బీజేపీలో బొత్స చేరిక ఖాయమా?

Publish Date:Dec 23, 2014

Advertisement

 

మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరబోతున్నట్లు మళ్ళీ వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనను పక్కను పెట్టి రఘువీరా రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టినప్పటి నుండి ఆయన పార్టీకి దూరంగా మసులుతున్నారు. అప్పటి నుండే ఆయన బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నప్పటికీ ఇంతవరకు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ ఈ మధ్యనే బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు ఆయనతో విజయనగరంలో సమావేశమయిన తరువాత ఆయన పార్టీలోకి చేరేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని మీడియాకు చెప్పినట్లు వార్తలు వచ్చేయి.

 

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్-కమిటీ గత ప్రభుత్వాల హయంలో జరిగిన అక్రమ మైనింగ్ లైసెన్సులను, భూకేటాయింపులను, ఇసుక త్రవ్వకాలు, ఎర్ర చందనం స్మగిలింగ్, లిక్కర్ సిండికేట్, రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంస్థలలో జరిగిన అవినీతి అక్రమాలను త్రవ్వి తీసేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేస్తోంది. బొత్స సత్యనారాయణను కూడా విడిచిపెట్టేది లేదని సబ్ కమిటీలో మంత్రులు చాలా స్పష్టంగానే చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఈ కేసుల నుండి బయటపడాలంటే బీజేపీలో చేరడమే ఏకైక ఉపాయంగా కనబడుతోంది. పైగా రాష్ట్రంలో, దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంధకారంగా కనబడుతున్నప్పుడు, ఆయనని పక్కన పెట్టిన పార్టీని పట్టుకొని వ్రేలాడటం వలన లాభం కంటే నష్టమే ఎక్కువ. కనుక బీజేపీ అనుమతిస్తే ఆయన ఆ పార్టీలో చేరే అవకాశాలున్నాయి.

 

అయితే తనపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కేసుల పెట్టకుండా నిలువరించాలనే షరతుతోనే ఆయన బీజేపీలో చేరినట్లయితే అప్పుడు ఆ బీజేపీ అధిష్టానం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసినా లేకపోతే ఆయన బీజేపీలో చేరిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టినా అది తెదేపా-బీజేపీల స్నేహానికి గండి కొట్టవచ్చును. ఆయనను తీవ్రంగా వ్యతిరేకించే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఒకవేళ బొత్సను పార్టీలో చేర్చుకొన్నట్లయితే అప్పుడు ఆయన బీజేపీలో చేరేందుకు ఇష్టపడకపోవచ్చును.

 

బొత్స సత్యనారాయణను పార్టీలో చేర్చుకొంటే కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించవచ్చనే భ్రమ కూడా మంచిది కాదు. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో ఆయన ప్రవర్తించిన తీరును చూసి కాపు సామాజిక వర్గం కూడా ఆయనకు దూరంగా జరిగింది. అందుకే సాధారణ ఎన్నికలలో ఆయన కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరూ కూడా గెలవలేకపోయారు. ఒకవేళ ఆయనను బీజేపీలో చేర్చుకొంటే ఎన్నికల ప్రచార సభలలో ఆయనను తీవ్రంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ (ఆయన సామాజిక వర్గానికే చెందిన) కూడా బీజేపీకి దూరం అవవచ్చును.

 

ఎప్పటికయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కలలుగన్న బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విభజన వ్యవహారంలో పార్టీ అధిష్టానాన్ని తప్పు ద్రోవ పట్టించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు ఆ మధ్య మీడియాలో వార్తలు వచ్చేయి. కనుక ఇప్పుడు కూడా ఆయన అటువంటి ప్రయత్నాలే చేసినట్లయితే కేంద్రం సహాయం అందక రాష్ట్రాభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. కనుక ఒకవేళ బీజేపీ ఆయనను పార్టీలో చేర్చుకోదలిస్తే ముందుగా ఈ పర్యవసనాలన్నిటినీ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవలసి ఉంటుంది.

By
en-us Political News

  
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.