బెలూచిస్తాన్‌ సమస్య ఏమిటి!

Publish Date:Mar 31, 2016

Advertisement

 

బెలూచిస్తాన్‌... ఈ మధ్య తరచుగా వింటున్న ఈ పేరు, పాకిస్తాన్‌లోని ఒక ముఖ్య ప్రాంతం. ఆ దేశంలోని నాలుగు ముఖ్య భాగాలలో బెలూచిస్తాన్‌ ఒకటి. ఆది నుంచి కూడా ఇక్కడ నివసించే ప్రజల నుంచి పాకిస్తాన్‌ పాలకులు వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉన్నారు. తమకు స్వాతంత్ర్యం కావాలంటూ ఇక్కడ నివసించే కొందరు నినదిస్తూనే ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే భారతదేశానికి కశ్మీర్‌ ఎలా సమస్యాత్మకంగా మారిందో, పాకిస్తాన్‌కు బెలూచిస్తాన్‌ అలాగ. కానీ ఈ రెండు సమస్యలూ మొదలైన తీరులోనూ, వాటిని ప్రభుత్వాలు ఎదుర్కొనే రీతిలోనూ చాలా బేధం ఉంది.

 

భారతదేశానికి స్వాతంత్ర్యం రాగానే, కశ్మీర్‌ను మనదేశంలో కలిపేందుకు అక్కడి రాజు హరిసింగ్‌ వెనుకాముందూ ఆడాడు. ఆయన తన నిర్ణయాన్ని తీసుకునే వరకు, ఇండియా వేచి చూసింది. కానీ బెలూచిస్తాన్‌ విషయంలో అలా కాదు. స్వాతంత్ర్యానంతరం అక్కడి పాలకుడు అహ్మద్‌ యార్‌ఖాన్‌, పాకిస్తాన్‌కు దక్షిణాన ఉన్న తమ రాజ్యం స్వతంత్ర్యంగానే ఉండిపోవాలని ఆశించాడు. కానీ యార్‌ఖాన్‌ నిర్ణయం కోసం వేచి ఉండటానికి అదేమీ భారతదేశం కాదు. ఏప్రిల్‌ 1948 నాటికి బెలూచిస్తాన్‌లోకి ప్రవేశించిన పాక్‌ సైన్యం, ఆ ప్రాంతాన్ని బలవంతంగా తమ అధీనంలోకి తెచ్చుకుంది. దిక్కుతోచని స్థితిలో యార్‌ఖాన్ తన రాజ్యాన్ని అప్పగించాడు. అయితే బెలూచిస్తాన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలని కోరాడు. ఆ మాటని పాకిస్తాన్‌ ఎలాగూ పట్టించుకోలేదు.

 

బెలూచిస్తాన్‌లో స్థానికంగా ఉండే తెగలని పాకిస్తాన్‌ ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకుపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. తమకు తగిన ప్రాతినిధ్యం కావాలంటూ స్థానికులు చేసిన తిరుగుబాటుని ఆ దేశం అణిచివేయడంతో, నిరసన గళాలు మరింత పదునెక్కాయి. ఇక దేశంలోని అన్ని ప్రాంతాల మీదా కేంద్రానికి పూర్తి అధికారాలు ఉంటాయంటూ పాకిస్తాన్‌ 1950ల్లో ‘one unit’ పాలసీని ప్రకటించడంతో తిరుగుబాటు మరింతగా విజృంభించింది. బెలూచిస్తాన్‌లో అధికంగా ఉండే బెలూచి, బెహ్రూయి వంటి తెగలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకటి కావడం మొదలుపెట్టాయి.

 

ఎప్పుడైతే తిరుగుబాట్లు మొదలయ్యాయో, ప్రభుత్వ అలసత్వం కూడా మొదలైంది. బొగ్గు మొదలుకొని బంగారం దాకా ప్రకృతిసిద్ధంగా ఎంతో సారవంతమైనా కూడా బెలూచిస్తాన్‌లో జీవన విధానం దారుణంగా తయారైంది. అక్కడి నిధినిక్షేపాలను పాకిస్తాన్‌ కేంద్రం తవ్విపారేస్తూనే, స్థానికంగా మాత్రం ఏమాత్రం అభివృద్ధి జరగకుండా జాగ్రత్త తీసుకోసాగింది. ఇప్పటికీ బెలూచిస్తాన్‌లో 25 శాతం మంది నిరక్షరాస్యులు. అక్కడి నిరుద్యోగం శాతం 30 శాతం. ఇక అక్కడి జనాభాలో కేవలం 7 శాతం మందికే తాగునీటి సౌకర్యం ఉంది. దాదాపు 50 శాతానికి పైగా పేదరికంలో మగ్గిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గ్యాస్ నిక్షేపాలు అపారంగా ఉన్నా వంటకి గ్యాస్‌ని వాడుకునే అవకాశం అతి స్వల్పం.

 

తమ ప్రాంతంలోని వనరులను తరలించుకుపోతూనే, తమను పేదరికంలో ఎండబెడుతున్న ప్రభుత్వం పట్ల అక్కడి ప్రజల్లో మరింత వ్యతిరేకత మొదలైంది. బెలూచ్ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌, బెలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ... వంటి అతివాద సంస్ధలు ప్రభుత్వంతో పోరుకు సిద్ధపడసాగాయి. ఈ వ్యతిరేకతని పైకి ప్రకటించేవారు కనిపించకుండా పోయేవారు. అక్కడి విషయాల గురించి రాసేవారు కూడా శవాలుగా తేలడం మొదలుపెట్టారు. కశ్మీర్‌లో ‘ఇండియా ముర్దాబాద్’ అంటూ నినాదం చేసి తప్పించుకోవచ్చు. కానీ బెలూచిస్తాన్‌లో పరిస్థితులు వేరు! తిరుగుబాటు దారుల మీద ఏకంగా పాక్ వైమానిక దాడులను చేయడం మొదలుపెట్టింది. పైగా ‘kill and dump’ పేరుతో వందలాది మందిని పట్టుకుని, వారిని చిత్రహింసలకు గురిచేసి, దారుణంగా చంపి, బహిరంగంగా పడేయడం మొదలుపెట్టింది. ఈ శవాల మీద పాకిస్తాన్ జిందాబాద్‌ వంటి నినాదాలు రాసి ఉండేవి, లేదా పాకిస్తాన్‌ జెండా గుచ్చబడి ఉండేది. స్థానికులను భయభ్రాంతులను చేసేందుకే పాలకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

బెలూచిస్తాన్‌లోని తిరుగుబాటుకు భారతదేశం సాయం చేస్తోందన్నది పాకిస్తాన్‌ ముఖ్య ఆరోపణ. మన దేశ గూఢచర్య వ్యవస్థ (RAW) అక్కడి తరుగుబాటుదారులను రెచ్చగొడుతోందని పాక్ విమర్శిస్తూ వచ్చింది. అయితే ఈ ఆరోపణలను భారతదేశం ఖండిస్తూనే వచ్చింది. కశ్మీర్‌లో పాకిస్తాన్‌ జోక్యాన్ని తక్కువ చేసేందుకే, ఆ దేశం ఇలాంటి ఆరోపణ చేస్తోందని భారతదేశం అంటోంది. అయితే బెలూచిస్తాన్‌లో గత వారం ఒక భారతీయ మాజీ నౌకాదళ ఉద్యోగి పట్టుబడటంతో, పాకిస్తాన్‌ తన ఆరోపణలను తిరగతోడటం మొదలుపెట్టింది.

 

బెలూచిస్తాన్‌లో ఇండియా పాత్ర ఏమోకానీ, చైనా మాత్రం అక్కడి పరిస్థితిని పూర్తిగా తనకు అనుకూలంగా మార్చేసుకుంది. అక్కడ గ్వదర్‌ అనే ప్రాంతంలో భారీ రేవుని నిర్మించడం ద్వారా చైనా పర్షియన్‌ గల్ఫ్‌లో ఉన్న చమురు నిక్షేపాలను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ రేవుని నిర్మించడం ద్వారా అటు వ్యాపారపరంగా చైనాకి లాభం. అక్కడ చైనా ఉనికి ఉండటం వల్ల రక్షణపరంగా పాకిస్తాన్‌కు లాభం. అలా పరాయి దేశానికి సలాం కొట్టి, తన దేశ ప్రజల కడుపు కొట్టిందన్న అపప్రథను పాకిస్తాన్‌ మూటగట్టుకుంది. బెలూచిస్తాన్‌లోని జనం పరిస్థితి ఎప్పటిలాగే దయనీయంగానే ఉంది!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.