కాంగ్రెస్ ఉచ్చులో నుండి బయటపడ్డ జగన్?

Publish Date:Nov 13, 2015

Advertisement

 

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన పోరాటాలకి ప్రజల నుండి ఆశించినంతగా స్పందన రాకపోవడంతో చాలా నిరాశ చెందారు. అందుకే తన పోరాటాలను అర్దాంతరంగా నిలిపివేశారని భావించాల్సి ఉంటుంది. కేవలం ఆయనే కాదు ఆయనపైనే చాలా ఆశలు పెట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ కూడా నిరాశ చెందిందని చెప్పవచ్చును. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని డ్డీ కొనడానికే మొదట ప్రాధాన్యతనిస్తుంది. ఆ తరువాతే రాష్ట్ర ప్రభుత్వం.

 

ఒకే దెబ్బకి రెండు పిట్టలు కొట్టవచ్చనే ఉద్దేశ్యంతోనే అది ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొంది. కానీ కాంగ్రెస్ అధిష్టానానికి దాని కంటే ఇంకా ఎక్కువ ప్రయోజనం కలిగించే అంశాలు చేతిలో ఉండటం చేత ప్రత్యేక హోదాపై పోరాడేందుకు అది అంతగా శ్రద్ద చూపలేదు. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ మొదలుపెట్టిన ఈ ప్రత్యేక పోరాటాలని నమ్మలేదు. అప్పుడే కాంగ్రెస్ నేతల దృష్టి జగన్ మోహన్ రెడ్డిపై పడింది. ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయమని రెచ్చగొట్టింది. ఆయన చేస్తున్న పోరాటాలకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని దిగ్విజయ్ సింగ్, రఘువీరా రెడ్డి ఇద్దరూ విస్పష్టంగా ప్రకటించారు. ఒకవేళ జగన్ అంగీకరిస్తే వైకాపాను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొని జగన్ సహాయంతో రాష్ట్రంలో మళ్ళీ నిలద్రొక్కుకోవాలని కాంగ్రెస్ ఆశపడి ఉండవచ్చును. కానీ తన స్వశక్తితో పార్టీని నిలబెట్టుకొన్న జగన్, రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీలో చేరవలసిన అవసరం అగత్యం లేదు కనుక కాంగ్రెస్ మద్దతును స్వీకరించడానికి ఇష్టపడలేదని భావించవచ్చును.

 

కాంగ్రెస్ విసిరిన గాలానికి చిక్కుకొన్న జగన్ అకస్మాత్తుగా ప్రత్యేక హోదా కోసం పోరాటాలు మొదలు పెట్టేసారు. కానీ జగన్ అసలు లక్ష్యం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవడమే తప్ప కేంద్రంతో పోరాటాలు చేయడం కాదు. అందుకోసం ఆయన స్థానిక సమస్యలపై పోరాడితేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది తప్ప సామాన్య ప్రజలకు అర్ధం కాని , వారి జీవితాలపై ఏమాత్రం ప్రభావం చూపని ప్రత్యేక హోదా అంశం మీద కాదు. పైగా అది కేంద్రం పరిధిలో ఉన్న అంశమే తప్ప రాష్ట్రం పరిధిలో ఉన్నది కాదు. ఒకవేళ ఈ అంశంతో కేంద్రాన్ని మరీ ఇబ్బందిపెట్టినట్లయితే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. అందుకే మోడీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకుండా తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని, ఆయన ప్రభుత్వాన్ని ఈ ప్రత్యేక హోదా అంశంతో చావు దెబ్బ తీయాలని ప్రయత్నించి చివరికి తనే నవ్వులపాలయ్యారు. కాంగ్రెస్ విసిరిన ఆ ప్రత్యేక ఉచ్చులో పడి భంగపడిన తరువాత జగన్ తన తప్పు తెలుసుకొన్నందునే వాటిని అర్దాంతరంగా నిలిపివేశారని అనుమానం కలుగుతోంది.

 

జగన్ తన ప్రత్యేక పోరాటాలను అర్దాంతరంగా నిలిపివేయడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరాశకు గురవడం చాలా సహజమే. రాష్ట్రంలో పార్టీని బ్రతికించుకొనేందుకు మొదలుపెట్టిన ప్రత్యేక హోదా పోరాటాలు ఫలించలేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి దాని కోసం పోరాటాలు చేస్తుంటే ఆ విధంగానయినా రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బ్రతికించుకోవచ్చని కాంగ్రెస్ ఆశపడింది కానీ నిరాశ తప్పలేదు. బహుశః  అందుకే పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి జగన్ పై చాలా ఆగ్రహం వ్యక్తం చేసారనుకోవచ్చును. జగన్ తన సీబీఐ కేసులకు భయపడే వెనక్కు తగ్గారని ఆయన విమర్శించారు. ఇంతకీ చివరికి ఏమి జరిగిందంటే కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ పార్టీ వేసిన పాచిక పారలేదు. అలాగే దాని ఉచ్చులో చిక్కుకొని బయటపడిన జగన్మోహన్ రెడ్డి నవ్వులపాలయ్యారు. రెండు పార్టీల పరిస్థితి కూడా మళ్ళీ మొదటికొచ్చిన్నట్లయింది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.