పీకే కథ ఇంకా వుంది ..

Publish Date:Apr 29, 2022

Advertisement

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, కాంగ్రెస్ పార్టీకి కటీఫ్ చెప్పేశారు. కాంగ్రెస్‌ పార్టీకి తన అవసరం లేదని, ఆ పార్టీ తనకు తానుగానే పునర్‌వైభవం పొందగలదని, చెప్పవలసింది ఏదో చెప్పానని, చేయవలసింది చేస్తే సరిపోతుందని,  తన అవసరం మాత్రం ఇప్పుడు కాంగ్రెస్’కు లేదని స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ అవసరం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి, నిజంగానే ప్రశాంత్ కిశోర్’ కాంగ్రెస్ పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నారా?   భవిష్యత్’ లోనూ మళ్ళీ కాంగ్రెస్’ సంబందాలు పెట్టుకోరా? అంటే, లేదు. “పీకే తలుపులు కాంగ్రెస్ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి” అంటున్నారు ఆయనకు అత్యంత సన్నిహితుదుడు, పొలిటికల్ అనలిస్ట్, రాజ్య సభ మాజీ ఎంపీ పవన్ వర్మ. అయితే  అది ఎప్పుడు అంటే, ఎప్పుడైనా కావచ్చని,చింతన్ శిభిర్ (మే 13-14) తర్వతనైనా కావచ్చును లేదంటే గుజరాత్, హిమచాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతనైనా కావచ్చిని, వర్మ, ‘వైర్’ చానల్’ కరుణ థాపర్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  స్పష్టం చేశారు అంతే కాదు,జాతీయ స్థాయిలో అధికార బీజేపేకి శక్తివంతమైన ప్రతిపక్షాన్ని నిర్మాణం చేయడమే ప్రశాంత్ కిశోర్ ప్రధాన లక్ష్యమని, అది కాంగ్రెస్ లేకుండా అయ్యే పని కాదని, కాబట్టి కాంగ్రెస్’కు సహకరించేందుకు ప్రశాంత్ కిశోర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని వర్మ వివరించారు. అలాగే, కాంగ్రెస్ ఐడియాలజీ గతంలోకంటే ఇప్పుడే దేశానికి అవసరమని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నారని కూడా వర్మ కొత్త విషయం చెప్పారు. ఇంతవరకు ప్రశాంత్ కిశోర్’ అంటే ఒక తెలివైన వ్యాపార వేత్తగానే అందరికీ తెలుసు. ఆయనకు రాజకీయ ఐడియాలజీ, కమిట్మెంట్ ఉన్నాయని ఎవరికీ తెలియదు. ఆయన కూడా ఎప్పుడూ అలాంటి అభిప్రాయం వ్యక్తపరచలేదు. ఒక విధంగా వర్మ కాంగ్రెస్, పీకే సంబంధాలు సజీవంగా ఉంచేందుకు, వర్మ ‘వైర్’  ఇంటర్వ్యూ ను ఉపయోగించుకున్నారు. ఈ నేపధ్యంలోనే, ఐడిలాజికల్, సిద్ధాంత బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కూడా చేశారు, అనుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. 
సో ... ఆ ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత బంధం దృష్ట్యా  పవన్ వర్మ చెప్పిన విషయాలు, వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం, అటు నుంచి పిలుపువస్తే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చెయ్యిచ్చేందుకు ప్రశాంత్ కిశోర్ సిద్ధంగా ఉన్నారు. నిజానికి, కాంగ్రెస్, ప్రశాంత్ కిశోర్’ల మధ్య చర్చలు జరగడం, అర్ధాంతరంగా ఆగి పోవడం ఇదే మొదటి సారి కాదు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలతో విస్తృతంగా చర్చలు జరిపారు. అంతే కాదు, ఆతర్వాత కాంగ్రెస్’తో బ్రేకప్’ అయినా,ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంకా వాద్రా ప్రచార వ్యూహంలో ప్రశాంత్ కిశోర్’ ‘మేథస్సు’ మిళితమై ఉందని అంటారు.మహిళలకు 40 శాతం టికెట్లు ఇవ్వాలనే ఆలోచన, ఎన్నికలకు ముందు ఉన్నావ్ వెళుతూ ప్రియాంక అరెస్ట్ కావడం , ఆమె చీపురు పట్టుకుని గది చిమ్ముకునే వీడియో/ ఫోటో వైరల్ చేయడం, అన్నిటినీ మించి, ‘లడ్కీహూ ఔర్ లడ్’సక్తీ హూ’ నినాదం ఇవ్వన్నీ కూడా ప్రశాంత్ కిశోర్ మానస పుత్రికలే అనే ప్రచారం జరిగింది. నిజానికి. అందుకే కావచ్చును ప్రశాంత్ కిశోర్’ పక్కా బిజినెస్ మ్యాన్ అయినా ఎక్కడో ఆయనలో కాసింత కాంగ్రెస్ బ్లడ్ మిగిలుందేమో అని అనుమానాలు కూడా అప్పుడప్పుడు వ్యక్తమవుతున్నాయి. 
అదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రశాంత్ కిశోర్’ తలుపు తడుతుందా ? అలాంటి అవసరం వస్తుందా అంటే, అందుకు  ప్రశాంత్ కిశోరే ... ఒకటికి రెండు సమాధానాలు ఇచ్చారు. కాంగ్రెస్’ కు బ్రేకప్ చెప్పిన సందర్భంలో చేసిన ట్వీట్’ లో పీకే, ‘కాంగ్రెస్ పార్టీకి తన కంటే, నిర్మాణాత్మకమైన సమస్యలను పరివర్తనాత్మకమైన సంస్కరణల ద్వారా మార్చే నాయకత్వం, సమిష్టి పట్టుదల అవసరం’ అని పేర్కొనారు. అంటే కాంగ్రెస్ పార్టీకి కావలసింది, వ్యూహాలు కాదు. నాయకత్వమని, అది ఇప్పుడు పార్టీకి లేదని చెప్పకనే చెప్పారు. అలాగే, కాంగ్రెస్ పార్టీలో పాతుకుపోయిన సంస్థాగత బలహీనతలు ఏమిటో, ఎవరికీ తెలియంది కాదు. ఇంచుమించుగా రెండు సంవత్సరాలకు పైగా జీ 21 నేతలు నోటితో చేపుతున్న మాటలనే పీకే స్లైడ్స్ ‘లో చూపించారు. నిజానికి, ఈ విషయంలోనూ పీకేను తప్పు పట్టవలసిన అవసరం లేదు. బ్రేకప్ తర్వాత ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే అదే విషయం చెప్పారు. ప్రెజెంటేషన్’ కు ముందు మాటగానే, “ఇందులో చెప్పే విషయాలు ఏవీ కొత్తవి కాదు. ఇంతకు ముందు ఎవరూ చెప్పకే చెప్పారు.  అయితే, ఆయనే ఉంటే ... క్షురకునితో పనేమిటి’ అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య నాయకత్వ సమస్య. జీ 23 నేతలు చెప్పింది అదే. పీకే చెప్పింది అదే. సో .. కాంగ్రెస్ సమస్యకు పరిష్కారం కాంగ్రెస్’లోనే వుంది. కాంగ్రెస్ పార్టీ బలం బలహీనత రెండూ’ నెహ్రూ గాంధీ కుటుంబమే .. అదే అసలు సమస్య.

By
en-us Political News

  
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.