'డ్రోనా'చార్యుడి చూపు ఇకనైనా నేల మీదకి రావాలి!

Publish Date:Oct 21, 2016

Advertisement

షిమ్లాలో వున్నవాడు స్వెట్టర్ వేసుకున్నాడని... రాజస్థాన్ లోని వాడు కూడా స్వెట్టర్ వేసుకుంటే ఏమవుతుంది? ఎర్రటి ఎడారి లాంటి రాజస్థాన్ లో చెమటలు కారి ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు! అంతే కాదు, స్వెట్టర్ కొన్నందుకు డబ్బులు కూడా వృథా అవుతాయి! ఇవన్నీ కాకుండా చూసే వాళ్లు నవ్వుకుంటారు కూడా!ఈ విషయం అర్థం కావటం లేదు మన ముఖ్యమంత్రివర్యులకి... 

ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు తొలిసారి ముఖ్యమంత్రి అయిన వారు కాదు!ఆయన గతంలోనే సమైక్యాంధ్రను ఏలిన నాయకుడు. ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని పగ్గాలు పట్టుకుని తోలిన వాడు. కాబట్టి ఆయనకు పరిపాలనలో పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. కాని, నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన క్రమంగా  చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు! అదే ఇప్పుడు పెద్ద చర్చగా మారుతోంది! 

ఆంద్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయాక ఇప్పుడు ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అమరావతితో సహా సిటీలు వున్నా , పరిశ్రమలు వున్నా గ్రామాలు, పొలాలు, రైతులు... ఈ మూడు అంశాలే ఏపీకి ఆయువుపట్టు. అందుకే, చంద్రబాబు కూడా ఎంతో కీలకమైన వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ మధ్య వర్షాభావ పరిస్థితులు వస్తే రెయిన్ గన్స్ తెప్పించారు. ఎండిపోతున్న మొక్కలకి మరింత నష్టం కలగకుండా రైతులకి టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు! ఇప్పుడే కాదు చంద్రబాబు మొదటి నుంచీ టెక్నాలజీ అంటే అమాంతం ఆసక్తి చూపిస్తారు! అదే ఆయన బలం... బలహీనత కూడా!

భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో సాంకేతికత చాలా ముఖ్యం. పైగా ముఖ్యమంత్రి స్థాయిలో వున్న వ్యక్తి దాని పట్ల ఆసక్తి కలిగి వుంటే ప్రజలకు చాలా మంచిది. కాని, మన దేశంలో చంద్రబాబులా న్యూ టెక్నిక్స్ పై దృష్టి పెట్టే పొలిటీషన్స్ చాలా అరుదు. అయినా కూడా ఎప్పటికప్పుడు టెక్నలాజికల్ గా అప్ డేట్ అయ్యే బాబు ఇప్పుడు ఆ అలవాటే మైనస్ గా ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు మంచి ఉదాహరణ డ్రోన్స్!

డ్రోన్స్ అంటే సాధారణంగా పోలీసులు, ఆర్మీ వాళ్లు వాడే నిఘా పరికరాలు. మనిషితో పని లేకుండా గాల్లో ఎగురుతూ కెమెరాలతో ఫోటోలు, వీడియోలు తీసి సాయం చేస్తుంటాయి. ఈ డ్రోన్స్ తోనే సరిహద్దుల్లో చాలా దేశాలు పక్క దేశాలపై నిఘా పెడుతుంటాయి. ఇండియా, పాక్ కూడా డ్రోన్స్ ను ఎక్కువగానే వాడుతుంటాయి!

డ్రోన్స్ ఉద్ధేశం భద్రత సంబంధమైన విషయాల్లో వాడకమే అయినా పాశ్చాత్య దేశాల్లో ఈ డ్రోన్స్ ను పంట, పొలాలకు కూడా ఉపయోగిస్తుంటారు. డ్రోన్స్ వ్యవసాయ క్షేత్రాలపై చక్కర్లు కొడుతుంటే వాటి చేత మందు పిచికారి చేయించటం లాంటివి చేస్తుంటారు. అలాగే వాటికుండే కెమెరాలు సువిశాలమైన పొలంలోని ప్రతీ మూలా రైతుకి కనిపించేలా చేస్తాయి. అయితే, ఇవి భారతీయ రైతులకి అస్సలు అవసరం లేదు... 

పాశ్చాత్యులు వాడిన డ్రోన్స్ మన రైతులు కూడా వాడితే బాగుంటుంది కదా అని ఆలోచించారు చంద్రబాబు. అందుకు తగ్గట్టే డ్రోన్స్... ఆంధ్రా పంట, పొలాల్లో చక్కర్లు కొట్టే ఏర్పాటు చేయించారు. కాని, ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, వెస్టన్ ఫార్మర్స్ ఇక్కడి వాళ్లలా చదువుకోని వాళ్లు కాదు. అలాగే వాళ్ల ఫామ్స్ మన వాటిలా రెండు, మూడు ఎకరాల్లో వుండవు. చాలా వరకూ పదులు, వందల ఎకరాల్లో విస్తరించి వుంటాయి. తన పొలమంతా రైతు తిరగాలంటేనే అసాధ్యంగా వుంటుందక్కడ! అందుకే, డ్రోన్లు వాడతారు పాశ్చాత్య రైతులు. 

ఇండియాలోని రైతులు, అందులో ఆంధ్రా రైతుల సంగతి అందరికీ తెలిసిందేగా! వుండేదే చిన్న చిన్న పొలాలు, వాటిల్లో పంటలు పండటమే పెద్ద తపస్సులా మారిపోతోంది. అందుక్కారణాలు అనేకం.... విత్తనాలు కల్తీవి వస్తే రైతు ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఎన్ని మొక్కలు మొలుస్తాయో, ఎన్ని మట్టిలో కలిసిపోతాయో దేవుడికే తెలియాలి. అలాగే, పురుగు మందులు కూడా రైతుని నిండుగా దగా చేసేస్తుంటాయి. ఎక్కడెక్కడికో పోయి డబ్బులు ఖర్చు చేసి... తీసుకొస్తే లాభం కంటే ఎక్కువ నష్టం చేసే పురుగు ముందులున్నాయి మార్కెట్లో! ఇంతే కాకుండా గతంలో వ్యవసాయ శాఖ నుంచి అనుభవం వున్న శాస్త్రవేత్తలు నేరుగా రైతులతో మాట్లాడేవారు. ఏ పంట వేయాలి, ఎలా వేయాలి, ఎప్పుడు వేయాలి లాంటి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఈ వ్యవస్థ మొత్తం వైఎస్ హయాంలో నీర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు అక్కడక్కడా గవర్నమెంట్ నియమించి అగ్రికల్చర్ ఆఫీసర్స్ వున్నా రైతులకి అవసరమైన సమాచారం అంతా సమయానికి అందటం లేదు! ఇవన్నీ కాకుండా చివరగా రైతుకి అసలు పెద్ద సమస్య విత్తనాలు, మందులు వగైరా వగైరా లాంటి వాటి మీద లేని ప్రభుత్వ పెత్తనం రైతు పండించిన పంట మీద వుండటం! విత్తనాలకు, యూరియాకి ఎక్కడా ఫిక్స్ డ్ రేట్ వుండదు. కాని, రైతు దిగుబడికి మాత్రం ప్రభుత్వం అరకొరగా మద్దతు ధర ఇస్తుంది!

ఆంధ్ర ప్రదేశ్ రైతులకి ఇన్ని రకాల సమస్యలున్నాయి. అవన్నీ కలిసి రైతుని అప్పులు, ఆత్మహత్య అనే రాళ్లతో తిరిగే తిరగలిలోకి విసిరేస్తున్నాయి! కాని, సీఎం చంద్రబాబు వాటి మీద కంటే కొత్తగా వచ్చిన డ్రోన్లపై ఎక్కువ దృష్టి పెట్టి కాలం వృథా చేసుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఎంతో ఖర్చు చేసి గాల్లోకి ఎగిరించే డ్రోన్ల వల్ల ఎటువంటి లాభం లేదంటున్నారు. అంతకంటే ముందు బాబు విత్తనాలు, మందులు, మద్దతు ధర వంటి రైతుల నిజమైన సమస్యల నివారణకి కృషి చేస్తే బావుంటుందంటున్నారు...

టెక్నాలజీని అందిపుచ్చుకోవటం మంచి విషయమే. కాని, టెక్నాలజీ మన టెంప్టేషన్ అయితేనే కష్టం. చంద్రబాబు ఈ సత్యం తెలుసుకుంటారని ఆశిద్దాం. డ్రోన్ల కోసం గాల్లోకి ముఖం పెట్టిన ఆయన తొందర్లోనే నేల వైపు చూసి... రైతులకి అండగా నిలవాలని కోరుకుందాం... 
 

By
en-us Political News

  
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.