతించకపోవడంతో ఇవి నిరుపయోగంగా మిగిలిపోయాయి.
2025 రెండవ త్రైమాసికం నాటికి భారతదేశ ఐటీ లోడ్ సామర్థ్యం 1.4 గిగావాట్లుగా ఉంది, మరియు ఈ సంఖ్య రెండేళ్లలో రెట్టింపు అవుతుందని అంచనా. నగరంలోని ఫైబర్ మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు సమీపంలో ఉండటం, మరియు ఇప్పటికే స్థిరపడిన ఎంటర్‌ప్రైజ్ ఎకోసిస్టమ్‌ల కారణంగా, దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో తక్కువ లేటెన్సీ కవరేజీని కోరుకునే ఏ ఆపరేటర్‌కైనా ఇది ఒక సహజ కేంద్రంగా పనిచేస్తుంది.
రాజుపేటకు చెందిన యువతి, ఓ మరుగుజ్జు వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అదే ప్రాంతానికి చెందిన వేముల శశి , ఓ ముస్లిం యువతి మధ్య 9వ తరగతిలో ప్రారంభమైన స్నేహం క్రమంగా ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బంధంగా మారింది.
రెండు రోజులలో పిడుగుపాటుకు రాష్ట్రంలో 9 మంది మరణించారు. సోమవారం (ఏప్రిల్ 6) ప్రకాశం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ఒకరు పిడుగుపాటు కారణంగా మృత్యువాత పడ్డారు.
కోల్‌కతా ఇన్నింగ్స్ ఆరంభంలోనే పంజాబ్ బౌలర్ క్సావియర్ బార్ట్లెట్ అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ ఫిన్ అలెన్ (6), కామెరూన్ గ్రీన్ (4)లను వరుస బంతుల్లో అవుట్ చేసి కేకేఆర్‌ను కష్టాల్లో నెట్టాడు.
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
తండ్రి కొడుకులను లాకప్‌లో చంపిన కేసులో అసలేం జరిగింది?
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడుకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జలమే సంపద... దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.