బ్రదర్ అనిల్ దెబ్బ కొడాలి నాని అబ్బా

Publish Date:Apr 29, 2022

Advertisement

జగన్ కొత్త కేబినెట్‌లో పాత వారు ఎవరు ఉన్నా.. లేకున్నా.. కొడాలి నాని మాత్రం పక్కాగా ఉంటారంటూ ఓ టాక్ అయితే అటు మీడియాలో..... ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అంతేకాదు.. జగన్ కేబినెట్‌లో తాజాగా మాజీలు అయిన వారంతా కూడా కొడాలి నానికి మళ్లీ కేబినెట్ మినిస్టర్ పదవి ఫిక్స్ అనే మాటకు ఫిక్స్ అయిపోయారు. అయితే కొడాలి నాని మరో రెండేళ్ల పాటు మంత్రిగా ఉంటారంటూ ఆయన ఫ్యాన్స్... గుడివాడ యూత్ కూడా పక్కాగా ఫిక్స్ అయిపోయింది. నూటికి నూరు శాతం ఇదే జరుగుతోందని కొడాలి నాని కోటరీ సైతం నమ్మేసింది. 


కానీ జగన్ తన పాత కేబినెట్‌లోని ఎవరి ఎవరినో ఉంచి.. కొడాలి నానికి మాత్రం తొలగించడం .. ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారట. చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ అంటే చాలు... కొడాలి నానిని నిద్రలో లేపి.. అప్పటికప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడించినా.. బూతుల పంచాంగం అందుకుంటారన్న విషయం అందరికి తెలిసిందే. మరి అలాంటి కొడాలి నానిని తొలగించడం వెనుక ఏమైన మంత్రాంగం జరిగిందా? అని సందేహం గుడివాడ నియోజకవర్గ ప్రజల మదిని తెగ తొలిచేస్తోందట. పోని కొడాలి నానిని తొలగించారు సరే.. ఆ స్థానంలో మళ్లీ అదే సామాజికవర్గం వారిని ఎవరినైనా సీఎం జగన్ నియమించారా? అంటే అదీ లేదు. అయితే కొడాలి నాని పదవి ఊస్టింగ్ కావడం.. జగన్ తన కొత్త కేబినెట్‌లో ఆదే సామాజిక వర్గం వారిని నియమించకపోవడం వెనక చాలా పెద్ద తతంగమే నడించిందనే ఓ టాక్ అయితే గుడివాడ నియోజకవర్గంలో తాజాతాజాగా హాట్‌హాట్‌గా హల్‌చల్ చేస్తోంది.

కొడాలి నానికి సీఎం జగన్ చెక్ పెట్టడం వెనుక.... వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ హస్తం ఉందట. ఇటీవల బ్రదర్ అనిల్.. విజయవాడ, విశాఖపట్నం వేదికగా వివిధ మైనార్టీ వర్గాల వారితో వరుసగా భేటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారంతా.. కొడాలి నాని వ్యవహారంపై బ్రదర్ అనిల్‌కు పూసగుచ్చినట్లు వివరించారట. కొడాలి నాని ప్రెస్‌మీట్ పెట్టి.... చంద్రబాబు, నారా లోకేశ్‌లను ఎంత చెడామడా తిట్టినా.. మళ్లీ ఆ సామాజికవర్గం వారికే.. అదీ కూడా పార్టీలకతీతంగా పనులు చేస్తున్నారనే విషయాన్ని బ్రదర్ అనిల్ చెవిలో ఊదినట్లు సమాచారం.  ఆ తర్వాత ఈ విషయాన్ని బ్రదర్ అనిల్ తాడేపల్లి ఫ్యాలెస్‌లోని కీలక నేతల్లో ఒకరిద్దరికి  వివరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ తన కొత్త కేబినెట్‌లో కొడాలి నానికి బర్త్ కన్‌ఫార్మ్ చేయలేదట. అంతేకాదు.. కొడాలి నాని సామాజికి వర్గం వారికి సైతం మొండి చేయచూపారనే ఊహగానాలు కూడా గుడివాడ నియోజకవర్గంలో జోరుగా ఊపందుకున్నాయి.

చంద్రబాబు అండ్ కోతోపాటు ఆయన దత్త పుత్రుడు పవన్ కల్యాణ్‌ అంటూ కొడాలి నాని ప్రెస్‌మీట్ పెట్టి మరీ బండ బూతులు తిడతారీ కొడాలి నాని. అదీకాక.. చంద్రబాబును ఆ రేంజ్‌లో తిట్టగల మొనగాడు.. ఇంకా చెప్పాలంటే.. ఒకే ఒక్కడు కొడాలి నాని అనే ఓ బలమైన ముద్ర ఫ్యాన్ పార్టీలో బలంగా ఉంది. అలాంటి కొడాలి నానిని సీఎం జగన్ తొలగించడం వెనుక బ్రదర్ అనిల్ హస్తం అంటూ ఊహాగానాల నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే జరిగి ఉండవచ్చునని వారు పేర్కొంటున్నారు.  

కొడాలి నానినీ మంత్రి పదవి నుంచి తొలగించే ఉద్దేశ్యం సీఎం జగన్‌కు ఏ కోశానా లేదన్న సంగతి ఆ పార్టీలోని వారందరికీ తెలిసిందే. మరి కొడాలి నానికి జగన్ కొత్త కేబినెట్‌లో కొలువు ఉంటుందని అంతా భావించిన తరుణంలో.. ఆయనకు పక్క పెట్టడం వెనక ఏదో జరిగి ఉంటుందనే భావనలో ఉన్న ప్రజలకు బ్రదర్ అనిల్ వ్యవహారంతో సమాధానం దొరికినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతుండడం గమనార్హం.

By
en-us Political News

  
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.