వైసీపీ చేసిన విధ్వంసానికి గాడిలో పెట్టాలంటే పదేళ్లు పడుతుంది : సీఎం చంద్రబాబు

Publish Date:May 23, 2025

Advertisement

 

గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసానికి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే పదేళ్లు పడుతుందని ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత  మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజలు తమకు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.‘ 2019-24 మధ్య ఏపీలో భారీగా విధ్వంసం జరిగింది. జగన్ చేసిన విధ్వంసం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే పదేళ్లు పడుతుందన్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కూటమి సర్కార్ రాగానే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. అందుకు అనుగుణంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. గత ప్రభుత్వం రూ.1.20లక్షల కోట్ల బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టింది. ఈ ఏడాదిలో రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి.  హస్తినకు వచ్చిన ప్రతిసారి ఏడుగురు కేంద్రమంత్రులను కలుస్తున్నా. సూర్యఘర్‌ కింద 35లక్షల కుటుంబాలకు కరెంట్ ఇవ్వాలని ఆకాంక్షించామని  సీఎం తెలిపారు. 

ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 10వేల కుటుంబాలకు విద్యుత్‌ ఇస్తాం. సూర్యఘర్‌ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. మా ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ ఇవ్వాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీని కోరాం. అందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ పోలవరంపై సీఆర్‌ పాటిల్‌తో చర్చించాం. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తికి ప్రయత్నాలు చేస్తున్నాం. డయాఫ్రమ్ వాల్‌ను వైసీపీ ప్రభుత్వం నీళ్లలో కలిపేసింది. నాణ్యతలో రాజీపడకుండా పోలవరం నిర్మిస్తాం. బనకచర్ల ప్రాజెక్ట్‌తో ఎవరికీ అభ్యంతరం ఉండదు. బనకచర్ల ప్రాజెక్ట్‌కు రూ. 80 వేల కోట్లు ఖర్చు అవుతుంది. బనకచర్ల ప్రాజెక్ట్‌ ఏపీకి గేమ్‌ ఛేంజర్‌ అవుతుంది. సముద్రంలోకి వెళ్లే నీళ్లనే బనకచర్లకు మళ్లిస్తాం’ అని అన్నారు.

By
en-us Political News

  
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నానికి నకిలీ పట్టాల వ్యవహారంలో ఉచ్చు గట్టిగా బిగిసిందా? అంటూ ఔనన్న సమాధానమే వస్తున్నది. ఇప్పటికే వైసీసీ సీనియర్లు, కీలక నేతలు అన్న ఒక్కొక్కరూ జైలు దారి పడుతున్నారు.
ఏపీలో వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలతో కొమ్మినేని, కృష్ణంరాజు వివాదం నడుస్తున్న తరుణంలో అమరావతి మహిళా రైతులపై సజ్జల కామెంట్స్ అగ్గికి అజ్యం పోసినట్లు అయింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొంటూ జగన్ సొంత మీడియా చానెల్ లో జరిగిన లైవ్ డిబెట్ లో చేసిన వ్యాఖ్యలపై నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో విషవాయువు లీకై ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలైన సంఘటన బుధవారం జరిగింది.
అమరావతి ప్రాంత మహిళలపై అనుచితంగా, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టుకు మద్దతుగా మాట్లాడటమే కాకుండా.. ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టిన మహిళలను రాక్షసులు, పిశాచులు, సంకర జాతి అంటూ నోరు పారేసుకున్న సజ్జలకు ఆంధ్రప్రదేశ్ మహిళాకమిషన్ సమన్లు జారీ చేసింది.
హీరో నిఖిల్ హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌస్ చిత్రం షూటింగ్ లో భారీ ప్రమాదం సంభవించింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆరోగ్య కారణాలపై ఆయన దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ పై కోర్టు సానుకూలంగా స్పందించింది.
రాజధాని అమరావతిని, అమరావతి మహిళలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు.
హానీమూన్ మర్డర్ కేస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అతి పెద్ద సంచలనం. ఈ కేసు వ్యవహారంలో అనేక మలుపులు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయ్. పైకి తన ముందు అక్కా అక్కా అంటూనే లోలోపల తన సోదరిని అతడు బుట్టలో పడేశాడని వాపోతున్నాడు సోనమ్ సోదరుడు గోవింద్.
సరిగ్గా ఏడాది క్రితం అంటే గత ఏడాది జూన్ 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేనాటికి రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్థంగా ఉంది. అరాచక పాలనతో, విధ్యాంసాలతో జగన్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది.
సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీ తల్లికి వందనం పథకాన్ని తెలుగుదేశం కూటమి సర్కార్ గురువారం (జూన్ 12) నుంచి అమలు చేయనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టి గురువారం నాటికి సరిగ్గా ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని ఆరంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. హైదరాబాద్‌ జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
జగన్ సొంత మీడియా చానెల్ లో చర్చ సందర్భంగా అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు వీవీఆర్‌ కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.