పేర్ని నాని ఇక అరెస్టేనా?

Publish Date:Jun 12, 2025

Advertisement

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నానికి నకిలీ పట్టాల వ్యవహారంలో ఉచ్చు గట్టిగా బిగిసిందా? అంటూ ఔనన్న సమాధానమే వస్తున్నది.  ఇప్పటికే వైసీసీ సీనియర్లు, కీలక నేతలు అన్న ఒక్కొక్కరూ జైలు దారి పడుతున్నారు. వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కాకాణి, కొమ్మినేని.. రాజ్ కేశిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, గోవిందప్ప.. ఇలా జగన్ కు సన్నిహితులంతా ఒకరి తరువాత ఒకరుగా జైలు బాటపడుతున్నారు. ఈ అరెస్టులన్నీ కక్ష సాధింపులో భాగమేనని వైసీపీ ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. అధికారంలో ఉండగా నిబంధనలకు తిలోదకాలిచ్చి, ఇష్టారీతిగా చేసిన అక్రమాలు, అవినీతి కారణంగానే ఈ అరెస్టులు అన్న క్లారిటీ ఇప్పటికే ప్రజలలో కనిపిస్తున్నది. ఇక వైసీపీ మౌత్ పీస్ లాంటి ఓ చానల్  
 ఇటీవల నిర్వహించిన చర్చా వేదికలో జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారలేదు. ఈ వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు, వాటికి వంతపాడినట్లుగా వ్యవహరించిన సదరు చానల్ ఇన్ పుట్ ఎడిటర్ కొమ్మినేని అరెస్టయ్యారు. వీరి వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను ఉద్దేశించి వైసీపీ సీనియర్ నేత, పార్టీ కోఆర్డినేటర్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ఆయన కూడా నేడో రేపో కటకటాలు లెక్కించక తప్పదని న్యాయనిపుణులు అంటున్నారు. 

సరిగ్గా ఈ తరుణంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూడా మరో కేసు విషయంలో పీకల్లోతు కూరుకుపోయినట్లు కనిపిస్తోంది.   ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రాంతంలో గత ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు నకిలీ పట్టాలు పంపిణీ చేసిన కేసులో పేర్నినాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు ఉన్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ కువచ్చారు. ఆ కేసులో పేర్ని నాని అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే  పేర్ని నాని, పేర్ని కిట్టు ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ ను హైకోర్టు గురువారం (జూన్ 12) విచారిస్తుంది. అయితే కోర్టు ముందస్తు బెయిలు మంజూరు కాకుంటే? అన్న భయం పేర్ని నానిని వెంటాడుతోంది.

ఆ భయంతోనే హడావుడిగా  నాని పార్టీ నాయకులు, శ్రేణులు, తన అనుచరులతో గురువారం (జూన్ 12) అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన పోలీసులపై, తెలుగుదేశం కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సందర్భం లేకుండా గతంలో రేషన్ బియ్యం అక్రమాల విషయంలో తన భార్యను పోలీసు స్టేషన్ కు పిలిపించి విచారించిన సందర్భాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి టైం నడుస్తోంది.. మన టైం వస్తుంది ఇంతకు ఇంతా తిరిగి ఇస్తాం అంటూ వార్నింగులకు దిగారు. అంతే తప్ప అత్యవసర సమావేశం లక్ష్యం, వ్యూహంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పు విషయంలో ఆయన టెన్షన్ పడుతున్నారని పరశీలకులు విశ్లేషించడానికి కారణంగా చెప్పవచ్చు.  

By
en-us Political News

  
ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగులకు ఆలౌటైంది.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు.
Publish Date:Jul 3, 2025
ఐదు మంది సెంచురీలు చేసినా ఫస్ట్ టెస్ట్ లో ఓటమి భారత్ కి అత్యంత చెత్త రికార్డును తీసుకొచ్చి పెట్టింది. గిల్ కెప్టెన్సీలోని టీమిండియా. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సీరీస్ లో రెండో టెస్ట్ లో ఎలాగైనా సరే విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఆడుతున్నాడు యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్.
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ, రెండుగా చీలిపోయిందా? అంటే, విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టు హస్తం పార్టీ రెండుగా చీలి పోయిందని, మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రియుడి మోజులో పడి ప్రియుడితో కలిసి తన సంవత్సన్నర వయస్సు గల కూతురిని చంపిన కేసులో ఇద్దరు ముద్దయిలకు జీవిత కాలం ఖైదు మరియు 5 వేల రూపాయల జరిమానా విధించారు.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు అస్వస్థతకు గురియ్యారు. ఆయన సీజనల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు.
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలలో కూర్చుని తనివి తీరా చూడాలని భావించిన వారి కోరిక ఫలించలేదు
హైదరాబాద్, ఏస్ఆర్‌నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్‌ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్ స్టార్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.