శ్రీరాముడికీ బీజేపీ సభ్యత్వం.. ఆ విషయం ఆయనకు తెలుసా అరవిందా?

Publish Date:Jan 17, 2026

Advertisement

(శ్రీరాముడికీ బీజేపీ సభ్యత్వం ఉంది.. ధర్మపురి అరవింద్)

మొన్నామధ్య  వూరి పెద్ద బస్టాండ్‌లో మిట్టమధ్యాన్నం కాషాయ దుస్తుల్లో ఒకాయన బస్సుదిగాడు. మెల్లగా చెట్టు నీడలోకి వచ్చి సోడా తాగి బెంచీ మీద కూచున్నాడు. అప్పటిదాకా కాగితంతో ఆడుతున్న కుక్కపిల్లతో సహా అక్కడ బెంచీల మీద కూచున్నాళ్లంతా ఆయన్నే చూస్తుండిపోయారు. ఓ అరగంట తర్వాత బస్సు క్లీనర్‌ దగ్గరగా వెళ్లి పలకరించాడు..‘సామీ ఎవరు మీరు? ఇక్కడ ఎవరు కావాల?’ అని. చిన్న గడ్డం సవరించుకుంటూ ‘నర్సిమ్మ కొట్టుకెల్లి   బీడీకట్టట్టుకురారా అంటూ ఆ స్వామి ఆదేశించాడు. అంతే ఆయన మాటతీరు  బాగా దగ్గరగా చూసిన ఆ కుర్రాడు.. ఒరేయ్‌  ఈడు సాములోరు గాదురా.. మన  సత్తిగాడు అని గావుకేక వేశాడు. ఏదో వజ్రాన్ని కనుగొన్నట్టు బస్టాండ్‌ అంతా పరిగెడుతూ అందరికీ స్వామి అసలు పేరుతో సహా ప్రకటించాడు. అంతే వీలయినంతమంది సత్తి చుట్టూ చేరి  అయినా ఇదేం యాశంరా ’ అంటూ ప్రేమగానే తిట్టారు. 

సదరు స్వామి నవ్వి,  వేషం మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. వీధిపేరు, ఊళ్లో బావిపేరు, మున్సిపల్‌ స్కూలు పేరు.. ఇలా అన్నీ  మార్చేస్తున్నారు. నన్నూ మారుస్తారని  ముందుగా నేనే మారిపోయాను. ఎవరో మనల్ని మార్చడం కన్నా మనకు మనము మారడం ఉత్తమం కదా  అన్నాడు స్వామి సత్తి.అందరూ తలగోక్కున్నారు. వీడిలానే వీడి మాటా అర్దమై చావదు, ఏం చెబుతున్నావో సరింగజెప్పరా పిచ్చి సన్నాసీ  అని అరిచింది అరటిపళ్లు అమ్మే ముసలామె. గొంతు సవరించుకుని సత్తి సామి..  అంతా రామమయం  అంటే కేవలం సినిమాలో ఎస్పీ గొంతు చించుకున్న పాటే అనుకున్నామా, కానీ  అది అంతటితో ఆగలేదు, అంతా రామమయం అంటే అంతటా, అన్నింటా రామమయం చేయాలని కొందరు కాషాయాలు బిగించారు. మీకింకా ఆ సంగతి తెలియలేదు. తెలిసేప్పటికీ మీ ఇళ్ల పేర్లన్నీ రాముడితో, కృష్ణుడితో నిండిపోతాయి నాయనలారా  అంటూ జ్ణానబోధ చేశాడు స్వామి సత్తి.  అదెట్టా? అడిగారు కొందరు.

దేవర తలచుకుంటే ఊరేం ఖర్మ దేశమే పేరు మార్చుకుంటుంది. భరతావని మనది. జండా పట్టుకుని చాలా చక్కగా నవ్వుతూ నిలబడి ఉంటుంది. ఆ మాతను మనసులో నిలుపుకుని అంతే పద్దతిలో మనం నడచుకోవాలి అని  ఏలికలు నువ్వూ నేనూ చూడని పాతతరం సీనియర్‌ నాయకుల స్ఫూర్తితో, భక్తి రసం తలకెక్కించుకుని రైల్లో, విమానాల్లో బయలుదేరి వీలయినన్ని ప్రాంతాలు, భవనాలు, కూడళ్లు, గ్రామాల పేర్లు అమాంతం మార్చేస్తున్నారు. అదో దండు. లోకంలో వారిని మించిన రామభక్తులు ఉండటం అసాధ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మీ యింట్లో పెద్దతరం వారూ వీళ్ల ముందు బలాదూర్‌. బతికిబట్టకట్టమంటూ ఇచ్చే కార్డు ముక్క కూడా స్వయంగా రాములవారి భిక్షట. ఏలిక స్వయంగా రామభక్తుడు. అందువల్ల ప్రజలంతా చచ్చినట్టు రామసంకీర్తనతోనే కార్యాలయాల్లో, బడిలో కాలం గడపాలేగాని వేరే లోకం ఉండకూడదు.  అలాగాకుంటే ఆంజనేయులవారికి చెడ్డ కోపం వస్తుందని, కండల మీద బొమ్మలు వేసుకున్న వస్తాదులు ఊరూరా తిరుగుతున్నారు.ఈ భక్తి పారవశ్యంలో వీలయినన్ని ఊళ్లు, బజార్లు, బస్టాండ్ల పేర్లు మారుస్తూ పోతున్నారు. అలవాటులో పొరపాటుగా నా పేరూ మార్చేస్తారేమోనని ముందు జాగ్రత్తకోసం కాషాయం ధరించా. 

ఇంతలో ఎవరో సైకిల్‌ మీద పోతూ ‘జై శ్రీరామ్‌!’ అని అరుస్తూ వెళ్లాడు.   కొంత దూరం వెళ్లి ఆగి మళ్లీ  వెనక్కి వచ్చి అటుగా సిగెరెట్టు తాగుతూ వెళుతోన్న కుర్రాడిని అడ్డగించాడు. నీకు దేశభక్తి లేకపోతే ఎలాగయ్యా.. ఏలిక దేశ ప్రగతి కోసం  సంస్కృతిని కాపాడేందుకు ఎంత చమటోడుస్తున్నాడు.. జైశ్రీరామ్‌ అను ఆయనకు ఉపశమనం కలుగుతుంది అన్నాడు.  ఛస్తే అన్ను.. ఆయనకు దురదేస్తే.. నేను గోక్కోడం ఏమిటయ్యా బుద్ధుందా?’ అని ఎదురు తిరిగాడు.. అంతే ఓ అరగంట అలా గొంతు చించుకున్నారు. ఆనక అలసిపోయి విడిపోయారు. 

రాములవారికీ పార్టీ సభ్యత్వం అంటగట్టినవారు దేశాన్ని ఒకే రంగు పులిమి ఓట్లు గుద్దించుకోవడమనే వారి భవిష్యత్‌ ప్రణాళిక. డబ్బు చేసినవాడికి జబ్బో లెక్కా.. రాముడిని ఎలాగయినా వాడుకోవచ్చని నిర్ధారించుకున్నాక కౌసల్య రూపంలో ఎవరు గుండెలు బాదుకున్నా ఏమీ కాదు..!

By
en-us Political News

  
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గం పరిధిలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంచలన విజయాన్ని కట్టబెట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో గూడెం మహిపాల్ రెడ్డి అండతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.
మున్సిపల్ కార్పొరేషన్‌లో తమకే సంఖ్యా బలం అధికంగా ఉందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కాగా, నెల్లూరు మేయర్ పదవికి దేవరకొండ శ్రీలతని తెలుగుదేశం ఎంపిక‌ చేసిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
2023 ఎన్నిక‌ల నాటి పరిస్థితులను ఒక్కసారి గమనిస్తే.. ఇదే కామారెడ్డి కేంద్రంగా కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్ధి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి పోటీ పడగా, ఇరువురూ పరాజయం పాలయ్యారు. బీజేపీకి చెందిన వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. ఒకే ఎన్నికలో ఇద్దరు సీఎంలను ఓడించిన ఘనత సాధించారు. ఇక ప్రస్తుతానికి వస్తే.. కామారెడ్డిలో ఎప్పుడూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య పోటాపోటీ వాతావరణం ఉంటుంది. అటువంటిది.. ఆ రెండు పార్టీలూ చెట్టాపట్టాలేసుకుని మరీ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులను పంచుకోవడం విడ్డూరంగా ఉందంటున్నారు కామారెడ్డి జనం.
డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, వరప్రసాద్, లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలా పలువురు బ్యూరోక్రాట్లు పాలిటిక్స్ లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు, కుంటున్నారు. వీరిలో జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా పార్టీ తరఫున 2009 లో కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయ సాధించారు.
పురపోరులో ఈ స్థాయిలో పరాజయాన్ని మూటగట్టుకుని కూడా ఓటింగ్ శాతం చూడండి.. గత లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్ల శాతం పెరిగిందనీ, కాంగ్రెస్ కు తగ్గిందనీ చెబుతూ సొంత భుజాలను చరిచేసుకుంటోంది. అయితే.. బీఆర్ఎస్ ఓట్ల శాతం భాష్యంపై జనంలో పెద్దగా స్పందన రావడం లేదు.
జ‌య మ‌ర‌ణించిన వెంట‌నే అన్నాడీఎంకేలో నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ ఉండాల్సిన వారు శశికళ. అయితే.. ఆమె పై అప్ప‌టి వ‌ర‌కూ రిజ‌ర్వులో తీర్పును వెంట‌నే వెలువడి ఆమె జైలుకు వెళ్లడం వెనుక ఉన్నది ఢిల్లీ పెద్దలే అంటారు పరిశీలకులు. అంతే కాదు ఆమెను పార్టీ నుంచి స‌స్పెండ్ కూడా ఆయ్యారు. ఇప్పుడు చూస్తే శ‌శిక‌ళ జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సొంత కుంపటి పెట్టుకుంటున్నారు.
జగన్ అక్రమాస్తుల కేసు, ఓబులాపురం మైనింగ్ కేసులలో సీబీఐ జేడీగా ఆయన దర్యాప్తు సాగించిన తీరు పట్ల అప్పట్లో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా లంచాలు తీసుకున్న జడ్జిని కూడా పట్టుకుని తన నిజాయితీని చాటుకున్నారు.
లోపల కూర్చున్నవారే కరుస్తారు, కుక్కలు కరవవు అని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారంటూ.. బీజేపీ ఎంపీలు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంపీలను అవమానించేలా, వారి పరువుకు నష్టం కలిగించేలా రేణుక మాట్లాడారని ప్రివిలేజ్ కమిటీ ఆమెకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది.
త‌న‌ను ట్రోల్ చేస్తున్నార‌నీ.. వారంద‌రికీ చెప్పేదేంటంటే ఇది జ‌స్ట్ ట్రైల‌ర్ మాత్ర‌మే. ముందుంది అస‌లు సినిమా అంటూ వార్నింగ్ ఇచ్చారు క‌విత‌.
పయ్యావుల బడ్జెట్ ప్రసంగం మొత్తం ఆత్మస్థుతి, పరనిందేనని విమర్శించారు. అంకెల గారడీ తప్ప ఏ మాత్రం పసలేని బడ్జెట్ అంటూ బడ్జెట్ ప్రసంగంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ పేర్లను పదిసార్లు ప్రస్తావించడం తప్ప ప్రజలకు మేలు చేసే అంశాలు లేవని విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ మద్యం కుంభకోణం విషయంలో విజయసాయిరెడ్డి సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇక ఇటీవలి కాలంలో ఆయన ట్వీట్లు, కామెంట్లు అన్నీ కూడా ఆయన కషాయ దళంలో చేరనున్నారన్న ప్రచారానికి కారణమయ్యాయి. తాజాగా విజయసాయి రెడ్డి ఆ ప్రచారంలో ఇసుమంతైనా అవాస్తవం లేదనిపించేలా సామాజిక మాధ్యమం వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.
రాజకీయంగా సిద్ధాంతాలు ఎంత ముఖ్యమో, నేతలతో ఆత్మీయ పలకరింపు కూడా అంతే ముఖ్యమన్న లోకేష్ అంతటితో ఆగకుండా.. ఏఐ క్వాంటం ఎంత అవసరమో మనవీయ సంబంధాలూ అంతే అవసరమని చెప్పారు. కుటుంబాలతో బంధం బలోపేతం కోసమే డిన్నర్ సమావేశాలని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.