పోలవరంపై మాటలకే పరిమితం చేసిన కేంద్రం... ఏపీ ప్రభుత్వానికి నిధులు ఆపేశారు!!

Publish Date:Nov 19, 2019

Advertisement

 

పోలవరం ప్రాజెక్టు విషయంలో రోజుకో చిక్కుముడి బయటపడుతుంది. ఇది జాతీయ ప్రాజెక్టా లేక కేంద్రం ప్రత్యేకంగా చూసే ప్రాజెక్టా అర్థం కాక రాష్ట్ర ప్రభుత్వ అధికారులే తలలు బాదుకుంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పర్యవేక్షణకు కేంద్రమే నియమించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఉనికిని కూడా లేదు. పీపీఏ సిబ్బంది జీతభత్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని రీయింబర్స్ చేసేస్తున్నామని చెబుతూ కేంద్ర ఆర్థిక శాఖ సవాలక్ష నిబంధనలు పెడుతుంది. 2014 కి ముందు ప్రాజెక్టుకి ఖర్చు చేసిన మొత్తానికీ కాగ్ ఆడిట్ నివేదిక ఇవ్వాలని షరతు విధిస్తుంది. దీనిపై కేంద్ర జలశక్తి శాఖకు పంపిన ఆఫీసు మెమోరాండం చూశాక భవిష్యత్తులో పోలవరానికి నిధులు రావడం పై ఆశలు సన్నగిల్లుతున్నాయని నిపుణులంటున్నారు. 

పోలవరం నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి ఇప్పటి దాకా వచ్చిన నిధులు భవిష్యత్ లో రావలసిన నిధులపై రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేకంగా అధ్యయనం చేస్తుంది. ఇప్పటి దాకా 6,727 కోట్లు విడుదలయ్యాయని ఇంకా 5,072 కోట్లు రియంబర్స్ కావలసి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందులో 1,850 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్ర జల శక్తి శాఖ నుంచి వర్తమానం అందింది. ఈ నెల 8 న జలశక్తి శాఖకు ఆర్థిక శాఖ పంపిన ఆఫీసు మెమోరాండంలో పలు కీలక అంశాలు కనిపించాయి. కేంద్ర బడ్జెట్ లో పోలవరానికి కేటాయింపులు లేవని అందులో ఆర్థిక శాఖ తెలిపింది. నాబార్డు ద్వారా రుణం సాయం పొంది జలశక్తి శాఖ ద్వారా పీపీఏ కు దాని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని గతంలో ఇదే కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. బడ్జెట్ లో ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం ప్రధాన అవరోధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుగా కేంద్ర బడ్జెట్ లో నిర్ణీత మొత్తాన్ని కేటాయిస్తే సమయానుకూలంగా నిధులు ఎక్కువగా తీసుకునేందుకు వీలుంటుందని అంటుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో 2020-21 బడ్జెట్ లో పోలవరానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలనుకుంటుంది. 

విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాక పీపీఏ ఏర్పడింది. అయితే పిపిఎతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. తమతో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్రాన్ని ఎప్పట్నుంచో పీపీఏ కోరుతోంది. జలశక్తి శాఖ దానిని ప్రత్యేకంగా గుర్తించక పోవడంతో ఈ సంస్థతో ఎలా ఒప్పందం చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. ఈ నేపథ్యంలో పోలవరాన్ని ప్రత్యేకంగా చూస్తూ జాతీయ జల అభివృద్ధి సంస్థ ద్వారా గాక నేరుగా రాష్ట్రానికే నిధులు మంజూరు చేసేలా ఒత్తిడి పెంచాలనే ఆలోచనలో జల వనరుల శాఖ ఉంది. గతంలో ఏఐబీపీ కింద చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం మేర నిధులు వెచ్చిస్తుండేది.  ఇందులో పోలవరం ప్రాజెక్టు కూడా ఉండేది. కానీ 2014 రాష్ట్ర విభజన చట్టంలో ఈ ప్రాజెక్టును జాతీయ హోదా ప్రాజెక్టుల జాబితాలో చేర్చారు. ఆ తర్వాత ప్రాజెక్టు మొత్తానికి అయ్యే వ్యయం అంతటిని తానే భరిస్తానని కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులో అప్పుడప్పుడు కొంత ఇవ్వడం తప్ప ప్రాజెక్టు కోసం అంటూ ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లేదు కేంద్రం. అంతేకాదు ప్రాజెక్టుకు సంబంధించిన సహాయ పునరావాస అంచనాల పై కేంద్ర ఆర్థిక శాఖ అడిగిన ప్రశ్నలే పదేపదే అడుగుతుంది. ప్రాజెక్టు టెండర్లు పనుల అప్పగింత పై రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిపుణుల కమిటీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ కమిటీ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి చెల్లింపుల్లో అక్రమాలు జరగలేదని రుజువయ్యాకే భవిష్యత్ లో నిధులు మంజూరు చేయాలని ఆఫీసు మెమోరాండంలో ఆర్థిక శాఖ తేల్చి చెప్పడంతో జలవనరుల వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.

By
en-us Political News

  
కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది.
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
డీఎంకే శాసన సభాపక్ష ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
త‌న ప్ర‌భుత్వ అప్పుల‌పై విజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించి, హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు విజ‌య్ ఆరోప‌ణ‌ల‌పై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించొద్ద‌ని హిత‌వు చెబుతూనే.. ఉచిత విద్యుత్‌, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా అడ్డుకునేందుకు మొద‌టి సంత‌కం చేసిన విజ‌య్‌ని స్టాలిన్ అభినందించారు.
విరుద్‌నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి గ్రామానికి చెందిన కీర్తన సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రులు, తాతలు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. చదువులో ప్రతిభ కనబరిచిన ఆమె స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి, తరువాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చేశారు.
ప్రధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా స‌రిగ్గా ఏడాది క్రితం యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ ఢిల్లీలో చేయించారు మంత్రి నారా లోకేష్‌. అప్పటి ఫోటోను ఫ్రేమ్ చేయించి.. అందులో యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ కూడా భద్రపరిచారు. ఇది సీఎం చంద్రబాబు ఇంట్లోకి వెళ్లే ముందు క‌నిపిస్తుంది. ప్రధాని మోదీ ఆ ఫొటోను చూసి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
సాధారణంగా శుభకార్యాలకు నవమిని రిక్త తిథిగా పరిగణిస్తారు. రాముడు పుట్టింది నవమి రోజే కదా? అని కొందరు సమర్థించినా, రాజ్యాధికారానికి నవమి అంత మంచి తిథి కాదు. నవమి రోజు ప్రారంభించే పనుల్లో తరచూ ఆటంకాలు లేదా మధ్యలో విరామాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెలువడే ప్రమాదం ఉంది.
గత కొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆరు రోజుల పాటు ఎడతెగకుండా సాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, మెజారిటీ పార్టీల అండతో విజయ్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
హైదరాబాద్ లోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదివారం ( మే 10) జాతికి అంకితం చేయనున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు.
ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఎన్డీయే కూటమి ఐక్యతను చాటడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.