ఓటమి భయం.. బాబాయ్ హత్య కేసు.. జగన్ ఉక్కిరిబిక్కిరి

Publish Date:Jun 2, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాజకీయంగానే కాకుండా సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన పేరు ప్రస్తావించడం, అలాగే సొంత సోదరి ఏపీ రాజకీయాలలో వేలు పెట్టేందుకు, కాలు పెట్టేందుకు సమాయత్తమౌతుండటం, కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో వరుస భేటీలతో ఆమె ఆస్తుల విషయంలో కూడా జగన్ కు పక్కలో బల్లెంగా మారడం ఇవన్నీ ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్కడ ఏం మాట్లాడుతున్నారన్న విచక్షణ మరచి ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా అన్న తేడా కూడా లేకుండా విపక్ష నేతపై విమర్శలు గుప్పించడమే ఏకైక కార్యక్రమంగా, సింగిల్ పాయింట్ అజెండాగా మాట్లాడుతున్నారనీ అంటున్నారు. ఆయన ప్రసంగాలే ఆయనలోని ఫ్రస్ట్రేషన్ ను ఎత్తి చూపుతున్నాయంటున్నారు. ఒక వైపు వచ్చే ఎన్నికలలో ఓటమి భయం, మరో వైపు వివేకా హత్య కేసులో విచారణను ఎదుర్కొనవలసి ఉంటుందన్న ఆందోళనతో ఆయన సంయమనం కోల్పోతున్నారని చెబుతున్నారు.  

ఇక పార్టీ పరంగా చూస్తే వైసీపీలో అసమ్మతి సెగలు, అసంతృప్తి జ్వాలలూ నెల్లూరులో మొదలైనా అవి రాష్ట్రం మొత్తం వ్యాపించడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, చివరాఖరికి ఉప ముఖ్యమంత్రి కూడా అసమ్మతిని, అసంతృప్తిని బహిరంగంగా వెల్లగక్కడంతో పార్టీలో లుకలుకలు రోడ్డున పడ్డాయి.  దీంతో వైనాట్ 175 ధీమా కోల్పోయి.. కనీసం విజయం సాధిస్తే చాలన్న పరిస్థితికి జగన్ వచ్చేశారని పార్టీ శ్రేణులో అంటున్నాయి.  ఇదిలా ఉంటే ఇంత కాలం  ఆర్థిక అరాచకత్వం సహా  జగన్ సర్కార్ చేసే ప్రతి పనికీ, తీసుకునే ప్రతి నిర్ణయానికీ మద్దతు ఇస్తూ వస్తున్న కేంద్రంలోని మోడీ సర్కార్ ఇటీవల కాలంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.

మరీ ముఖ్యంగా నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ జగన్ ను అత్యంత ముక్తసరిగా పలకరించడంతో కేంద్రం నుంచి జగన్ కు ఇక సహకారం అందే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలోనే గురువారం (జూన్1) ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నగదు బదలీ చేసిన జగన్ ఆ సందర్బంగా చేసిన ప్రసంగం యావత్తూ విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబును దుమ్మెత్తి పోయడానికే సరిపోయిందని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయనలో ఓటమి భయం, విపక్షం పుంజుకుంటోందన్న ఆక్రోషం ప్రస్ఫుటంగా బయటపడ్డాయని సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు.

తన సభల నుంచి జనం గుంపులు గుంపులుగా వెళ్లిపోతుండటం.. అదే సమయంలో చంద్రబాబు సభలకు, లోకేష్ పాదయాత్రకు జనం అసంఖ్యాకంగా హాజరౌతుండటం జగన్ లో  గుబులు పెంచాయనడానికి నిదర్శనమే..పత్తికొండ సభలో మహానాడును తెలుగుదేశం డ్రామా కంపెనీతో పోల్చడం అని విశ్లేషిస్తున్నారు.ఇక చంద్రబాబును  సత్యం పలకడు, ధర్మానికి కట్టుబడడు, మాట మీద నిలబడడు, విలువలు.. విశ్వసనీయత అనేవి లేని వ్యక్తిగా అభివర్ణించడాన్ని ఎత్తి చూపుతూ జగన్ తన లక్షణాలన్నీ చంద్రబాబుకు ఆపాదించారని తెలుగుదేశం శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి.

 ఓ ప్రభుత్వ కార్యక్రమంలో  ప్రభుత్వాధినేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఆయనగారిలోని ప్రెస్ట్రేషన్  ఫీక్స్‌కు చేరిందని రాజకీయవర్గాలు అంటున్నాయి. అలాగే చివరిలో తన ప్రభుత్వంపై విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మకండి ప్లీజ్ అంటూ ప్రజలను వేడుకోవడం చూస్తుంటే..  వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిచేందుకు ప్రజలు పక్కాగా ఫిక్స్ అయిపోయారని జగన్ కు అర్ధమైపోయినట్లుందని అంటున్నారు. 

By
en-us Political News

  
మల్లు బడ్జెట్ లో వివిధ శాఖల కేటాయింపులు ఇలా ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు   కేటాయించారు.
ఆందోళ‌న‌లో వైసీపీ శ్రేణులు రేవంత్ సంస్కారం.. జ‌గ‌న్ అహంకారం.. ఇదే కొటేష‌న్ తో సోష‌ల్ మీడియాలో విస్తృత చ‌ర్చ జ‌రుగుతుంది. ఏపీలో సీఎం జ‌గ‌న్ అరాచ‌క పాల‌న సాగిస్తుంటే.. తెలంగాణ‌లో సీఎం రేవంత్ త‌న‌దైన శైలిలో అద్భుత‌ పాల‌న సాగిస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతున్నారంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ కామెంట్ల‌కు కొంద‌రు వైసీపీ శ్రేణులు సైతం మ‌ద్ద‌తు ప‌లుకుతుంట‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ.. రేవంత్‌, జ‌గ‌న్ గురించి సోష‌ల్ మీడియాలో ఇంత‌లా ఎందుకు చ‌ర్చ జ‌రుగుతోంది? రేవంత్ రెడ్డి చేసిన ప‌నేంటి.. జ‌గ‌న్ చేయ‌ని ప‌నేంటి? అంటే.. ద‌క్షిణాది రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు, సినిమా వాళ్ల‌కు అవినాభావ సంబంధం ఉంటుంది. ఉంది కూడా.
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు కొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈ స్థితిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయం రసకందాయంలో పడింది. పెద్దారెడ్ల సామ్రాజ్యంగా ఉండే నెల్లూరులో ఇప్పుడు సమీకరణాలు మారుతున్నాయా అంటూ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.
ఏపీలో ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం ఉండగా ఎన్నికల వేడి మాత్రం ఎప్పుడో పీక్స్ కు చేరింది. అధికార, విపక్షాలు ఎవరికి వారు నిర్దిష్ట ప్రణాళికలతో గెలుపు వేట మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రజా నాడి, ముందస్తు సర్వేల ఫలితాలతో విపక్ష తెలుగుదేశం గెలుపు ధీమాతో ప్రజల మధ్యకు వెళ్తుండగా.. ఆ పార్టీకి జనసేన కూడా తోడు కావడంతో జోష్ తారస్థాయికి చేరింది.
ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకరెడ్డి కత్తి దాడికి గురైన సంగతి తెలిసిందే. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారనీ, కోలుకోడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.
నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం మొత్తం అంకెలగారడీతో సాగుతోంది. ఎక్కడా చెణుకులు, జోకులూ వినిపించడం లేదు. అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచి అభినందించడం వినా నిర్మల బడ్జెట్ ప్రసంగానికి పెద్దగా సభ్యుల నుంచి స్పందన కనిపించడం లేదు.
ఏపీలో వైసీపీ గ్రాఫ్, ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా పడిపోతోంది. ఇందుకు సర్వేలను, నివేదికలను ఉటంకించాల్సిన అవసరం లేదు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే సరిపోతుంది. ఆ విషయం విపక్షానికే కాదు.. అధికార వైసీపీకీ మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ కూ కూడా స్పష్టంగానే అర్ధమైంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ రెడ్డి తమ పార్టీ నేతలు, జిల్లాలు, ప్రాంతీయ ఇన్ చార్జిలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. సమీక్షలు చేస్తున్నారు. వీటన్నిటిలోనూ ఆయన వైనాట్ 175 అంటూ చెబుతుండటం మేకపోతు గాంభీర్యం తప్ప మరోటి కాదని.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంతర్గత సంభాషణల్లో సెటైర్లు వేసుకుంటున్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ అధినేత నుంచి ఇంతవరకూ స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో గురువారం భేటీ అవుతున్నారు. ఇటీవలే హఠాత్తుగా మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డిని ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా ప్రకటించాలని రాజమోహన్ రెడ్డి కోరేందుకు జగన్ ను కలుసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. వైఎస్ జగన్- మేకపాటి రాజమోహన్ రెడ్డి భేటీతో ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి ఎవరనే క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. కేసీఆర్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఈట‌ల రాజేంద‌రే హుజురాబాద్ రారాజుగా నిలిచారు. హోరాహోరీగా జ‌రిగిన పోరులో ప్ర‌జ‌లు భారీ మెజార్టీతో ఈట‌ల‌ను గెలిపించారు. టీఆర్ఎస్‌కు దిమ్మ‌తిరిగి మైండ్‌బ్లాంక్ అయ్యేలా క‌ర్రు కాల్చి వాత పెట్టారు. గెలిచాక ఇక త‌న నెక్ట్స్ టార్గెట్ గ‌జ్వేల్‌, సిద్ధిపేట‌లేన‌ని స‌వాల్ చేశారు రాజేంద‌ర్‌. ప్ర‌గ‌తి భ‌వ‌న్ గోడ‌లు కూల్చే వ‌ర‌కూ త‌గ్గేదే లేదంటూ స‌మ‌రోత్సాహంతో ఉన్నారు ఈట‌ల‌. క‌ట్ చేస్తే.. ఈట‌లపై భూక‌బ్జా కేసు మ‌ళ్లీ వేగం పుంజుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇది ప‌క్కా క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లేనంటున్నారు. 
అతను బీజేపీ ఎమ్మెల్యే. 2017లో 17ఏళ్ల మైనర్ బాలికను రే-ప్ చేశాడు. 2019లో అతనికి జీవిత ఖైదు పడింది. కట్ చేస్తే, ఆయన భార్యకు లేటెస్ట్‌గా బీజేపీ టికెట్ ఇవ్వడం కాంట్రవర్సీగా మారింది. జాతీయ పార్టీకి ఇంత దిగజారుడుతనం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవేవీ పట్టించుకోవడం లేదు కమలనాథులు. ఆమెకు టికెట్ ఇవ్వడం కరెక్టే అంటూ సమర్థించుకుంటున్నారు....
సౌత్ ఢిల్లీలో ఓ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతనితో కాంటాక్ట్ అయిన వారిపై ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. లాక్ డౌన్ పిరియడ్ లో ఫుడ్ హోం డెలివరీలకు ప్రభుత్వాలు అనుమతించాయి....
Amarnath Yatra, pilgrims killed, Anantnag, Terrorists attack, Terror threat, Pahalgam, Prime Minister Narendra Modi, jammu and kashmir
jammu kashmir pulwama, Stone pelting security forces in jammu kashmir, Pulwama Stone pelting security forces
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.