మరాఠా రెండవ ఛత్రపతి రాజు.. శంభాజీ మహారాజ్ వర్థంతి..!

Publish Date:Mar 11, 2025

Advertisement


ఛత్రపతి శివాజీ.. ఈ పేరు చెబితే దేశ పౌరుల గుండెల్లో గర్వం,  దేశ భక్తి ఉప్పొంగుతాయి.  మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ దేశాన్ని ముస్లిం పాలకుల చేతిలో పడకుండా అడ్డుకోవడంలో శివాజీ మహారాజ్ పాత్ర చాలా ఉంది.  శివాజీ మహారాజ్ కు తల్లి జిజియాబాయి చాలా గొప్ప మాటలతోనూ,  దేశభక్తి,  దైవభక్తి,  వీరత్వం కలగలిపి పెంచింది.  అలాంటి జిజియా బాయి చేతిలో పెరిగినవాడు శంభాజీ మహారాజ్.. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్.  ఛత్రపతి శివాజీ గురించి ఈ దేశానికి తెలిసినంత శంభాజీ మహారాజ్ గురించి మొన్నటి దాకా తెలియదు. శంభాజీ మహారాజ్ చరిత్రను చరిత్రకారులు కాలగర్భంలో కలిపేశారు.  ఇంకా చెప్పాలంటే.. శంభాజీ మహారాజ్ త్యాగానికి గుర్తింపు కూడా లేకుండా మరుగున ఉంచారు. కానీ చావా సినిమాతో ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి దేశానికి తెలిసింది.  అప్పటి నుండి శంభాజీ  మహారాజ్ పట్ల గౌరవం,  ఆయన పట్ల భక్తిభావం పెరుగుతున్నాయి.   మార్చి 11వ తేదీన ఆయన మరణించారు.  ఆయన వర్థంతి సందర్బంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే..

మరాఠా యోధులు వీరత్వానికి పెట్టింది పేరు. ఈ మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి రాజు,  ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు సంభాజీరాజ్ భోస్లే. ఈయనను అందరూ శంభాజీ అనే పిలుస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడం,  మొఘల్ సైన్యాలను ఎదుర్కోవడం ద్వారా దక్షిణ భారతదేశం మొఘలుల చేతిలో పడకుండా చేయడంలో శంభాజీ మహారాజ్ కీలకపాత్ర పోషించాడు. కేవలం 33 సంవత్సరాలు జీవించిన శంభాజీ మహారాజ్ వీరత్వం ఎన్ని శతాబ్దాలు గడిచినా చెప్పుకోదగినది.

1657 సంవత్సలం మే 14న పురందర్ కోటలో శంభాజీ మహారాజ్ జన్మించాడు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ తల్లి సాయిబాయి శంభాజీ చిన్నతనంలోనే మరణించింది. దీంతో రాజమాత జిజాబాయి  శంభాజీ సంరక్షణ చూసుకుంది.  ఛత్రపతి శివాజీ మహారాజ్ ను ఎలా పెంచిందో అదే విధంగా శంభాజీని కూడా పెంచింది ఆవిడ.  ఒక దశలో శంభాజీ మహారాజ్ కు ప్రాణాపాయం పొంచి ఉందని గ్రహించి శంభాజీ చనిపోయాడని శివాజీ మహారాజ్ పుకారు వ్యాప్తి చేశాడు.

శంభాజీ గొప్ప వీరుడు,  మంచి శరీర సౌష్టవం కలవాడు,  అన్నింటి కంటే ఎక్కువగా భాష ప్రావీణ్యం కలవాడు. ఆయన మరాఠా,  హిందీ, ఇంగ్లీషు, మలయాళం తో సహా చాలా భాషలు అనర్గళంగా మాట్లాడేవాడట. ఇక   శంభాజీ మహారాజ్ వీరత్వం, ధైర్యం, తెగువను చావా సినిమాలో చూపించారు.  అయితే ఇది ఆయన వీరత్వం, ధైర్యం, తెగువ ముందు ఇంకా తక్కువే.. ఆయన శత్రువుకు భయపడేవాడు కాదు.  చివరకు మోసపూరితంగా ఔరంగజేబు శంభాజీని బంధించి చిత్రవధకు గురి చేసినా సరే.. హిందూ మతం పట్ల కించిత్తు కూడా అభిప్రాయం మార్చుకోలేదు.  శంభాజీని చిత్ర హింసలకు గురి చేస్తున్న సన్నివేశాలు సినిమాలో చూస్తుంటేనే కళ్లలో నీళ్లు వస్తాయి.  అలాంటిది ఆయనను వాస్తవంగా ఎంత నరకానికి గురి చేసి ఉంటారో తలచుకుంటే ప్రతి దేశ పౌరుడి గుండె బరువెక్కుతుంది. తను అధికారంలోకి వచ్చిన 9 సంవత్సరాలలో జాజారు 120 యుద్దాలు  చేసి ఒక్క యుద్దం కూడా ఓడిపోని వీరుడు శంభాజీ.  అలాంటి శంభాజీ మహారాజ్  త్యాగాన్ని, ఆయన చరిత్రను,  ఆయన పోరాటపటిమను అందరూ తెలుసుకోవాలి.  


                                       *రూపశ్రీ.

By
en-us Political News

  
ప్రతి సంబంధం నమ్మకం, గౌరవం,  అవగాహనపై ఆధారపడి బిల్డ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు, ప్రేమ పేరుతో మొదలై ఆ తరువాత తీవ్రమైన సమస్యలుగా మారే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితులు ప్రతి సంబందంలో అక్కడక్కడా కనిపిస్తుంటాయి...
ఫిబ్రవరి, మార్చి నెలలు వచ్చాయంటే చాలు.. విద్యార్థుల్లో ఒక రకమైన తెలియని ఆందోళన మొదలవుతుంది. ఇంటర్, టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడుతుంటే, ఎంత చదివినా ఏదో వెలితి, చదివింది మర్చిపోతున్నామనే భయం చాలా మందిని వెంటాడుతుంటుంది. కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు...
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి...
ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి...
ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లల పెళ్లిని కళ్లారా చూడాలని, ఆ వేడుకలో భాగం కావాలని ఒక పెద్ద కల ఉంటుంది. కానీ, ఒక రోజు మీ పిల్లలు "నాకు ఇప్పుడే పెళ్లి వద్దు" లేదా "నేను పెళ్లికి రెడీగా లేను" అని చెబితే, ఆ మాట వినగానే మనసు ముక్కలవుతుంది. కోపం, బాధ, ఆందోళన కలగడం సహజం...
ఆదివారం అనే మాట వినగానే మన ముఖాల్లో సంతోషకరమైన చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి,  పని నుండి విరామం తీసుకోవడానికి కేటాయించబడిన రోజుగా పరిగణిస్తారు...
వేగంగా మారుతున్న  జీవనశైలి,  డిజిటల్ యుగంలో పేరెంటింగ్ పద్ధతులు కూడా మారుతున్నాయి. అలాంటి ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు చాలా చర్చించబడుతోంది...
పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందం కాదు; అది రెండు కుటుంబాల కలయిక, రెండు జీవితాల మేళవింపు. కానీ నేటి కాలంలో సంబంధం చూసేటప్పుడు మనం కేవలం ఆస్తులు, అంతస్తులు లేదా...
ఏ బంధం అయినా నిలబడటానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం. అందులో భార్యాభర్తల బంధం మరీ సున్నితమైనది. కానీ ఆ బంధాన్ని ఎంత దృఢంగా మార్చుకుంటారు అనేదే ఇక్కడ ముఖ్యం.  భార్యాభర్తల బంధం బలంగా మారడానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం...
నేటి కాలంలో ప్రజల ఉద్దేశాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. బయటకు ఒకటి చెబుతారు, కానీ తరువాత వారు చేసేది మరొకటి ఉంటుంది. దీని వలన ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం కష్టమవుతుంది...
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.