Publish Date:May 13, 2026
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన సైనిక వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే కొనసాగుతున్న ఘర్షణల మధ్య, ఇరాన్పై మరింత తీవ్రస్థాయిలో విరుచుకుపడేందుకు అమెరికా రక్షణ శాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఆపరేషన్ స్లెడ్జ్హ్యామర్ అనే పేరుతో భారీ సైనిక చర్యకు ఉపక్రమించనుంది.
గత కొద్ది కాలంగా ఇరాన్పై అమెరికా చేపట్టిన సైనిక చర్య ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ ఆపరేషన్ పెద్దగా ఫలించలేదు. పైపెచ్చు అమెరికా వ్యూహాల డొల్లతనం ప్రపంచానికి ప్రస్షుటమంది. దీంతో ఈ ఆపరేషన్ పేరు మార్చి మరింత పదునైన వ్యూహాలతో, మరింత తీవ్రమైన దాడులను చేపట్టాలని అగ్రరాజ్యాధినేత ట్రంప్ నిర్ణయించారు. ప్రస్తుతం ఇరాన్ తో కాల్పుల విరమణ విఫలం అవుతున్న నేపథ్యంలో ఆపరేషన్ స్లెడ్జ్హ్యామర్ పేర భారీ ఎత్తున వైమానిక, క్షిపణి దాడులు చేపట్టేందుకు పెంటగాన్ సన్నాహాలు చేస్తోంది.
ఈ పేరు మార్పు వెనుక కేవలం వ్యూహాత్మక కారణాలతో పాటు.. చట్టపరమైన అంశాలు కూడా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా చట్టాల ప్రకారం.. ఏదైనా సుదీర్ఘ యుద్ధం కోసం కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. అయితే, కొత్త ఆపరేషన్ పేరును తెరపైకి తేవడం ద్వారా, ఇది ఒక కొత్త సైనిక చర్య అని వాదిస్తూ కాంగ్రెస్ ఆమోదం పొందే గడువును మరింత పెంచుకోవచ్చని ట్రంప్ యోచనగా పరిశీలకులు చెబుతున్నారు.
ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పీక్స్ కు చేరుకున్నాయి. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేయడం, మరోవైపు అమెరికా తన యుద్ధ నౌకలను మోహరించడంతో ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. ఇరాన్ తీరుపై ఆగ్రహంగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అవసరమైతే ఆత్మరక్షణ కోసం దాడులు చేసేందుకు తాము వెనుకాడబోమని ఇటీవల స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ వైపు నుంచి ఏ చిన్నపాటి కదలిక వచ్చినా, ఆపరేషన్ స్లెడ్జ్హ్యామర్ పేరుతో ఆ దేశ అణు, సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులకు దిగే అవకాశం ఉందంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/america-to-launch-operation-sledgehammer-on-iran-36-219707.html
ఏపీ నమూనా స్ఫూర్తితో ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోని రేషన్ బియ్యం బస్తాలన్నింటికీ క్యూఆర్ కోడ్ విధానాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
గత ఏడాది మార్చిలో భారతీరాజా కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఆ పుత్రశోకం భారతీరాజాను మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. అప్పటినుంచి ఆయన వయోభారంతో పాటు తీవ్ర మానసిక ఒత్తిడి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు.
అది గరిష్టంగా 20 సంవత్సరాల పాటు లేదా సదరు వ్యక్తికి 40 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరిగి, లైసెన్స్ను ప్రతి ఐదు లేదా పదేళ్లకు ఒకసారి రీన్యూవల్ చేయించుకోవాల్సి వస్తోంది. ఈ పాత పద్ధతికి పూర్తిగా స్వస్తి పలికి.. ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్రం సరికొత్త యోచన చేస్తోంది. ఇందులో భాగంగానే డ్రైవింగ్ లైసెన్స్ గడువును ఏకంగా వాహనదారుడికి 50 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు పొడిగించేలా మార్పు తీసుకురావాలని భావిస్తోంది.
తమ ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు సుమారు రూ.1.5 కోట్ల నగదు, పలు స్థలాలకు సంబంధించిన పత్రాలను కోడలు బంధువులు తీసుకెళ్లారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటి గురించి ప్రశ్నించగా ఓ రౌడీషీటర్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దాడుల సమయంలో ఆయన నివాసంలో సుమారు 60 లక్షల రూపాయల నగదు లభించగా.. బ్యాంక్ ఖాతాల్లో మరో కోటి అరవై లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు.ఇక బంగారం విషయానికి వస్తే దాదాపు రెండున్నర కిలోల బంగారు బిస్కెట్లు.. అలాగే పెద్ద మొత్తంలో బంగారు ఆభర ణాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కిలోల కొద్దీ వెండి వస్తువులు కూడా దొరికినట్లు సమాచారం.
ఇటీవల లూసియానా రాష్ట్రంలోని ఓ సరస్సులో జరిగిన ప్రమాదంలో తన స్నేహి తులు చిక్కుకున్న సమయంలో వారిని కాపాడే ప్రయత్నంలో నీటిలోకి దిగిన అనురూప్ రెడ్డి, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పలువురు హృద యాలను కదిలించివేసింది
నగరంలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యంచెప్పారు. మంత్రి లోకేష్ వెంట హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు ఉన్నారు.
శరీర భాగాలైన తల, కాళ్లు, చేతులు లేకపోవడంతో తొలుత ఎటువంటి ఆధారాలు లభించ లేదు. అయితే మృతదేహం పై ఉన్న దుస్తులు కీలక క్లూగా మారాయి. ఆ దుస్తులు ఒక ప్రముఖ బ్రాండెడ్ కంపెనీకి చెందినవిగా గుర్తించిన పోలీసులు..దర్యాప్తులో భాగంగా ఆ దుస్తుల బార్కోడ్ను స్కాన్ చేయడం ద్వారా.. అవి ఎక్కడ కొనుగోలు చేయబడ్డాయో గుర్తించారు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన గ్యాస్ సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ఇచ్చే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 9 నుండి 4 కి తగ్గిస్తూ కోత విధించింది. అసలు కారణం, సామాన్యులపై పడే ప్రభావం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రముఖ వ్యాపారి నివాసం ఉంటున్నారు. ఇంట్లో నేపాలీ దంపతులను పనిలోకి పెట్టుకున్నారు. నెల రోజుల క్రితమే ఈ నేపాల్ దంపతులను వ్యాపారి ఇంటి పనుల కోసం నియమించుకున్నారు కొద్దిరోజుల క్రితం వ్యాపారి తన కుటుంబ సభ్యుల తో కలిసి ముంబై కి వెళ్లి తిరిగి, ఇంటికి వచ్చిన సమయంలో నేపాలి దంప తులు ఇంట్లో కనిపించలేదు.
కొచ్చిన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా క్రూ సభ్యులు ఒక్కసారిగా కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థ తకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై విమా నాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) సుమారు 20,000 మంది అభ్యర్థుల హైరింగ్ పరీక్షలను అకస్మాత్తుగా రద్దు చేసింది. ఆన్లైన్ ఎగ్జామ్స్లో జరిగిన అక్రమాలే దీనికి కారణమా? ఫ్రెషర్ల ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్లలో ఎన్ఆర్ఐలు, ఓసీఐలు సెబీ రిజిస్ట్రేషన్ లేకుండానే భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆర్బీఐ కీలక సడలింపులు ఇచ్చింది. బడ్జెట్ 2026 పరిమితుల కంటే మరింత ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తూ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.