మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దొంగ దొంగ సినిమాలోని మాస్ సాంగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కొంచెం నీరు కొంచెం నిప్పు మాదిరిగా తయారయ్యింది హైద్రాబాద్ కమలనాథుల్లో. ప్రముఖ సామాజిక కార్యకర్త, సనాతన సాంప్రదాయాన్ని ప్రమోట్ చేస్తున్న కొంపల్లి మాధవిలతకు ఏకంగా హాట్ సీట్ హైద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడంతో స్థానిక నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. బిజెపిలో అధికార ప్రతినిధి హోదాలో ఉన్న నడింపల్లి యమునాపాఠక్ పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ హఠాత్తుగా మాధవిలత ఈ సీటును ఎగరేసుకు పోవడం పార్టీలో కొంత అసంతృప్తి మాత్రం కొంత వరకు ఉంది. మాధవిలత కనీసం పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. అయినా పార్టీ అధిష్టానం మాధవిలతకు టికెట్ ఇవ్వడంతో హైద్రాబాద్ నుంచి హిందుత్వవాదాన్ని బలపరిచే గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకంగా అధిష్టానాన్ని ఏకి పారేశారు. హైద్రాబాద్లో మగాడు ఎవ్వరూ దొరకలేదా? అని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది నానుడి . కానీ హైదరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి విషయంలో ఈ నానుడి సరిగ్గా సరిపోతుంది. మాధవిలత ఇంట గెలవకుండానే రచ్చ గెలుస్తా అని బయలు దేరారు. 1984 లో సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ ఇండిపెండెంట్ గా గెలుపొందారు ఆ తర్వాత ఆయన మజ్లిస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అప్పట్నుంచి మజ్లిస్ పార్టీ హైదరాబాద్ సీటును కైవసం చేసుకుంటుంది. సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ ఈ సీటును వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ ఎంపీ సీటుకు ముక్కోణపు పోటీ ఉంది. మజ్లిస్ పార్టీ నుంచి దివంగత యాకుత్ పురా ఎమ్మెల్యే మస్కతీ కుమారుడు అలీబిన్ మస్కతిని కాంగ్రెస్ పార్టీ రంగంలో దించబోతుంది. అలీ బిన్ మస్కతి టిడిపి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి అలీబిన్ మస్కతీని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించారు. ఈయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మాధవిలత గెలుపు సునాయసమౌతుంది. ఎందుకంటే ముస్లిం వోట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పెరిగాయి. పాత బస్తీలో కూడా కాంగ్రెస్ పార్టీ కి ఆదరణ పెరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు ఒక్కోటి అమలవుతున్నాయి. మైనార్టీ వోటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగానే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో విభేధించడంతో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. భాగ్యలక్ష్మి టెంపుల్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓవైసీ సోదరులను కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు జైల్లో పెట్టడమే దీనికి ప్రధాన కారణం. రాజకీయ కారణాలతో మజ్లిస్ కాంగ్రెస్ పార్టీతో విభేధించి బిఆర్ఎస్ కు దగ్గరయ్యింది. బిజెపి బీ టీం మజ్లిస్, బిఆర్ఎస్ అని కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ప్రచారం చేసింది. దీంతో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు. అదే టెంపో ప్రస్తుతం కొనసాగుతోంది. మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది. నా జోలికి వస్తే మస్కతీ వ్యాపార రంగాన్ని దెబ్బతీస్తానని అసదుద్దీన్ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ముస్లింల ప్రయోజనాలు దెబ్బతీస్తే ప్రొడక్ట్ చెక్నా చూర్ కరూంగా మస్కతీ ప్రొడక్ట్ ను ముక్కలు ముక్కలు చేస్తానన్నారు. మస్కతీ డైరీ వ్యాపారం పాతబస్తీలో పాతుకుపోయింది. ఇప్పుడు అదే వ్యాపారాన్ని దెబ్బతీస్తానన్నారు ఓవైసీ. కాబట్టి ఈ ఎన్నికల్లో ముక్కోణపు పోటి నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/madhavilatha-as-hyderabad-bjp-candidate-a-little-water-a-little-fire-in-party-39-171613.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.