పని తీరే ప్రామాణికం.. ఇదీ చంద్ర‌బాబు స్కూల్ అంటే

Publish Date:Sep 8, 2024

Advertisement

జగన్ హయాంలో ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అరాచకం తాండవించింది. దాడులకు, దౌర్జన్యాలకూ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. తప్పులు చేసిన వారిపై చర్యలు లేవు.అకృత్యాలకూ, అత్యాచారాలకు, హత్యలకు పాల్పడిన వారిపై కేసులు లేవు, ,చర్యలు లేవు సరికదా ఎదురు బాధితులే వేధింపులకు గురైన పరిస్థతి. వరదలు, తుపానులు వంటి విపత్తులు జరిగిన సమయాలలో ప్రభుత్వం నుంచి స్పందన లేదు, సహకారం లేదు. అసలా ఐదేళ్లూ రాష్ట్రంలోఅసలు ప్రభుత్వం అనేది ఉందా అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. 
ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంలో ఉంది. జవాబుదారీ తనంతో పని చేస్తున్నది. ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్నది. జగన్ ప్రభుత్వం దిగిపోయి, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నిండా మూడు నెలలు కాలేదు. అయినా రాష్ట్రంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అభివృద్ధి ఉరకలేస్తోంది. సంక్షేమం నిజమైన అర్దం ఏమిటో తెలిసేలా పథకాలు అమలు అవుతున్నాయి. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు ప్రభుత్వ వారిని అన్ని విధాలుగా ఆదుకుంటోంది. మూడు నెలలలోనే ఇంతటి మార్పునకు కారణమేంటి? అంటే లభించే జవాబు. నాయకత్వం. సమర్థుడైన నాయకుడు తాను కష్టపడటమే కాదు... తన టీమ్ ను సైతం సమర్థంగా పని చేసేలా గైడ్ చేస్తారు. ప్రభుత్వం, పాలనా అన్నది ఒక సమష్టి బాధ్యత అన్న భావన అందరిలో కలిగిస్తారు. 
టీమ్ స్ఫిరిట్ అన్నది అందరిలోనూ నింపుతారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఒక స్కూల్ లో  ప్ర‌ధానోపాధ్యాయుడు స‌మ‌ర్ధుడైతే.. ఆయ‌న ఆలోచ‌న‌ల‌కు, సూచ‌న‌ల‌కు అనుగుణంగా ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల‌ను ఉన్న‌తులుగా తీర్చిదిద్ద‌ుతారు. అందు కోసం శ్రమిస్తారు.  త‌ద్వారా విద్యార్థుల బంగారు భ‌విష్య‌త్తుకు బ‌ల‌మైన పునాదులు ప‌డ‌తాయి. అదే త‌ర‌హాలో ప్ర‌భుత్వాన్ని న‌డిపించే ముఖ్య‌మంత్రి స‌మ‌ర్ధ‌ుడైతే మంత్రివ‌ర్గం, నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తారు. ప్ర‌జ‌ల సాధక‌ బాధ‌కాల్లో పాలుపంచుకుంటారు. ప్ర‌స్తుతం ఏపీలో సరిగ్గా అలాంటి సమర్థ ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్ర‌భుత్వ‌మే ఉంది. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జ‌రుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. అదే సమయంలో అభివృద్ధినీ ప‌రుగులు పెట్టిస్తున్నారు. కష్టం వస్తే సమష్టిగా కదిలి బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో విజయవాడను భారీ వర్షాలు వరదలూ ముంచెత్తి రోజుల తరబడి ప్రజలు ముంపులో చిక్కుకుంటే.. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కదిలింది. బాధితులను ఆదుకుంది. భరోసా ఇచ్చింది. ధైర్యం చెప్పింది. కష్టాలలో తాము ఒంటరిగా లేమన్న ధీమాను జనంలో కలిగించింది. 

ప్రకాశం బ్యారేజీ వద్ద రికార్డు స్థాయిలో వరద ప్రవాహం రావడం, ఎన్నడూ లేని విధంగా  బుడ‌మేరు పోంగి పొర్లడం.. మూడు ప్రాంతాల్లో గండ్లు ప‌డ‌టంతో విజవాడ‌లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మ‌నిషి లోతు నీళ్లు చేరాయి. అప్ర‌మ‌త్త‌మైన సీఎం చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌ద‌నీరు వ‌చ్చిన కొద్ది గంట‌ల నుంచే ముంపు ప్రాంతాల్లో స్వ‌యంగా పర్యటించి ముంపు బాధితులకు భరోసా ఇవ్వడమే కాకుండా స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. ఏడు రోజులుగా ముంపు బాధితుల‌కు ప్ర‌భుత్వం ఆహారం, కూర‌గాయ‌లు, పాలు, పండ్లు అందిస్తూ వారికి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూస్తున్నారు. ముంపు బాధితులలో ధైర్యాన్ని నింపారు. నేనున్నా అన్న భరోసా ఇచ్చారు. ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం   ప‌డుతుండ‌టంతో ముంపు ప్రాంతాల ప్ర‌జ‌లు ఊపిరిపీల్చుకుంటున్నారు. 

విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద ముంచెత్తిన విష‌యం ప‌క్క‌న‌పెడితే.. వ‌ర‌ద ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం అందిస్తున్న స‌హాయ‌క చ‌ర్య‌లను చూసి దేశం మొత్తం ఆశ్చ‌ర్య‌పోతుంది. ఆపత్సమయాలలో ప్రజలను ఆదుకునే తీరు ఇదే అంటూ ప్రశంసలు గుప్పిస్తోంది.  స‌మ‌ర్ధ‌ సీఎం ఉంటే.. ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య ఎదురైనా ఇబ్బంది ఉండద‌న్న విష‌యాన్ని  చంద్ర‌బాబు నాయుడు దేశానికి మ‌రోసారి చాటి చెప్పారు. విజయవాడ ముంపు బాధితులను ఆదుకోవడంలోనూ, వారికి ధైర్యం చెప్పి భరోసా ఇవ్వడంలోనూ చంద్రబాబే ఒక సైన్యంగా, ఒక ధైర్యంగా నిలబడ్డారు. జాతీయ మీడియా సైతం సీఎం చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తుండటం, మంత్రివ‌ర్గం, అధికారులు, ఎమ్మెల్యేలు ముంపు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తున్న తీరుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా విజ‌య‌వాడ న‌గ‌రంలోకి వ‌ర‌ద రావ‌డానికి కార‌ణ‌మైన బుడ‌మేరుకు ప‌డిన మూడు గండ్ల‌ను ద‌గ్గ‌రుండి పూడ్చివేయించే బాధ్య‌త‌ల‌ను సీఎం చంద్ర‌బాబు నాయుడు నీటిపారుద‌ల శాఖ మంత్రి రామానాయుడుకు అప్ప‌గించారు. చంద్ర‌బాబు ఆదేశాల‌ మేర‌కు రాత్రి, ప‌గ‌లు అనే తేడాలేకుండా.. వ‌ర్షం, చ‌లిని లెక్క చేయకుండా గండ్ల వ‌ద్ద‌నే ఉండి ద‌గ్గ‌రుండి ప‌నులు వేగంగా చేయించారు. మూడు రోజుల్లోనే మూడు గండ్ల‌ను పూడ్చివేసి శెభాష్ రామానాయుడు అనిపించుకున్నారు. ఒక్క రామానాయుడే కాదు.. మంత్రివ‌ర్గం, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ముంపు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న సేవ‌ల‌ను చూసి రాష్ట్ర ప్ర‌జ‌లు హర్షం  వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి ప్ర‌భుత్వాన్ని ఎన్నుకున్నందుకు గ‌ర్వంగా ఉందంటూ పొంగిపోతున్నారు. 

నిర్మ‌ల రామానాయుడుతో పాటు.. మంత్రివ‌ర్గం మొత్తం వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మైంది. గ‌తవారం రోజులుగా మంత్రి నారా లోకేశ్‌ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ, కంట్రోల్ రూమ్ ఉండి వ‌ర‌ద ప్రాంతాల్లో అందుతున్న స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఆర్టీజీఎస్ శాఖ మంత్రిగా లోకేష్ రియల్ టైమ్ గవర్నెన్స్ పవరేంటో చూపారు. వ‌రద ఉధృతంగా ఉన్న మూడురోజులు తన నియోజకవర్గంలో కరకట్టకు కాపలాకాసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వరద తగ్గిన వెంటనే రంగంలోకి దిగి రాష్ట్ర నలుమూలల నుంచి నిత్యావసర సరుకులు తెప్పించి, బాధితులకు అందించే పనిలో ఉన్నారు. ఇక రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రెండు రోజుల పాటు తన నియోజకవర్గంలో కట్ట‌కు కాపలాకాసి, తర్వాత నుంచి గండ్లుపూడ్చే పనిలో నిమ‌గ్న‌మ‌య్యారు. అలాగే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, తన జిల్లాలో కట్టకు గండి పడకుండా అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. వానలో వరదలో ఆయన ప్రజల మధ్యనే నిలిచారు. వరద తగ్గుముఖం పట్టగానే ముంపు ప్రాంతాలలో  విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలపై దృష్టిపెట్టారు. అత్యంత వేగంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా చూశారు.  మున్సిపల్ శాఖ మంత్రి  పొంగూరు నారాయణ  వరద ప్రాంతాల్లోనే మకాం వేశారు. ప్రజలకు ఏ కష్టం రాకుండా కాపు కాశారు. ముంపు తగ్గిన తరువాత ఆయా ప్రాంతాలలో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని రప్పించి ముంపు ప్రాంతాల్లో క్లీనింగ్ చేయిస్తున్నారు. విపత్తులశాఖ కూడా చూసే హోమ్ అనిత అయితే  విశ్రాంతి అనే మాటే లేకుండా చంద్ర‌బాబు వెంట వరద నీటిలోనే తిరుగుతూ ప్ర‌జ‌ల‌కు ఆహారం, కూర‌గాయ‌లు, పండ్లు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఇక  ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఒకపక్క ముంపు ప్రాంతాలలో పర్యటనలు చేస్తూ, మరో పక్క కేంద్రంతో సంప్రదింపులు జరుపుదూ కేంద్ర సాయం జాప్యం లేకుండా వచ్చేలా చేస్తున్నారు.

 దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో దుర్గ గుడి కిచెన్ లో లక్షల ఆహార పొట్లాలు తయార‌వుతున్నాయి. వండిన ఆహారం అయితే త్వరగా చెడిపోతుంద‌ని మార్కెటింగ్, వ్యవసాయ శాఖల ద్వారా లక్షల సంఖ్యలో యాపిల్స్ సేకరించారు. ఇక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాంమ‌నోహ‌ర్ నాయుడు మొదటి రెండు రోజులు కంట్రోల్ రూమ్‌లో ఉండి వ‌రద ముంపు ప్రాంతాల్లో అధికారుల‌కు త‌గు సూచ‌న‌లు చేస్తూ వ‌చ్చారు. అదే సమయంలో చంద్రబాబు సూచనల మేరకు డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహార పదార్ధాలు అందించే విషయంలో సత్వర అనుమతులు వచ్చేలా చేశారు. మ‌రో కేంద్ర మంత్రి తన నియోజకవర్గంలో వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితుల‌కు అండ‌గా నిలబడ్డారు.  ఇక రాష్ట్ర వ్యాప్తంగాఉన్న తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ ఎమ్మెల్యేలు  ముంపు ప్రాంతాల్లో బాధితుల‌కు ఆహారం, కూర‌గాయ‌లు, పండ్లు స‌ర‌ఫ‌రా చేయ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు. మంత్రులంతా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఉంటే.. రాష్ట్రంలో సాధార‌ణ పాల‌న ప‌రిస్థితి ఏమిట‌? అన్న అనుమానాలే ఎవరికీ కలగకుండా పాలన సాగింది. 
ఒక వైపు మంత్రులంతా వరద ముంపు ప్రాంతాలలో సహాయ పునరావాస కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్న సమయంలో.. వరద ముంపులో ఉన్న విజ‌య‌వాడ‌లోనే వేదాంత కంపెనీ  83వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు ముంచుకొచ్చింది. ఈ కార్య‌క్ర‌మానికి  పెట్టుబ‌డుల శాఖ మంత్రి హాజరయ్యారు. మరో మంత్రి ఢిల్లీలో మంత్రుల సదస్సులో ఉన్నాడు. రోజువారీ ప్ర‌భుత్వలో జ‌ర‌గాల్సిన ప‌నుల‌న్నీ జరుగుతూనే ఉన్నాయి. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో ఏపీలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పాల‌న‌ను చూసి దేశం మొత్తం ఆశ్చ‌ర్య‌పోతుంది. ఇదీ ప్ర‌భుత్వాన్ని న‌డిపించ‌డం అంటే.. ఇదీ ప్రజల విషయంలో బాధ్యతగా ఉండడం అంటే.. ఇదీ ప్రజలకోసం పని చేయడం అంటే.. అంటూ దేశ‌వ్యాప్తంగా ప్ర‌ముఖుల నుంచి, రాష్ట్ర ప్ర‌జ‌ల నుంచి చంద్ర‌బాబు, ఆయ‌న టీంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. 

By
en-us Political News

  
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.