ఏఐ టెక్నాలజీతో అమెరికా రక్షణ వ్యవస్థకు సవాలు.. చైనా యుద్ధవ్యూహాలు

Publish Date:Apr 5, 2026

Advertisement

యుద్ధ వ్యూహాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యంత కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధ తంత్రాలలో కూడా ఏఐ ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతోంది.  ఈ విషయంలో చైనా రెండడుగులు ముందే ఉంది. అమెరికా సైనిక బలగాల కదలికలు, వారి మోహరింపులను పసిగట్టేందుకు చైనా   ఏఐని సాధనం  మలుచుకుంది.   పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, అమెరికా మిలిటరీ రహస్యాలను ఛేదించేందుకు చైనా ఏఐని వినియోగిస్తోంది.

చైనాకు చెందిన పలు సాంకేతిక సంస్థలు శాటిలైట్ ఛాయాచిత్రాలు, విమానాల రాకపోకల డేటా, షిప్పింగ్ సమాచారాన్ని విశ్లేషించడానికి ఏఐని వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా మిజార్‌విజన్ వంటి సంస్థలు ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ (ఓఎస్ఐఎన్టి) ద్వారా సేకరించిన సమాచారాన్ని అత్యంత వేగంగా క్రోడీకరించి, అమెరికా సైన్యం ఎక్కడెక్కడ మోహరించి ఉందో ఇట్టే కనిపెట్టేస్తున్నాయి. ఈ డేటా విశ్లేషణ ద్వారా అమెరికా అత్యంత రహస్యంగా భావించే ఆపరేషన్లను కూడాచైనా పసిగట్టగలుగుతోంది.  

చైనా ప్రభుత్వం చేపట్టిన  మిలిటరీ-సివిల్ ఫ్యూజన్ విధానం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. పౌర అవసరాల కోసం పనిచేసే సంస్థలను కూడా చైనా సైనిక ప్రయోజనాల కోసం వాడుకుంటోంది. ఈ క్రమంలోనే చైనా కంపెనీలు ఏఐ సహాయంతో అమెరికా రక్షణ కవచాలను ఛేదిస్తున్నాయి. దీనివల్ల ఇకపై యుద్ధరంగంలో ఏదీ రహస్యం కాదని,  స్టీల్త్  టెక్నాలజీకి కాలం చెల్లిందని చైనా సంస్థలు సోషల్ మీడియా వేదికగా సవాళ్లు విసురుతున్నాయి.

ఈ పరిణామాలు అమెరికా భద్రతా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అండతో నడిచే ఈ సంస్థలు తమ సైనికులకు ప్రత్యక్ష ముప్పుగా మారాయని అమెరికా హౌస్ సెలెక్ట్ కమిటీ పేర్కొంది. గతంలో ఈ ఏఐ నిఘా ద్వారా చైనా గుర్తించిన కొన్ని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. టెక్నాలజీ సాయంతో అమెరికా రక్షణ వ్యవస్థలోని లొసుగులను చైనా బహిర్గతం చేస్తోంది. ప్రత్యక్ష యుద్ధానికి దిగకుండానే అగ్రరాజ్యం అమెరికాను వ్యూహాత్మకంగా దెబ్బతీసేందుకు ఏఐని చైనా ఒక శక్తివంతమైన నిఘా సాధనంగా మార్చుకుంది. రాబోయే రోజుల్లో   ఏఐ యుద్ధతంత్రం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు కారణమయ్యేలా కనిపిస్తోంది.

By
en-us Political News

  
సిలికాన్ సిటీ బెంగళూరులో ఒక్కసారిగా ఎబోలా వైరస్ భయాలు కలకలం రేపాయి.
ఈ ఆపరేషన్‌లో మొత్తం 100 కిలోలకు పైగా స్వచ్ఛమైన కొకైన్‌ను స్వాధీనం చేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నిషేధిత మాదకద్రవ్యాలు విదేశాల నుంచి సముద్ర మార్గంలో దేశ రాజధాని ఢిల్లీకి తరలించేందుకు స్మగ్లర్లు వ్యూహం పన్నినట్లు అధికారులు గుర్తించారు.
ఆయన చేసిన ప్రసంగాల వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు, సభలలో చేసిన వ్యాఖ్యల రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. అవసరమైతే సంబంధిత సెక్షన్ల కింద మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఉదయం లేచి రైతులు వచ్చి చూసేసరికి ధాన్యం మొత్తం నీటి పాలైంది. అది చూసిన రైతులు కంటతడి పెట్టుకున్నారు.
చిరంజీవి తీవ్ర అనా రోగ్యంతో ఉన్నారని,ఆయన ఆరోగ్యం విషమించిందని తప్పుడు సమాచారంతో వీడియోలు ప్రచారం చేయ డంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
చిన్న వివాదం కాస్తా పెద్ద గొడవగా మారడంతో జెప్టో డెలివరీ బాయ్స్ గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడుతూ రచ్చ రచ్చ చేశారు.
హైదరాబాద్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డు ప్యానెల్ అడ్వకేట్‌గా పేరుగాంచిన మొయిజుద్దీన్ ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భూ వివాదాలు, వక్ఫ్ భూముల పరిరక్షణకు సంబంధించిన కేసుల్లో ఆయన చురుకుగా వ్యవహరించడంతో కొందరు ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పాత రిగ్ ప్రాంతంలో మంటలు ఎలా చెలరేగాయన్నదానిపై స్పష్టత లేదు. వేసవి ఎండల తీవ్రత కారణమా, పంట పొలాల్లో ఎవరైనా తుక్కు కాల్చడం వల్ల మంటలు వ్యాపించాయా అన్నది తెలియాల్సి ఉంది.
గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో, తీవ్రమైన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న భాగ్యనగర ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. మంగళవారం (మే 26) అర్థరాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరాన్ని భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ముంచెత్తింది.
అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ వైమానిక దాడులకు తెగబడితే.. తాము చేసే ప్రతీకారం చాలా తీవ్రంగా, బలంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సారి యుద్ధం మొదలైతే.. ఇరాన్ రియాక్షన్ ప్రాంతీయ సరిహద్దులకే కాకుండా, అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తుందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ పేర్కొంది.
దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు వీధి కుక్కల బెడద తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భక్తుల రద్దీతో కిక్కిరిసే క్యూలైన్లలోనే కుక్కలు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంది.
అయితే ఎవరు ఔనన్నా కాదన్నా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. బారాసత్ టీఎంసీ ఎంపీ కాకొలి ఘోష్ దస్తీదార్, ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన ఒక అధికారిక సమీక్షా సమావేశానికి హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన కాకొలి ఘోష్, ఆ తర్వాత బారాసత్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై-కేటగిరీ భద్రతను కల్పించింది.
ఈ వివాదం మొత్తం పినరయి విజయన్ కుమార్తె టి. వీణా థాయికండియిల్ చుట్టూ తిరుగుతోంది. ఆమెకు చెందిన బెంగళూరు ఆధారిత ఐటీ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు, కొచ్చికి చెందిన సీఎంఆర్ఎల్ కంపెనీకి మధ్య జరిగిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీలే ఈ దాడులకు ప్రధాన కారణం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.