ప్రాంతాల మధ్య చిచ్చు.. జగన్ కొత్త వ్యూహం.. విశాఖ నుంచే ప్రమాణం ప్రకటన అందుకేనా?

Publish Date:Mar 6, 2024

Advertisement

ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ్తోంది. వీరి క‌ల‌యిక స‌క్సెస్ కావ‌డంతో జ‌గ‌న్ శిబిరంలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్నది. తెలుగుదేశం, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లో చిచ్చుపెట్టేందుకు వైసీపీ వ్యూహ‌క‌ర్త‌లు చేసిన ప్ర‌య‌త్నాలన్నీ విఫ‌ల‌మ‌య్యాయి. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాల విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పై విమ‌ర్శ‌లు చేస్తూ.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టేలా వైసీపీ కోవ‌ర్టులు, కాపు సంఘం పెద్ద‌లు చేసిన ప్ర‌య‌త్నాల‌ను సైతం ప‌వ‌న్‌, చంద్ర‌బాబు చాలా చాలా బలంగా తిప్పికొట్టారు. వైసీపీ వ్యూహ‌క‌ర్త‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌లమ‌వ్వడంతో ఓట‌మి ఖాయ‌మ‌ని జ‌గ‌న్ సహా వైసీపీ పెద్ద‌ల‌కు క్లియర్ కట్ గా అర్ధమైపోయింది.  

జ‌గ‌న్ సొంతంగా చేయించుకున్న స‌ర్వేల్లోనూ మ‌ళ్లీ అధికారం  అసాధ్య‌మ‌ని తేలిపోయింది. దీంతో జ‌గ‌న్ కొత్త నాట‌కానికి తెర‌లేపారు. ప్రాంతాల వారిగా వైసీపీ బ‌లాబ‌లాల‌ను విశ్లేషించుకున్న జ‌గ‌న్‌  పోలింగ్ స‌మ‌యం నాటికి విశాఖ వ‌ర్సెస్ అమ‌రావ‌తి అనే అంశాన్ని ప్ర‌జ‌ల్లో రెచ్చ‌గొట్టేలా వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే ఇన్నాళ్లు పెద్ద‌గా ప‌ట్టించుకోని విశాఖ రాజ‌ధాని అంశాన్ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉన్న‌ట్లుండి తెర‌పైకి తెచ్చారు. అంతేకాదు.. తాను మళ్లీ  అధికారంలోకి వ‌స్తే విశాఖ నుంచే సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేస్తాన‌ని విశాఖ వేదిక‌గా చెప్పారు. దీని ద్వారా విశాఖప‌ట్ట‌ణంతోపాటు చుట్టు ప‌క్క‌ల జిల్లాల ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపుకు తిప్పుకొవచ్చన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. 

వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఉపాధిలేక హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరు వంటి ప్రాంతాల‌కు వ‌ల‌స వెళ్తున్న ప‌రిస్థితి. దీంతో గ‌తం ఎన్నికల్లో ఓట్లేసి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్ర‌జ‌లు ఇప్పుడు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఏపీ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌తో పాటు.. అగ్నికి అజ్యం తోడైనట్లు  తెలుగుదేశం, జ‌న‌సేన పొత్తుగా ఎన్నిక‌లో బ‌రిలోకి దిగుతుండ‌టం, మ‌రోవైపు కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ సైతం రాష్ట్రంలో తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మితో క‌లిసినడిచేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌టంతో జ‌గ‌న్ లో  ఓట‌మి భ‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఓట‌మి ఖాయ‌మ‌ని తెలిసిన‌ప్ప‌టికీ.. భారీ స్థాయిలో ఓట‌మిని చ‌విచూడ‌కుండా జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే విశాఖ రాజ‌ధాని అంశాన్ని ఉన్న‌ట్లుండి తెర‌పైకి తెచ్చార‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు.

ఏపీని రాజ‌కీయంగా మూడు ప్రాంతాలుగా తీసుకుంటే.. సౌత్ కోస్ట‌ల్ ఆంధ్రాలో గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి, తూర్పు గోదావ‌రి ఉమ్మ‌డి జిల్లాలు, నార్త్ కోస్ట‌ల్ ఆంధ్రా విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాళం ఉమ్మ‌డి జిల్లాలు.. గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ ప‌రిధిలో ప్ర‌కాశం, నెల్లూరు, చిత్తూరు, అనంత‌పురం, క‌ర్నూల్ ఉమ్మ‌డి జిల్లాలు ఉంటాయి. వైసీపీ వ్యూహ‌క‌ర్త‌ల అంచ‌నా ప్ర‌కారం.. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వ  వైఖ‌రితో గుంటూరు, కృష్ణా ఉమ్మ‌డి జిల్లాల ప్ర‌జ‌లు జగన్ అన్నా జగన్ పార్టీ అన్నా మండిపడుతున్నారు.  తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మిగా ఏర్ప‌డ‌టంతో ఈ రెండు ఉమ్మ‌డి జిల్లాల‌కు తోడు తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లోనూ కూట‌మిదే  తిరుగులేని ఆధిపత్యం అని సర్వేలు సందేహాలకతీతంగా తేల్చేశాయి.  రాయ‌ల‌సీమలోని ఉమ్మ‌డి జిల్లాల్లో ప‌రిస్థితిని ప‌రిశీలిస్తే, ఆ జిల్లాలలో తెలుగుదేశం కూటమి, అధికార వైసీపీల మధ్య హోరాహోరీ తప్పదని పేర్కొన్నాయి.  ఇక ఉత్తరాంధ్రలోని విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాల్లోనూ తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి స్ప‌ష్ట‌మైన ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నది. సొంత సర్వేలే పార్టీ గెలిచే అవకాశాలు లేవని తేల్చేయడంతో  జగన్ వ్యూహాత్మ‌కంగానే విశాఖ, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం ప్రాంతాల‌పై దృష్టిసారించారు.  అందుకే మరోసారి విశాఖ రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అమ‌రావ‌తి రాజధాని విష‌యంలో పార్టీ స్టాండ్ ప్ర‌కారం, మ‌రోవైపు   తెలుగుదేశం, జనసేన పొత్తు కార‌ణంగా ఎన్నిప్ర‌య‌త్నాలు చేసినా గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అద‌నంగా వ‌చ్చే ఓటు బ్యాంకు ఏమీ ఉండ‌ద‌ని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. రాయ‌ల‌సీమ‌పై వైసీపీ అధిష్టానం ప్ర‌త్యేక దృష్టిసారించింది. ఆ ప్రాంతంలో గ‌తంకంటే సీట్లు త‌గ్గినా మెజార్టీ సీట్లు సాధించేలా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇక విశాఖ, దాని ప‌రిధిలోని జిల్లాల్లో ప‌ట్టు సాధించేందుకు సీఎం జ‌గ‌న్ దృష్టిసారించిన‌ట్లు తెలుస్తోంది. విశాఖ రాజ‌ధాని అని మొద‌టి నుంచి వైసీపీ ప్ర‌భుత్వం చెబుతున్నా ఆ ప్రాంత ప్ర‌జ‌లు అంత‌గా స్పందించ‌డం లేదు. స్పందన ఏంటి అసలు జగన్ మాట నమ్మడం లేదు. విశాఖ నుంచే పాలన అని ముహూర్తాల మీద ముహూర్తాలు పెట్టి మిన్నకుండటంతో జగన్ మాటల మీద ఉత్తరాంధ్ర జనాలకు నమ్మకం పోయింది.  దీంతో జగన్ ఇప్పుడు విశాఖ వ‌ర్సెస్ అమ‌రావ‌తి అనే నినాదాన్ని తెర‌పైకి తెచ్చి రెండు ప్రాంతాల ప్ర‌జ‌ల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలన్న వ్యూహానికి తెరతీశారు.  త‌ద్వారా విశాఖ‌, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లోని జిల్లాల్లో  ఎక్కువ స్థానాల్లో విజ‌యం సాధించ‌వచ్చని భావిస్తున్నారు. ఎటూ రాయలసీమలో తనకున్న పట్టు ద్వారా అధిక స్థానాలు సొంతం చేసుకోలనన్న నమ్మకం జగన్ లో ఉంది.  జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చేందుకు ఎంత‌కైనా తెగిస్తార‌నేది ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలిసిన విష‌య‌మే. ఈసారి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ రెండు ప్రాంతాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం సృష్టించి ఎన్నిక‌ల్లో ల‌బ్ధిపొందేందుకు సిద్ధ‌మ‌య్యారు. అందులో భాగంగానే జ‌గ‌న్ ఉన్న‌ట్లుంటి విశాఖ‌నే ఏపీ రాజ‌ధాని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిస్తే ఇక్క‌డే ప్ర‌మాణ స్వీకారం చేస్తా అంటూ వ్యాఖ్యానించాడ‌ని ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.