Publish Date:Jun 17, 2025
వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. లుక్ ఔట్ నోటీసు ఉండగా ఆయన దేశం విడిచి శ్రీలకంకు వెళ్లేందకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోవడంతో పోలీసులు చెవిరెడ్డి భాసక్కరరెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు.
వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. లుక్ ఔట్ నోటీసు ఉండగా ఆయన దేశం విడిచి శ్రీలకంకు వెళ్లేందకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోవడంతో పోలీసులు చెవిరెడ్డి భాసక్కరరెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సిట్ చెవిరెడ్డిపై లుక్ ఔట్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. చెవిరెడ్డి బెంగళూరు విమానాశ్రయానికి వస్తున్నారన్న అత్యంత విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టు వద్ద ఆయనను అదుపులోనికి తీసుకుని విచారణ నిమిత్తం విజయవాడ తరలిస్తున్నారని తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన 2024 ఎన్నికలలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. వైసీపీ హయాంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రభుత్వ విఫ్ గా కూడా పని చేశారు. అంతే కాకుండా తుడా చైర్మన్ గా కూడా ఉన్న ఆయన ఆ పదవిని అడ్డుపెట్టుకుని పలు అవకతవకలు, అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏ వన్ గా రాజ్ కసిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వైఎస్. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణ మోహన్ రెడ్డి, ఈ ఆర్థిక వ్యవహారాలు చూసిన బాలాజీ గోవిందప్పను స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుతో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఉన్న సంబంధాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు దృష్టి సారించారు.
అందులో భాగంగా చెవిరెడ్డి గన్మెన్ మదన్ రెడ్డిని విచారణ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై సిట్ లుకౌట్ నోటీసు కూడా జారీ చేసింది. దీనిపై ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తాను దేనికీ భయపడనని అన్నారు. అటువంటి ఆయన అడ్డుకుంటారని తెలిసీ శ్రీలంకకు అంటూ బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. పరారీ కావడానికి ప్రయత్నించారా అన్న సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chevireddy-bhaskarreddy-arrest-39-200136.html
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం తన వల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.