ఢిల్లీ పేలుడుపై ప్రధాని ఆరా...అమిత్‌షాకు ఫోన్

Publish Date:Nov 10, 2025

Advertisement

 

ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ కేంద్ర హొం మంత్రి అమిత్‌షాకు ఫోన్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పేలుడు ఘటనలో ఒకరిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు సంస్థలు అతడిని ప్రశ్నిస్తున్నాయి. బాంబు బ్లాస్ట్‌పై ఢిల్లీ పోలీసు కమీషనర్ స్పందించారు. సీసీటీవీ ఫుటేజీలో ఆధారంగా కీలక విషయాలను కనుగొన్నట్లు వెల్లడించారు. ఫుటేజీ ఆధారంగా.. నెమ్మదిగా వెళ్తున్న కారులో పేలుడు జరిగిందని తెలిపారు. 

ఆ కారు కూడా వాహనాలు ఎక్కువగా ఉన్న చోటికి వెళ్లగానే పేలుడు జరిగినట్లుగా గుర్తించామన్నారు. ఆ కారు కావాలనే రద్దీగా ఉన్న చోటికి వెళ్లిందా ? లేక కారులో వేరే వ్యక్తులు బాంబును అమర్చారా? పేలుడు ఎలా జరిగింది? అన్న విషయాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరగా.. క్షతగాత్రుల సంఖ్య 30కి చేరింది. ఎన్ఏఐ, ఎన్ఎస్‌జీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

By
en-us Political News

  
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ షాకింగ్ నిర్ణయం! విఫలమవుతున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వదిలిపెట్టి, రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ను జట్టులోకి తెచ్చుకునేందుకు మెగా ట్రేడ్ డీల్ చర్చలు షురూ. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, పేపర్ ఫైలింగ్ ద్వారా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఒక వ్యక్తి 760 డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 71,940 రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ ఫీజును ఏకంగా 1,330 డాలర్లకు పెంచనున్నారు.
అణ్వాయుధాల పెంపుదల గురించే కాకుండా.. సరిహద్దు రక్షణ, వ్యూహాత్మక ఆయుధాల తయారీపై కింగ్ లక్ష్యాలను నిర్దేశించారు. అందులో భాగంగానే సముద్ర రంగంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు వీలుగా దాదాపు పది వేల టన్నుల సామర్థ్యం గల సరికొత్త వ్యూహాత్మక క్షిపణి క్రూజర్ యుద్ధనౌక నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు జారీ చేశారు.
ఆ ప్రచార పర్వంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల కోడ్) నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించేలా ఆయన మాట్లాడారంటూ అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా.. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారి గౌరవాన్ని కించపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు, స్థానిక పోలీసులు గుడివాడ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు.
నేటి కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీతో పోలిస్తే.. ఇక్కడ ఏకంగా 40 శాతం తక్కువ వ్యయంతోనే రోగులకు అత్యుత్తమ, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందుతున్నాయి. కేవలం గొప్ప ఆలోచనలు ఉంటే సరిపోదు, దానికి పటిష్టమైన కార్యాచరణ తోడైనప్పుడే అది తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఈ ప్రయాణం నిర్ద్వంద్వంగా నిరూపించిందని పెమ్మసాని చెప్పారు.
హైదరాబాద్‌ మహానగరంలో వైద్య సేవల రంగంలో తనదైన ముద్ర వేసిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి
కూతురి ప్రాణాల కోసం తండ్రి మృత్యువుతో పోరాటం..
పేదలకు అండగా బసవతారకం ఆసుపత్రి సేవలు..
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా దిల్లీ వేదికగా కీలక అడుగులు పడ్డాయి.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు
రెండేళ్ల చిన్నారి హత్య కేసు ఛేదన.. తల్లి, ప్రియుడి కుట్ర బట్టబయలు...
ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదంలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.