Publish Date:Dec 17, 2019
టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలకు నిధుల సంకటం ఏర్పడింది. గతంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులతో క్షేత్ర స్థాయిలో ప్రజలు కోరిన పనులు చేపట్టగలిగే వారు. పనిలో పనిగా సొంత పార్టీ ముఖ్య నేతలకి కూడా అందులోనే అన్ని సర్దుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ లో ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది. నియోజక వర్గ నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేయడం లేదు. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పార్టీ కార్యకర్తలకు ఎలా సర్ది చెప్పుకోవాలో తెలియక లోలోపల తికమకపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల చేయాలని పట్టుబడుతున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోని కొన్ని నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా మునిసిపాలిటీలు కార్పొరేషన్ లుగా అప్ గ్రేడ్ చేశారు. వాటిలో పాగా వేయాలన్నది టీఆర్ఎస్ నేతల ఆలోచనగా ఉంది. అప్ గ్రేడ్ అయిన మునిసిపాలిటీలు కార్పొరేషన్లలో పలు సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని ఎమ్మెల్యేలు కేటీఆర్ దృష్టికి తెచ్చారు. ఈ నేపధ్యంలో కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ముందుగా అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలన్నది టీఆర్ఎస్ పెద్దల లక్ష్యంగా ఉంది.
మున్సిపల్ ఎన్నికల పై గులాబి పార్టీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఒక్కో మున్సిపాలిటీలో ప్రధాన సమస్యలను గుర్తించాలని పార్టీ నేతలను ఆదేశించింది. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్య పనుల పై దృష్టి కేంద్రీకరించాలని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేసినట్టు భోగట్టా. కొత్తగా చేపట్టాల్సిన పనుల విషయమై అధికారులతో మాట్లాడి శంకుస్థాపనలకు ముహుర్తాలు ఖరారు చేసుకోవాలని స్పష్టం చేశారు.ఈ తరుణంలో ఒక్కో మునిసిపాలిటీలో కనీసం 30 వరకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేపట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు బిజీగా వున్నారు. వచ్చే ఏడాది జనవరి మూడో వారంలోనే ఎన్నికలు జరగడానికి ఆస్కారం ఉందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా కార్పొరేషన్ లో డివిజన్ల వారీగా అనేక మంది ఆశావహులు పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు మంత్రుల చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. ఒక్కో స్థానంలో టికెట్ ఆశించే వారు లెక్కకు మిక్కిలిగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక పార్టీ పెద్దలకి సంక్లిష్టంగా మారింది. దీంతో ఆ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకే కేటీఆర్ అప్పగించినట్టు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-working-president-ktr-focus-on-municipal-elections-39-92287.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.