జగన్ కు బైబై.. బాబుకు సైసై.. సోము కొత్త పలుకు

Publish Date:Apr 23, 2022

Advertisement

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే ఏపీలో రాజకీయ వేడి వేసవిని మించి పోయింది.  అన్ని పార్టీలకూ  ఎన్నికల సెగ తగిలింది. దాంతో ఇప్పని నుంచే వ్యూహరచనలలో పార్టీలు నిమగ్నమయ్యాయి. కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి.   అనూహ్య పొత్తులూ, ఎత్తులతో రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి  గురి చేస్తున్నాయి. 
అందులో భాగమే వైకాపా, కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు అంశం. నిన్న మొన్నటి వరకూ కనీసం ఊహా మాత్రంగానైనా ఎవరి మదిలోనూ కదలాడని ఈ కొత్త పొత్తు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్యవర్తిత్వంతో తెరపైకి రావడమే కాదు....ఈ పోత్తు ఖాయమనేలా వైసీపీ, కాంగ్రెస్ నేతల నుంచి సంకేతాలు వచ్చేశాయి. దీంతో ఒక్క సారిగా ఏపీ రాజకీయ ఎరీనాలో అతి వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 
బీజేపీ- తెలుగుదేశం పార్టీల మధ్య అంతరం కనుమరుగైపోతుందన్నసంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఓటు చీల నివ్వను అంటూ ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ తెలుగుదేశంతో కలిసి పని చేస్తుందన్న బలమైన సంకేతాన్ని ఇచ్చారు. ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా అదే బాటలో నడుస్తున్నదని పించేలా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు ఉన్నాయి.
తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన సోము వీర్రాజు తాజాగా  జగన్ పాలనతో పోలిస్తే చంద్రబాబు పాలన వెయ్యి రెట్లు నయం అన్నట్లుగా మాట్లాడారు. చంద్రబాబు  పాలన సాఫీగా ఉందని, ప్రస్తుతం జగన్ పాలన అస్తవ్యస్తంగా ఉందనీ వ్యాఖ్యలు చేశారు. 
ఆయన వ్యాఖ్యల నేపథ్యంలోనే బీజేపీ కూడా పవన్ కల్యాణ్ పార్టీలా తెలుగుదేశంతో కలిసి రానున్న ఎన్నికలలో పని చేయనుందని భావించవచ్చు. అయితే ఇప్పటికిప్పుడు సోము వీర్రాజు లేదా బీజేపీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారడానికి కారణమేమిటన్న ప్రశ్నకు వైసీపీ, కాంగ్రెస్ ములాఖత్ అనే సమాధానం వస్తుంది.
 
ఇంత కాలం జగన్ బీజేపీకి వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఒక విధంగా వైసీపీ బీజేపీ బీటీమ్ అన్నవిధంగా రాష్ట్రంలో పాలన సాగించారు. వ్యవసాయ విద్యుత్ మీటర్లకు బిగించడం దగ్గర నుంచి వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రానికి మద్దతు పలకడం వరకూ జగన్ కమలం కనుసన్నలలో పాలన సాగించారు. అయితే...పీకే కాంగ్రెస్ కు దగ్గరవ్వడంతోనే జగన్- బీజేపీల మధ్య దూరం అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు జగన్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ఖరారైన నేపథ్యంలో కమలం కూడా వ్యూహం మార్చి ఇప్పటి దాకా జగన్ తప్పిదాలను, పాలనా వైఫల్యాలను విమర్శించే విషయంలో ఆచి తూచి  వ్యవహరించే వైఖరికి తిలోదకాలివ్వాలన్న నిర్ణయానికి వచ్చేసింది. అదే సమయంలో  రాష్ట్రంలో బలంగా ఉన్న తెలుగుదేశంలో పూర్వపు మైత్రిని పునరుద్ధరించుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా వైసీపీ ప్రత్యర్థి అయిన తెలుగుదేశంలో జట్టు కట్టడం వల్ల వచ్చే ఎన్నికలలో సీట్ల పరంగా కూడా ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది. అందుకే జగన్ వైఫల్యాలను ఎండగట్టడంతో ఊరుకోకుండా గత చంద్రబాబు పాలన ఎంతో నయం అంటూ కితాబులిస్తున్నది. ఏది ఏమైనా వైసీపీ కాంగ్రెస్ పొత్తు అంశం రాష్ట్ర రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు తెరలేపింది. పాత మిత్రులకు ఒక దగ్గరకు చేరుస్తోంది.
 

By
en-us Political News

  
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.
తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు.
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.