రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు

Publish Date:May 30, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ నంబర్ వన్ గా నిలబెట్టడమే తన లక్ష్యమని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. కడప వేదికగా జరిగిన మహానాడు ముగింపు సందర్భంగా గురువారం  (మే29) సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి సుమాలను పూయిస్తానన్నారు. రాయలసీమ అంటే రాళ్ల సీమ కాదన్న చంద్రబాబు.. రాయలసీమను రాష్ట్రానికి మణిహారంగా మారుస్తామని చెప్పారు. మహానాడు వేదికగా రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. సీమ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి ఫ్యాక్షనిజమే అన్న ఆయన ఈ విషయాన్ని ఆనాడే గుర్తించామని చెప్పారు. సీమ గడ్డపై ఫ్యాక్షన్ ఉండొద్దనే తాను కఠినంగా వ్యవహరించానని గుర్తు చేశారు.  

సీమ అభివృద్ధికి తన వద్ద  ప్రత్యేక బ్లూప్రింట్ ఉందని చెప్పిన ఆయన విద్యా సంస్థలు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు  పారిశ్రామిక కారిడార్లతో  సీమలో ఏ జిల్లాకు ఏం చెయ్యాలన్నదానిపై పక్కా ప్రణాళిక ఉందన్నారు. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఇఈర్, ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్ యూని వర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ వంటి సంస్థలు తీసుకువచ్చామన్నారు. కడపలో హజ్ హౌస్ మొదలుపెట్టి 90 శాతం నిర్మిస్తే... గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేదన్నారు.

ఇప్పుడు ఆ హజ్ హౌస్ ను 6 నెలల్లో హజ్ హౌస్ పూర్తి చేస్తామని చెప్పారు.  లేపాక్షి - ఓర్వకల్ కారిడార్‌లో డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీ, ఆటోమొబైల్ పరిశ్రమలు, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌కు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు.  కడప స్టీల్ ప్లాంట్‌కు గతంలో తాను శంకుస్థాపన చేశాననీ, దానికే మళ్లీ భూమిపూజ చేసి జగన్ నాటకాలాడారనీ చెప్పిన చంద్రబాబు  వచ్చే నెల 12 లోగా  కడపలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఫేజ్ 1లో రూ.4,500 కోట్లతో, ఫేజ్ 2లో మరో రూ.4,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామనీ, దీనిని పూర్తి చేసి 6 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామనీ హామీ ఇచ్చారు. 

By
en-us Political News

  
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య మాగంటి అంత్యక్రియలు నిర్వహించారు. మాగంటి అంతిమ సంస్కారాలు కన్నీటి వీడ్కోలు నడుమ జరిగాయి
నెల్లూరు రామలింగాపురం సర్కిల్‌లో దివంగత నేత ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అజాత శత్రువు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల కథే నా ఆత్మకథ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా స్కూల్ బీజేపీ..నా కాలేజీ టీడీపీ..నా ఉద్యోగం రాహుల్ దగ్గర అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రజలు చైతన్యంతో ఉద్యమించి ,ఎన్నికల మానిఫెస్టోలో పోలీస్ సంస్కరణలు ప్రాధాన్యత అంశంగా పెట్టించి తద్వారా రాజకీయ సంకల్పాన్ని కలిగిస్తేనే భారతదేశంలో పోలీస్ సంస్కరణలు అమలై చట్టబద్ధ పాలన సాధ్యం అవుతుందని విశ్రాంత ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు.
అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి అటవీప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు భారీగా ఎర్రచందనం దుంగలతో పాటు ఒక మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకుని, నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన ప్రజల కథే నా ఆత్మకథ అనే ఆటో బయోగ్రఫీ పుస్తకావిష్కరణ హైద‌రాబాద్‌లోని శిల్పకలావేదికలో అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి నివాళులర్పించారు.
తెలంగాణ మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో నూతన మంత్రులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు.
జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ పార్థివ దేహానికి బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. మాగంటి మృతదేహానికి చూసి కేసీఆర్ కన్నీరు పెట్టుకున్నారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప మందు ప్రసాదం పంపిణీని కార్యక్రమం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తెలంగాణ మంత్రి వర్గంలోకి ముగ్గురు మంత్రులు చేరబోతున్న ఎమ్మెల్యేల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
వైసీపీ నేతల అరెస్టులను జనం పట్టించుకోవడం లేదు.. కాగడా పెట్టి వెతికినా సానుభూతి కానరావడం లేదు! వైసీపీ ఆశలపై ఆ పార్టీ సానుభూతి పరుడు, జగన్ కు వీరాభిమాని అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్ నీళ్లు చల్లేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.