ప్రధాని నరేంద్ర మోడి విదేశీ పర్యటనలపై విమర్శలా?

Publish Date:Nov 12, 2015

Advertisement

 

ప్రధాని నరేంద్ర మోడి తరచూ విదేశీయాత్రలు చేయడంపై ప్రత్యర్ధ రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ ఈరోజు నుంచి మూడు రోజుల పాటు బ్రిటన్ లో పర్యటించేందుకు ఆయన బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు సరికొత్త వాదనలు వినిపిస్తున్నారు. బిహార్ లో పరాజయం కారణంగా వస్తున్న విమర్శల బారి నుంచి తప్పించుకొనేందుకే ఆయన బ్రిటన్ పర్యటన పెట్టుకొన్నారని కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు ఎద్దేవా చేస్తుంటే, బిహార్ లో పోగొట్టుకొన్న ప్రతిష్టని బ్రిటన్ లో తిరిగి సంపాదించుకొనే ప్రయత్నం చేస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు వాదనలను లోతుగా పరిశీలిస్తే వాటిలో డొల్లతనం అర్ధం అవుతుంది.

 

ప్రధాని నరేంద్ర మోడి విదేశీ పర్యటనలు అప్పటికప్పుడు ఖరారు అయ్యేవేమీ కాదు. వాటి కోసం ఇరుదేశాల విదేశాంగ శాఖల అధికారులు కనీసం ఒకటి రెండు నెలల ముందు నుంచే చాలా కసరత్తు చేయవలసి ఉంటుంది. అలాగే ప్రధాని విదేశీ పర్యటనలో భాగంగా ఆయన కార్యక్రమాల అజెండాను కూడా చాలా ముందుగానే ఖరారు చేసి, అందుకు అవసరమయిన ముందస్తు ఏర్పాట్లు చేస్తుంటారు.

 

ఈసారి మోడీ బ్రిటన్ పర్యటనలో వెంబ్లే స్టేడియంలో సుమారు 60, 000 మంది ప్రవాస భారతీయులు హాజరవ్వబోయే సభలో ప్రసంగిస్తారు. బ్రిటన్ లో జాగ్వార్-ల్యాండ్ రోవర్ కర్మాగారాన్ని సందర్శిస్తారు. బ్రిటన్ పార్లమెంటు ఉభయసభలని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని నరేంద్ర మోడి పర్యటనలో రెండు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు జరుగుతాయి. ప్రధాని పర్యటన షెడ్యూల్, అందులో ఆయన పాల్గొనబోయే ఈ కార్యక్రమాలన్నిటికీ చాలా ముందు నుంచే ఏర్పాట్లు చేయబడ్డాయి తప్ప బిహార్ ఎన్నికలలో బీజేపీ ఓడిపోయినా మరునాడు చేసినవి కావు. ఒకవేళ బిహార్ లో బీజేపీ ఘన విజయం సాధించినా కూడా ఆయన తప్పకుండా బ్రిటన్ వెళ్ళేవారు..ఈ కార్యక్రమాలన్నిటిలో పాల్గొనేవారు. అటువంటప్పుడు బిహార్ పరాజయం కారణంగా తనపై వస్తున్న విమర్శల నుండి తప్పించుకోనేందుకే ఆయన విదేశీ పర్యటన పెట్టుకొన్నారని వాదించడం ఎంత అవివేకమో అర్ధమవుతుంది.

 

ఇక బిహార్ లో పోయిన ప్రతిష్టను బ్రిటన్ లో తిరిగి సంపాదించుకోవడమనే వాదన కూడా అర్ధరహితమే. మోడీ ఇంతకు ముందు చాలాసార్లు విదేశీ పర్యటనలు చేసారు, ఇక ముందు కూడా చేస్తారు. ఆ సందర్భంగా ఆయన అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశ్యించి చాలా ఉత్తేజపూర్వకమయిన ప్రసంగాలు చేసేవారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. అందులో కొత్తగా చేస్తున్నదేమి లేదు. కనుక బిహార్ ఎన్నికల పరాజయానికి ఆయన విదేశీ పర్యటనలకి ముడిపెట్టి చూడటం చాలా అవివేకం అర్ధరహితమే. ప్రధాని నరేంద్ర మోడి తరచూ విదేశీ పర్యటనలు చేయడంపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఆయన స్వదేశంలో తక్కువ విదేశాలలో ఎక్కువగా పర్యటనలు చేస్తుండటం వలననే ఇటువంటి విమర్శలు ఎదుర్కోవలసి వస్తోందని చెప్పవచ్చును. కనుక బీజేపీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పవచ్చును.

 

ఇంతకు ముందు యూపియే హయాంలో జరిగిన అనేక కుంభకోణాలు, అవినీతి కారణంగా ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ కోల్పోయిన పరువు ప్రతిష్టలను, మోడీ చేస్తున్న విదేశీ పర్యటనల వలన పునరుద్దరించబడుతోంది. అంతర్జాతీయంగా భారత్ పలుకుబడి పెరుగుతోంది. అలాగే భారత్ శక్తి సామర్ధ్యాలను, దేశంలో విస్తృతంగా ఉన్న వ్యాపార అవకాశాలను ప్రపంచ దేశాలు గుర్తించడం మొదలుపెట్టాయి. భారత్ లో ప్రభుత్వ పనితీరులో కూడా పారదర్శకత, వేగం పెరిగి అవినీతి అదుపులోకి వస్తున్న సంగతిని విదేశీ పెట్టుబడుదారులు సైతం అంగీకరిస్తున్నారు. వ్యాపారానికి అనుకూలమయిన దేశాలకు ప్రపంచ బ్యాంక్ ప్రతీ ఏట ఇచ్చే ర్యాకింగ్ లో భారత్ 140 స్థానం నుంచి కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే 132వ స్థానానికి చేరుకోవడమే అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చును. అందుకే విదేశీ సంస్థలు భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ విషయాలు మోడీని విమర్శిస్తున్న వారితో సహా అందరికీ తెలుసు. అయినా ఏదో ఒక వంకతో విమర్శించడం కోసమే విమర్శిస్తున్నారని భావించవలసి ఉంటుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.