హానీమూన్ మర్డర్.. మతలబేంటంటే?

Publish Date:Jun 11, 2025

Advertisement

హానీమూన్ మర్డర్ కేస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అతి పెద్ద సంచలనం. ఈ కేసు వ్యవహారంలో అనేక మలుపులు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయ్. పైకి తన ముందు అక్కా అక్కా అంటూనే లోలోపల తన సోదరిని అతడు బుట్టలో పడేశాడని వాపోతున్నాడు సోనమ్ సోదరుడు గోవింద్.

 ఇంతకీ ఎవరీ   సోనమ్? ఈమె ఎవర్ని పెళ్లాడింది? తన భర్తను ఎప్పుడు హతమార్చింది? ఎవరి సాయంతో ఈ పని చేసిందన్న ప్రశ్న చాలా మందిలో ఆసక్తి రేకిస్తోంది. ఉత్కంఠ భరితమైన ఈ విషాదగాథలో నిందితులు సోనమ్- రాజ్ కుష్వాహా కాగా.. మృతుడు రాజా. రాజాకు  సోనమ్ కు మే 11న పెళ్లయ్యింది. వీరు హానీ మూన్ కి   మేఘాలయకు వెళ్లారు.  పెళ్లయిన 12 రోజులకే .. అంటే మే 23న రాజా హత్యకు గురయ్యాడు.  దీనంతటికీ కారణం 21 ఏళ్ల రాజ్ కుష్వాహాతో సోనమ్ కి ప్రేమ వ్యవహారం ఉండటమేనని తెలుస్తోంది. రాజా కుష్వాహా తన స్నేహితులతో కలసి.. రాజాను హతమార్చారని పోలీసులు విచారణలో వెల్లడైనట్టు చెబుతున్నారు.  అంతే కాదు సోనమ్ సైతం ఈ నేరం అంగీకరించినట్టు తెలుస్తోంది.

 అయితే ఈ కేసులో తన సోదరి ప్రమేయం ఉన్నట్టు అధికారికంగా తెలీయడం లేదనీ, ఒక వేళ అదే నిజమైతే.. ఆమెకు తప్పకుండా ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాడు నిందితురాలు సోనమ్ సోదరుడు గోవింద్.  రాజా సోదరుడు విపిన్ తో కలసి మీడియాతో మాట్లాడిన గోవింద్ ఈ డిమాండ్ లేవనెత్తారు. 

హానీమూన్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు రాజా కుష్వాహా మరెవరో కాదు గోవింద్ ఫ్లై- ఉడ్ ఫ్యాక్టరీలో పీఆర్ గా పని చేస్తున్న వ్యక్తే. ఆమాటకొస్తే కుష్వాహా తన సోదరిని అక్కా అక్కా అని పిలిచేవాడని.. ఇద్దరం పక్క పక్కన ఉన్నపుడు తన సోదరి తనతో పాటు కుష్వాహాకూ రాఖీ   కట్టిందనీ గోవింద్ చెబుతున్నారు.   

ఇపుడీ వ్యవహారం ఎందుకంత హాట్ టాపిగ్గా మారిందంటే.. ఇప్పటి వరకూ ప్రపంచ చరిత్రలో హానీమూన్ లో ఉండగానే ప్రియుడితో కలసి తన భర్తను మర్డర్ చేయించిన నవ వధువుగా చరిత్రకెక్కింది సోనమ్. ఒక పక్క దేశంలో భారత్- పాక్ అంటూ యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇదేదీ లెక్క చేయని ఈ ఇద్దరూ ప్రేమికులు (వీరికి మరేదైనా పేరు పెట్టాలి) తమ అడ్డు తొలగించుకోవడంలో భాగంగా ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం దారుణంగా భావిస్తున్నారు. అందుకే ఈ మర్డర్ కేసులో తన సోదరి పాత్ర నిజమైతే, ఆమెకు తప్పక మరణ శిక్ష విధించాలని కోరుకుంటున్నాడు గోవింద్. ఎందుకంటే తాను ఎప్పుడైతే తన సోదరిని రాజా ఇంటికి ఇచ్చానో అప్పటి నుంచీ ఆ కుటుంబంలో ఒక భాగం అయ్యాననీ.. అందుకే  తాను కూడా వారి పక్షమేననీ.. కాబట్టి ఆ కుటుంబానికి నా వల్ల జరిగిన అపరాధానికి తాను న్యాయం కోరుతున్నానని బోరున విలపిస్తూ చెప్పాడు గోవింద్. 

By
en-us Political News

  
ఇటీవలి కాలంలో విమాన ప్రయాణమంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలిన ఘటనలో వందలాది మంది మరణించిన ఘటన మరువక ముందే పలు విమానాలలో సాంకేతిక లోపాల వార్తలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో కల్లీ నెయ్యి వినియోగం కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యిని సరఫరా చేసినది బోలేబాబా డెయిరీ అనీ, ఈ డెయిరీ సరఫరా చేసినది అసలు నెయ్యే కాదనీ, నెయ్యిలా కనిపించే రసాయినాల మిశ్రమమనీ సిట్ నిర్ధారణకు వచ్చింది.
ఆస్తిని పిల్లలకు పించి ఇచ్చేసిన తరువాత చరమాంకంలో పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే చట్టం చూస్తూ ఊరుకోదని చాటిన ఉదంతమింది.
తల్లికి వందనం సొమ్ములు తమ ఖాతాలో జమకాలేదని అన్నందుకు లబ్ధిదారులపై దాడికి పాల్పడిన డిజిటల్ కలెక్టర్ పై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అన్నమయ్య జిల్లా వడిగల వారి పల్లి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న బాబా ఫక్రుద్దీన్ తల్లికి వందనం సొమ్ములు తమ ఖాతాలో పడలేదేంటని ప్రశ్నించిన గండువారిపల్లికి చెందిన అనురాధ ఆమె భర్త శంకర్ వారి కుటుంబ సభ్యులపై దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి జన్మదినం నేడు. ఈ సందర్భంగా చంద్రబాబు తన సతీమణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటంతో భక్తులు తిరుమలేశుని దర్శనం కోసం పోటెత్తుతున్నారు.
గుంటూరు జిల్లా తెనాలి ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. తెనాలిలోని పరిమిడొంకలో నివాసం ఉంటున్న దాసరి రాజేశ్వరి, అంజమ్మ అనే వృద్ధురాళ్ళను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం(జూన్ 19) దారుణంగా హత్య చేశారు.
కలిసోచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాని సామెత.. ఇప్పుడు మన దేశానికి అలాంటి కలిసొచ్చే రోజులు వచ్చాయా? నడిచొచ్చే కొడుకు పుట్టే రోజు వచ్చేసిందా? అంటే అవుననే అంటున్నారు కేంద్ర పెట్రోలియం ,సహజ వనరుల శాఖ మంత్రి హరీదీప్ సింగ్ పూరీ.
రప్పా రప్పా డైలాగ్‌తో మాజీ ముఖ్యమంత్రి జగన్ సోషల్‌మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు. పుష్ష సినిమాలో డైలాగ్ చెప్పి, దాన్ని మీడియా సమావేశంలో మళ్లీ మళ్లీ చెప్పించుకుని మురిసిపోయిన వైసీపీ అధ్యక్షుడ్ని పొలిటికల్ పుష్ప అని నెటిజన్లు తెగ ఆడుకుంటున్నారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించిన వారిలో డీఎన్ఏ పరీక్షల ద్వారా 202 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు ధృవీకరించారు. ఇప్పటి వరకూ 157 మంది మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్య కన్నుమూశారు. సీనియర్ జర్నలిస్టు, ఎపియుడబ్యుజె రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కంచర్ల రామయ్య గురువారం (జూన్ 19) మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో తీసుకుంటున్న ఆయన హైదరాబాద్ లో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
తిరుమలలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ అరుణ్ కుమార్ ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఓ వ్యాపార వేత్త నివాసంలో ఆయన భార్యపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన కేసులో కానిస్టేబుల్ అరుణ్ కుమార్ సహా మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు నిబంధనలను ఉల్లంఘించారని తెలుగుదేశం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.