ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్
Publish Date:Dec 12, 2025
Advertisement
ఫోన్ ట్యాపింట్ ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇప్పటి వరకూ సుప్రీం ద్వారా పొందుతోన్న తాత్కాలిక రక్షణ నుంచి బయటకొచ్చి ఏసీబీ వెంకటగిరి ముందు లొంగిపోమని ఆదేశించింది సుప్రీం కోర్టు. దీంతో ప్రభాకర్ రావుకు ఇదొక షాకింగా మారింది. అలాగని ప్రభాకర్ రావును ఫిజికల్ గా టార్చర్ చేయొద్దనీ.. థర్డ్ డిగ్రీ అసలే ప్రయోగించవద్దని పేర్కొంది సుప్రీం కోర్టు. ఇంతకీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఏమిటి? దీని పూర్వాపరాలు ఎలాంటివి? అన్నదొక చర్చగా మారింది. ఆ విషయాలేంటో చూస్తే.. మార్చి 2024లో పంజాగుట్ట స్టేషన్లో ఫోన్ట్యాపింగ్ కేసు నమోదు నమోదయ్యింది. కేసు నమోదు నాటికి అమెరికాలో ఉన్నారు ప్రధాన నిందితుడైన ప్రభాకర్రావును దేశానికి రప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు పోలీసులు. విచారణకు రావాలంటూ ఆయనకు నోటీసులు కూడా పంపించారు పోలీసులు. ఆరోగ్యం బాగోలేదని, ట్రీట్మెంట్ పూర్తయ్యాక వస్తానంటూ సమాచారమిచ్చిన ప్రభాకర్రావు.. పోలీసులు ఇచ్చిన గడువు ముగిసినా హైదరాబాద్కు రాలేదు. దీంతో ప్రభాకర్రావు పాస్పోర్ట్ను రద్దు చేయించారు పోలీసులు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభాకర్రావు 2025, మే 29న మూడు రోజుల్లో భారత్కు వచ్చి విచారణకు సహరించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. తాత్కాలిక పాస్పోర్ట్పై హైదరాబాద్కు వచ్చారు ప్రభాకర్రావు. 2025 జూన్ 9, న జూబ్లీహిల్స్ పీఎస్లో విచారణకు హాజరయ్యారు ప్రభాకర్రావు. జూన్లో మొత్తం 6 సార్లు విచారణకు హాజరయ్యారు ప్రభాకర్రావు. జూన్ 11, 15, 17, 19, 20 తేదీల్లో ప్రభాకర్రావు విచారణ జరిగింది. విచారణలో పోలీసులకు ఏమాత్రం సహకరించ లేదాయన. పోలీసులకే రివర్స్లో వార్నింగ్ ఇచ్చారు ట్యాపింగ్ కేసులోని ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు. అన్ని రోజులు మీవే ఉండవనీ, మావి కూడా వస్తాయంటూ ప్రభాకర్రావు వార్నింగ్ పాస్ చేశారు. ఫోన్ట్యాపింగ్ కేసులో ఇంతవరకూ జరిగిందేంటి? అని చూస్తే.. ఇంతవరకూ 270 మంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ఫోన్ట్యాపింగ్ కేసులో ఆరుగురు ప్రధాన నిందితులుగా గుర్తించారు. A1గా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి. ప్రభాకర్రావు కాగా, A2గా ఇంటెలిజెన్స్ మాజీ DSP డి.ప్రణీత్రావు, A3గా ఇంటెలిజెన్స్ మాజీ ASP N.భుజంగరావు, A4గా ఇంటెలిజెన్స్ మాజీ ASP M.తిరుపతన్న A5గా టాస్క్ఫోర్స్ మాజీ DCP T.రాధాకిషన్రావుగా ఉన్నారు. ఇక A6గా ఐన్యూస్ ఛానల్ ఎండీ A.శ్రవణ్రావు, కేసులో అరెస్ట్ అయిన వారందరికీ బెయిల్ రాగా.. ప్రభాకర్రావుపై 68 పేజీల ఛార్జ్షీట్ వేసింది సిట్. ఫోన్ ట్యాపింగ్లో వాంగ్మూలం ఇచ్చినవాళ్లు ఎవరని చూస్తే.. కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్రావు, కొండా విశ్వేశ్వర్రెడ్డితో పాటు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, TRMES చైర్మన్ ఫయీమొద్దీన్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డీ గద్వాల్ జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్సీ కవిత పీఏ, డ్రైవర్, పనిమనిషి విచారణకు హాజరైన వాళ్లు ఎవరో చూస్తే.. మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్ అధికారి రఘునందన్రావు మాజీ సీఎం కేసీఆర్ OSD రాజశేఖర్రెడ్డి, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఉన్నారు. ప్రభాకర్రావును ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారో చూస్తే.. - ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది? ఏ రాజకీయ నేతలు చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశారు?, రెండు ఐఫోన్లను అమెరికాలోనే ఎందుకు దాచిపెట్టి వచ్చారు? హార్డ్డిస్క్లు ధ్వంసం చేయమని చెప్పిందెవరు?, ఎందుకు చెప్పారు?, SIB నుంచి మాయం అయిన హార్డ్డిస్క్లు ఎక్కడికి వెళ్లాయి?, రూల్ 419/419A ప్రకారం సంఘవిద్రోహ శక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సి ఉండగా.. రాజకీయ నేతల ఫోన్లను ఎందుకు ట్యాపింగ్ చేశారు? ఫోన్ ట్యాపింగ్పై రివ్యూ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రశ్నలు వేసే అవకాశం కనిపిస్తోంది. ఫైనల్ గా రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్స్కు హోం సెక్రటరీ, GAD ప్రిన్స్పల్ సెక్రటరీ, DGP అనుమతి ఇచ్చారా? అని ప్రభాకర్ రావును విచారణాధికారులు అడిగేలా తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే అసలు ప్రభాకర్ రావుకు ఈ కష్టం ఎలా వచ్చిందో చూస్తే ఆయన విచారణకు అస్సలు సహకరించడం లేదని తెలుస్తోంది. దానికి తోడు ఆయన ఐ క్లౌడ్ పాస్ వర్డ్ చెప్పకుండా డేటా మొత్తం డిలీట్ చేసినట్టుగానూ తెలుస్తోంది. దీంతో సుప్రీం కోర్టు మీరు విచారణకు సహకరించడం లేదు కాబట్టి అరెస్టు ముప్పు కొని తెచ్చుకున్నారని వ్యాఖ్యానించింది.
చక్రధర్గౌడ్ వంటి వారున్నారు.
http://www.teluguone.com/news/content/prabhakar-rao-surrendered-36-210887.html





