Publish Date:Apr 16, 2026
హైదరాబాద్లో ఓ రిటైర్డ్ సైనికుడి ధైర్యసాహసం చైన్ స్నాచర్ను పోలీసులకు పట్టించింది. ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా ధైర్య సాహసాలు ప్రదర్శించిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ చీర్ల రాముడిని సన్మానించారు. బషీర్బాగ్లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఆయనను ఆహ్వానించి శాలువా కప్పి నగదు బహుమతిని అందజేశారు. ఈ ఘటన ఈ నెల 14న అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబర్పేట్ ఇరానీ హోటల్ బస్టాప్ వద్ద జరిగింది.
బస్సు దిగుతున్న రాముడి మెడలోని బంగారు గొలుసును అపహరించేందుకు నిందితుడు అకస్మాత్తుగా ప్రయత్నించగా, తన వయసును కూడా లెక్కచేయ కుండా రాముడు ఒక్క క్షణం కూడా వెనుకాడకుండా నిందితుడిని గట్టిగా పట్టుకుని డయల్ 100కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అంబర్పేట్ పెట్రోల్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు మల్లేపల్లికి చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ మన్నన్ గా గుర్తించారు.
ఇతనిపై తెలంగాణ వ్యాప్తంగా 31 పాత కేసులు ఉన్నట్టు బయటపడింది. హబీబ్నగర్ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉండగా, మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ కేసులో మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు.అతని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు., అతని అనుచరులు కోటేష్ మరియు మల్లేష్ పరారీలో ఉన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ “సైనికుడు ఎప్పుడూ సైనికుడే” అన్న మాటను రాముడు తన కార్యాచరణతో నిజం చేశారని పేర్కొన్నారు. భయాన్ని జయించి నేరస్తుడిని ఎదిరించిన ఆయన ధైర్యం సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్లా వ్యవహరిస్తే నేరాలను నియంత్రించడం సులభమవు తుందని పిలుపునిచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cp-sajjanar-praises-the-courage-of-a-retired-army-jawan-36-217545.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.