నల్ల ధనం.... మల్ల యుద్ధం!
Publish Date:Oct 14, 2016
Advertisement
తేలుకుట్టిన దొంగలు అంటారు... తెలుసు కదా! అలాగే వుంటుంది మన రాజకీయ నేతల వ్యవహారం. మిగతా అన్ని విషయాల్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసకున్నా నల్లధనం వద్దకొచ్చే సరికి అంతా ఏకమైపోతారు. దొంగతనానికి వచ్చిన ఇద్దరు దొంగలు తేలుకుట్టినా కూడా కిక్కురుమనకుండా వున్నట్టు అందరూ ఒకరి గురించి ఒకరికి తెలిసినా సైలెంట్ గా వుంటారు. అవసరం, అనర్థం అలాంటిది!
బ్లాక్ మనీ విషయంలో పాలక పక్షం, ప్రతి పక్షం మధ్య క్విడ్ ప్రోకో వుంటుందని మనకు తెలసిందే. కాని, ఆంద్రప్రదేశ్ లో మాత్రం డిఫరెంట్ రాజకీయం నడుస్తోంది. నల్లధనం విషయంలో కూడా టీడీపీ, వైసీపీ పరస్పరం టార్గెట్ చేసుకుంటున్నాయి. తేలుకుట్టిన దొంగల ఫార్ములా ఇక్కడ వర్కవుట్ కావటంలేదు. పైగా గుమ్మడికాయల దొంగ సామెత చక్కగా పని చేస్తోంది!
కొన్నాళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మనీ వివరాలు చెప్పేయండంటూ బంపరాఫర్ ఇచ్చింది. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా వేలాది కోట్లు ఇనప పెట్టెల్లోంచి బయటకు వచ్చాయి. కాని, మన హైద్రాబాద్ నుంచి ఒకాయన తన నల్లధనం పది వేల కోట్లంటూ గవర్నమెంట్ కి చెప్పేశాడట. ఆయన పేరు, వివరాలు సెంట్రల్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో చెప్పదు. ఆ గ్యారెంటీ వుంది కాబట్టే సదరు పెద్దమనిషి తన నల్ల కష్టార్జితం అంతా బయటపెట్టేశాడు. కాని, అనధికారికంగా ఆ సంగతి, ఆయన పేరు టీడీపీ వారికి తెలియటమే ఇప్పుడు రచ్చకి కారణమవుతోంది...
చంద్రబాబు మీడియా ముందుకొచ్చి మరీ హైద్రాబాద్ లో ఒకరు పది వేల కోట్లు నల్లధనం ప్రకటించారని చెప్పటం... ఆ వెంటనే ఇతర టీడీపీ నేతలు నేరుగా జగన్ పేరు కూడా ప్రస్తావించటం... కలకలం రేపింది. బాబు మోదీకి ఒక లేఖ రాస్తే జగన్ కూడా ఓ లెటర్ రాసేశారు. సీక్రెట్ గా వుంచాల్సిన పేర్లు టీడీపికి ఎలా తెలుస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. కాని, ఇక్కడ అసలు సమస్య టీడీపీ వారు ఆరోపించగానే జగన్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని! చంద్రబాబు అండ్ టీమ్ జగన్ని టార్గెట్ చేయటం సహజమైన విషయమే. కాని, వైసీపీ బాస్ టీడీపీ విమర్శల్ని తిప్పి కొట్టకుండా ఢిల్లీకి లేఖ రాయటం ఆయనలోని టెన్షన్ కు సంకేతంలా మారిపోయింది. సీక్రెట్ గా వుండాల్సిన పేర్లు బయటకు ఎందుకు వచ్చాయనటం జగన్ ఉద్విగ్నతకు అద్ధం పడుతుంది. ఎందుకంటే, హైద్రాబాద్ లో పది వేల కోట్లు వున్నది బాబు బినామీలకే అంటూ ఓ వైపు ఆరోపిస్తూ... వారి పేర్లు బయటెలా పెడతారని జైట్లీని ప్రశ్నించటం... లాజిక్ కు అందని విషయం! జగన్ చెప్పినట్టు నిజంగా పది వేల కోట్ల ఆసాములు చంద్రబాబు బినామీలైతే ... వాళ్ల పేర్లు బయటకి వస్తే... జగన్ సంతోషించాలి! అలా జరిగనట్టు కనిపించటం లేదు...
ఆ మధ్య ఓటుకు నోటు అంటూ రెండు రాష్ట్రాల్ని కొన్నాళ్ల పాటూ వార్తల వెల్లువ కుదిపేసింది. ఈ నల్లధనం కూడా అంతే. ఇంకా సూటిగా మాట్లాడుకుంటే ఓటుకు నోటు వ్యవహారం అంత హాట్ కూడా కాదు! జస్ట్ పొలిటికల్ ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం. అంతే. కాని, ఈ మాత్రం దానికే జగన్ అవసరానికి మించి అలర్ట్ అవ్వటం... కాస్త ఆశ్చర్యకరం!
http://www.teluguone.com/news/content/chandra-babu-45-67764.html





