LATEST NEWS
  విజయ్, సతీశన్ అడుగుజాడల్లో... వైరల్‌గా మారిన కేరళ సీఎం, మాజీ సీఎంల భేటీ.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ మార్పు సాధ్యమేనా.. భారతీయ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే శత్రుత్వాలు, విభేదాలకు భిన్నంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలలో సరికొత్త ‘ఫ్రెండ్లీ పాలిటిక్స్’ ట్రెండ్ నడుస్తోంది. ఎన్నికల సమరంలో ఎంతగా తలపడినా.. అధికారం దక్కిన తర్వాత అందరినీ కలుపుకొని ముందుకు సాగాలనే ఉన్నతమైన రాజకీయ సంస్కృతిని అక్కడి నేతలు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి, కేరళ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సతీశన్ తాజాగా తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన స్వయంగా మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసానికి వెళ్లి, ఆయనను ఆత్మీయంగా కలుసుకున్నారు. ఉభయ నేతలూ ఎంతో స్నేహపూర్వక వాతావరణంలో రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించడం విశేషం. ఇదే తరహా అరుదైన దృశ్యం కొద్దిరోజుల క్రితం తమిళనాడులోనూ ఆవిష్కృతమైంది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన విజయ్.. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు ప్రతిపక్షాలకు చెందిన పలువురు ప్రముఖ నేతలను స్వయంగా కలిసి మర్యాదపూర్వకంగా సంభాషించారు.     ఈ రెండు పరిణామాలు గెలిచామనే గర్వం కానీ, ఓడిపోయామనే నైరాశ్యం కానీ లేకుండా, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో నేతలు ఎంత పరిణతితో వ్యవహరిస్తున్నారో నిరూపిస్తున్నాయి. ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనే సిద్ధాంతాన్ని వీరు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఈ సానుకూల పరిణామాలపై అటు రాజకీయ విశ్లేషకులతో పాటు ఇటు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం ప్రభుత్వాల పనితీరును మెరుగుపరచడానికి, ప్రజల్లో రాజకీయాల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి ఎంతో దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ముగిసిన తర్వాత కూడా పార్టీల మధ్య వైషమ్యాలు, వ్యక్తిగత విమర్శలు, ప్రతీకార రాజకీయాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు, కేరళ నేతల తరహాలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఆత్మీయంగా కలుసుకునే రోజులు ఎప్పుడు వస్తాయా అని సామాన్య ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. భవిష్యత్తులోనైనా తెలుగు నేలపై ఇటువంటి సంస్కృతి చిగురిస్తుందో లేదో వేచి చూడాలి.  
తిన్నామా ప‌డుకున్నామా తెల్లారిందా..  అన్న‌ట్టు బ‌ట‌న్ నొక్కామా.. జ‌నాన్ని బుట్ట‌లో ప‌డేసుకున్నామా.. దాని వెన‌క  స్కాములు చేసుకున్నామా? అన్న‌ట్టు సాగిన వైసీపీ  పాల‌న‌కు నేడు కూట‌మి  చేస్తున్న  పాల‌న‌కూ ఎంతో తేడా ఉంద‌ని అంటారు విశ్లేష‌కులు.  ప్ర‌స్తుత  కూట‌మి ప్ర‌భుత్వం  ఏపీలో వ‌రుస ప్రాజెక్టుల‌ను తీసుకొస్తూ  ఉద్యోగ ఉపాధి అవ‌కాశాల కేంద్రంగా రాష్ట్రాన్ని మారుస్తోంది.  అందులో భాగంగా.. సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో భారీ రక్షణ రంగ ప్రాజెక్టులకు  కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్ర‌బాబు  కలిసి శుక్రవారం ( మే 15)  శంఖుస్థాపన చేశారు.   పుట్టపర్తి సమీపంలోని గొల్లపల్లి వద్ద పదివేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో  నిర్మించనున్న డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు వీరు పునాదిరాయి వేశారు.  యుద్ధ విమానాల విడిభాగాల తయారీ, అడ్వాన్స్‌డ్ రాడార్ సిస్టమ్స్, క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన కీలక పరికరాల ఉత్పత్తి ఇక్క‌డి నుంచి చేస్తారు.   ఈ యూనిట్ ఏర్పాటులో డీఆర్డీవో సాంకేతిక సహకారం అందిస్తోంది. పుట్టపర్తిలో ఇప్పటికే ఉన్న విమానాశ్రయం, రక్షణ రంగ రవాణాకు, విమానాల టెస్టింగ్ కు అనుకూలంగా ఉంటుంది.   ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో సుమారు 15 వేల‌ నుంచి 20 వేల‌ మంది వ‌ర‌కూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఒక‌ అంచనా.  అయితే ఈ ప‌రిశ్ర‌మ ఇక్క‌డ స్థాపించ‌డంపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా ఇలాంటి  రక్షణ కేంద్రాలు శత్రువుల నిఘాలో ఉంటాయనీ, అందుకే వాటిని ఇక్కడ ఏర్పాటు చేయవద్దనీ అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని.  అయితే, ప్రభుత్వం   దేశ రక్షణకు అవసరమైన ఎస్-400 వంటి అత్యాధునిక రక్షణ కవచాలు ఇక్కడ ఉంటాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తోంది. ఇక  పుట్ట‌ప‌ర్తిలో జ‌రుగుతోన్న‌ శంఖుస్థాపన ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డిఫెన్స్ హబ్‌గా మార్చే దిశగా ఒక పెద్ద అడుగు ప‌డింద‌ని అంటున్నారు రక్షణరంగ నిపుణులు. దీంతో పుట్టపర్తి లాంటి ఆధ్యాత్మిక కేంద్రం ఇప్పుడు పారిశ్రామిక కేంద్రంగానూ మారబోతోందంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ రక్షణ, అంతరిక్ష రంగాలకు హబ్‌గా మారుతోంది. రాష్ట్రంలో ఉన్న ఈ కోవకు  ప్రధాన సంస్థలు ఏమిటన్నది ఒకసారి పరిశీలిస్తే.. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్-  , దేశంలోని ఏకైక అంతరిక్ష ప్రయోగ కేంద్రం. అలాగే బాపట్ల జిల్లాలోని నాగాయలంక వద్ద క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ ప్రొడక్ట్స్ తయారీ కేంద్రం ఉంది.ఎన్ఎస్టీఎల్.. - విశాఖపట్నంలో ఉన్న ఈ సంస్థ నౌకాదళానికి అవసరమైన టార్పెడోలు, మైన్‌లను తయారు చేస్తుంది. విశాఖ‌లోని అచ్యుతాపురంలోనూ బార్క్ కు సంబంధించిన వ్యూహాత్మక ప్రాజెక్టులున్నాయి.   దేశంలో ఎక్కడ రక్షణ పరిశ్రమ పెట్టినా.. అది శత్రువుల నిఘాలో ఉంటుంది. అది పుట్టపర్తి అయినా, బెంగళూరులోని- హెచ్ఏఎల్ అయినా ఒకటే. అందుకే ఇలాంటి ప్రాంతాల వద్ద గగనతల రక్షణ వ్యవస్థలు ఎంతో బలంగా ఉంటాయి. రక్షణ పరిశ్రమలు రావడం వల్ల.. వేల కోట్లలో పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. పాకిస్థాన్ టార్గెట్ చేస్తుంది అని భయపడి పరిశ్రమలు పెట్టకపోతే అభివృద్ధి కుంటుపడుతుంది. పాకిస్థాన్ సరిహద్దు నుంచి ఆంధ్రప్రదేశ్ చాలా దూరంలో ఉంది. ఉత్తర భారతం కంటే దక్షిణ భారతం ఇలాంటి వ్యూహాత్మక పరిశ్రమలకు ఎక్కువ సురక్షితమని రక్షణ నిపుణులు చెబుతున్నారు.  పేర్ని నాని వ్యాఖ్యలు ప్రధానంగా ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని కాకుండా రాజకీయ విమర్శల్లో భాగంగా చేసినవన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది.  సాంకేతికంగా, దేశ రక్షణ అవసరాల దృష్ట్యా ఇలాంటి పరిశ్రమలు రాష్ట్రానికి రావడం అభివృద్ధికి సంకేతం, అవ‌స‌రం కూడా అని అంటారు నిపుణులు.
కాగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి.హన్మంతరావు రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఆయన గురువారం (మే 14)   బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో  ఈ కార్యక్రమానికి హాజరై వీహెచ్ కు అభినందనలు తెలిపారు.  కాంగ్రెస్ హైకమాండ్ కు, మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వీహెచ్   రాజ్యసభకు మూడు పర్యాయాలు ఎంపికయ్యారు. అయితే 2016 తర్వాత ఇంత వరకూ ఆయనకు పార్టీ  పరంగా ఎటువంటి పదవీ దక్కలేదు.  2016లో  ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగిసింది.  అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వీహెచ్… ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయకపోయినా, సమకాలీన రాజకీయాలలో క్రియాశీలంగా ఉంటున్నారు.  బీసీ సామాజిక వర్గానికి చెందిన వీహెచ్ ను  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే.  బీసీ సంక్షేమానికి సంబంధించిన అంశాలలో  ప్రభుత్వం వీహెచ్ సలహాలను స్వీకరించనుంది.  
కేరళం ముఖ్యమంత్రిగా ఎంపికైన వీడీ సతీశన్‌కు తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేర‌కు గురువారం ( మే 14) ఓ ప్రకటనలో  కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ, విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపని  రేవంత్  పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా  నిలిచిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు. విద్య, వైద్యం, అక్షరాస్యతలో కేరళం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్న రేవంత్..  సతీశన్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, పర్యాటకం, పరస్పర సహకారం వంటి రంగాల్లో కేరళం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్ల‌డించారు. కేరళం మరింత ప్రగతి, సుసంపన్నత దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్న‌ట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
కేరళం ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. దాంతో  గత పది రోజులుగా కేరళం ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది   కేరళం సీఎంగా సతీశన్ పేరును గురువారం (మే 14) ఏఐసీసీ ప్రకటించింది. సీఎం పదవి కోసం సతీషన్‌తో పాటు సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్ , రమేష్ చెన్నితాల పోటీపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు అధిష్ఠానం ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో  ఆయనే సీఎం అవుతారని ప్రచారం జరిగింది. అయితే విధేయత లెక్కలు, సీనియర్టీల కన్నా కేరళం క్యాడర్ అభిష్టానానికి తలొగ్గిన కాంగ్రెస్ హైకమాండ్ చివరకు  ప్రజా మద్దతున్న సతీషన్‌‌ వైపే  మొగ్గుచూపింది.   సతీషన్‌కు యూడీఎఫ్ భాగస్వామ్య పక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా గట్టి మద్దతు ఇచ్చింది. కేరళ ఎన్నికలలో  ఐయూఎంఎల్ 22 సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. భాగస్వామ్యపక్షం ఒత్తిడి కూడా ఈ విషయంలో పనిచేసింది. ఎల్‌డీఎఫ్   హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్  కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది.    వి.డి. సతీశన్ పూర్తి పేరు వడస్సేరి దామోదరన్ సతీశన్. 1964, మే 31న ఆయన జన్మించారు. ఆయన స్వస్థలం ఎర్నాకులం జిల్లాలోని నెట్టూరు. ఈయన తల్లిదండ్రులు విలాసిని అమ్మ, దామోదర మీనన్. భార్య లక్ష్మీప్రియ. సతీశన్ దంపతులకు కుమార్తె ఉన్నిమాయ ఏకైక సంతానం. నాయర్ల కుటుంబంలో పుట్టిపెరిగిన సతీశన్ ఉన్నత విద్యావంతుడు. సోషల్ వర్క్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు సతీశన్ కేరళ హైకోర్టులో పదేళ్లపాటు లాయర్ గా   ప్రాక్టీస్ చేశారు. కమ్యునిస్టు కంచుకోటగా ఉన్న పరాపూర్ నుంచి వరుసగా ఆరు సార్లు..  ఎమ్మెల్యేగా  ఎన్నికయ్యారు.  కేరళ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 2001లో కేరళ శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన సతీశన్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు .
ALSO ON TELUGUONE N E W S
హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం స్పైడర్ -మన్ : బ్రాండ్ న్యూ డే నుండి కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించగా, ఇప్పుడు ఈ కొత్త పోస్టర్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ చిత్రం 2026 జూలై 31న ఇండియా లో ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. కొత్త పోస్టర్‌లో టామ్ హోలాండ్ పోషిస్తున్న పీటర్ పార్కర్ తన హూడీ కింద స్పైడర్-మ్యాన్ సూట్‌ను దాచుకుని కనిపిస్తున్నాడు. “ప్రపంచం పీటర్ పార్కర్‌ను మర్చిపోయినా… అతడు తన బాధ్యతను మాత్రం మర్చిపోలేదు” అనే భావాన్ని ఈ పోస్టర్ బలంగా ప్రతిబింబిస్తోంది. తన నగరాన్ని రక్షించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్న స్పైడర్-మ్యాన్ మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడని ఈ పోస్టర్ సూచిస్తోంది. స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్ ఘన విజయానికి నాలుగేళ్ల తర్వాత, ఈ చిత్రం పీటర్ పార్కర్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని చూపించనుంది. ప్రపంచం తనను గుర్తించని పరిస్థితుల్లో ఒంటరిగా జీవిస్తున్న పీటర్, న్యూయార్క్ నగరాన్ని రక్షించడమే తన ధ్యేయంగా మారుతుంది. కానీ కొత్త నేరాల పరంపరతో పాటు అతని జీవితాన్ని కుదిపేసే శక్తివంతమైన శత్రువు రంగంలోకి దిగడంతో కథ మరింత ఉత్కంఠభరితంగా సాగనుంది. సోనీ పిక్చర్స్ సంస్థ  ఇండియా  ఈ చిత్రాన్ని భారతదేశవ్యాప్తంగా అన్ని ప్రీమియం ఫార్మాట్లలో విడుదల చేయనుంది.
కోలీవుడ్ నుంచి మరో భారీ యాక్షన్ చిత్రం రాబోతోంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) నటుడిగా మారుతూ, అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'DC'. తాజాగా ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. (DC Trailer) ట్రైలర్ ప్రారంభం నుంచే అరుణ్ మాతేశ్వరన్ మార్క్ యాక్షన్, లోకేష్ కనగరాజ్ ఇంటెన్సిటీ కనిపిస్తోంది. ఇందులో లోకేష్ 'దేవదాస్' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా, వామిఖ గబ్బి 'చంద్ర' అనే గ్రే షేడ్ ఉన్న పాత్రలో మెరుస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఇదొక రివెంజ్ డ్రామా అని స్పష్టమవుతోంది. ముఖ్యంగా "మంచి అంటే చెడు.. చెడు అంటే మంచి" అనే కాన్సెప్ట్‌తో సినిమా సాగనుందని తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలు అత్యంత సహజంగా, రక్తం చిందేలా ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ నటన, బాడీ లాంగ్వేజ్ ఒక ప్రొఫెషనల్ నటుడిలా ఉండటం విశేషం. వామిఖ గబ్బి నటన కూడా చాలా ఇంటెన్స్‌గా ఉంది. ఇక అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (BGM) ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆయన స్వరపరిచిన 'రాగ ఆఫ్ రివెంజ్' సాంగ్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అరుణ్ మాతేశ్వరన్ తనదైన శైలిలో రా అండ్ రస్టిక్ విజువల్స్‌తో ఆకట్టుకున్నారు. ట్రైలర్‌లో డైలాగులు తక్కువగా ఉన్నప్పటికీ, విజువల్స్ ద్వారా కథలోని గాఢతను చెప్పే ప్రయత్నం చేశారు. లోకేష్ కనగరాజ్ అభిమానులు ఆయనను నటుడిగా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి 'DC' ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా మెప్పిస్తాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.  
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. ఆ డైలాగ్స్, ఆ క్యారెక్టరైజేషన్, ఆ మాస్ మేనరిజం వెండితెరపై సృష్టించే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అయితే, గత కొంతకాలంగా ఆయన ఫామ్ గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పూరీ నుండి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అదే 'స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్'. టైటిల్ వినగానే ఏదో కొత్తగా ఉందే అనిపిస్తోంది కదూ? అవును, పూరీ ఈసారి ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కథాంశం ఒక మురికివాడ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. పూరీ గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా ఎమోషనల్ గా, రియలిస్టిక్ గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా పూరీ సినిమాల్లో హీరోలు ఆటిట్యూడ్ తో అదరగొడుతుంటారు, కానీ ఇందులో మాత్రం మట్టి మనుషుల జీవితాలను, వారి పోరాటాలను కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారట. మురికివాడలో నివసించే వారి ఆశలు, ఆశయాలు మరియు వారు ఎదుర్కొనే సవాళ్లను '33 టెంపుల్ రోడ్' అనే అడ్రస్ ద్వారా ఆవిష్కరించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ పట్ల పూరీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారని, అందుకే పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనులను స్పీడప్ చేశారని తెలుస్తోంది. సినిమా మేకింగ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటే, పూరీ తన మార్కు మాస్ ఎలిమెంట్స్‌ను మిస్ చేయకుండానే, కథలో ఒక గాఢతను జోడించారట. గ్రాఫిక్స్ కంటే కూడా నేచురల్ లొకేషన్స్, రియల్ ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పూరీ మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందుకుంటారని ఆయన అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. స్లమ్‌డాగ్ అనే పదం ఉండటంతో ఇది గ్లోబల్ అప్పీల్ ఉన్న కథేమో అనే అంచనాలు కూడా ఉన్నాయి. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, గుండెకు హత్తుకునే సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్ కానున్నాయి. మరోవైపు, ఈ సినిమాలోని నటీనటుల వివరాలను మేకర్స్ చాలా గోప్యంగా ఉంచుతున్నారు. పూరీ జగన్నాథ్ తన సొంత నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం, ఎడిటింగ్ విభాగాల్లో కూడా టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నట్లు టాక్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకోవడంతో, త్వరలోనే ఫస్ట్ లుక్ లేదా టీజర్ వచ్చే అవకాశం ఉంది. పూరీ రాసిన సంభాషణలు ఈసారి చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని, సమాజంలోని అంతరాలను ప్రశ్నించేలా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి 'స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్' టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డు సృష్టిస్తుందో లేదో చూడాలి. పూరీ మార్క్ మేజిక్ కోసం ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ అవుతుందని ఆశిద్దాం.
Lokesh Kanagaraj makes a strong impression in front of the camera, proving his acting abilities are spot on for a gritty lead role. Sharing the screen, Wamiqa Gabbi is equally compelling, delivering a grounded performance that anchors the emotional weight of the film. The story offers a different take on the classic Devdas romance, introducing a Chandramukhi-like twist where both characters actively choose each other to survive. The core premise revolves around these two downtrodden individuals taking a stand against system-based officers, triggering a massive police pursuit. Thematically, this narrative setup feels akin to Adivi Sesh's Dacoit, dealing with rebels going against the grain. However, the visual aesthetic is entirely different. Director Arun Matheswaran stays true to the grim style of his earlier films, Captain Miller and Rocky. He once again delivers an unapologetic, high-violence, blood-bath movie with raw and intense cinematography. Driving this on-screen chaos is the standout work of Anirudh Ravichander, who has outdone his recent albums with a highly experimental score. He seamlessly amalgamates traditional Hindustani classical music with modern-day, high-octane electronic beats. This unique blending of contrasting genres drives the trailer's pacing, providing a rhythmic intensity that perfectly frames the action.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత చరణ్ చేస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని దర్శకుడు బుచ్చిబాబు ఇటీవల బయటపెట్టారు. సాధారణంగా దర్శకులు ఏసీ రూముల్లో కూర్చుని కథలు రాస్తుంటారు, కానీ బుచ్చిబాబు మాత్రం తన గురువు సుకుమార్ దగ్గర గ్రీన్ సిగ్నల్ తీసుకున్న వెంటనే పిఠాపురం వెళ్లారు. అక్కడ దత్తాత్రేయ స్వామి ఆలయ ప్రాంగణంలోనే కూర్చుని ఈ సినిమా పూర్తి కథను, స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. దైవ సన్నిధిలో పుట్టిన ఈ కథలో ఒక తెలియని శక్తి ఉందని, చరణ్ కూడా ఈ కథ వినగానే ఒక్క మార్పు కూడా చెప్పకుండా వెంటనే ఓకే చేశారని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మునుపెన్నడూ లేని విధంగా ఒక విలేజ్ బాడీ లాంగ్వేజ్‌తో, పవర్‌ఫుల్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఆయన 'పెద్ది పహిల్వాన్'గా కుస్తీ పోటీల్లో చేసే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి' పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం, బుచ్చిబాబు ఎమోషనల్ టేకింగ్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పూనకాలు తెప్పించడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరో విశేషమేమిటంటే, ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతి బాబు ఒక అత్యంత కీలకమైన మరియు డిఫరెంట్ విలన్ రోల్ పోషిస్తున్నారు. తన కెరీర్‌లోనే ఇలాంటి పాత్రను ఊహించలేదని జగ్గుభాయ్ చెప్పడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. మే 18న ముంబైలో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం, రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవడమే కాకుండా, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
టాలీవుడ్ స్టార్ కమెడియన్ సప్తగిరి (Saptagiri) గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ప్రభాస్ 'రాజా సాబ్' (Raja Saab) గురించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడమే కాకుండా, పెద్ద చర్చకు దారితీశాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సప్తగిరి, ఈ వివాదంపై స్పందిస్తూ బహిరంగంగా క్షమాపణలు కోరారు. సప్తగిరి అసలు ఏం మాట్లాడారంటే.. ఒక సందర్భంలో తన చేతిలో ఉన్న సినిమాల గురించి చెబుతూ, తను చేస్తున్న చిన్న బడ్జెట్ సినిమాల లిస్టులో పొరపాటున 'రాజా సాబ్' పేరును కూడా చేర్చారు. పాన్ ఇండియా లెవల్లో వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రభాస్ సినిమాను 'చిన్న సినిమా' అనడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ విషయంపై సప్తగిరి క్లారిటీ ఇస్తూ, "నేను కొన్ని మినిమం బడ్జెట్ సినిమాలు చేస్తున్నాను, వాటిలో నాకు మంచి క్యారెక్టర్లు వస్తున్నాయని చెబుతూ.. ఫ్లోలో రాజా సాబ్‌ను కూడా ఆ లిస్టులో చేర్చాను. అది నిజంగా పొరపాటే, అందుకు రియల్లీ సారీ. మారుతి గారు కూడా నాకు ఫోన్ చేశారు, ఆయనకు కూడా నేను క్షమాపణలు చెప్పాను" అని వివరించారు. తాను ప్రభాస్ సినిమాను చిన్న సినిమా అని ఉద్దేశపూర్వకంగా అనలేదని, కేవలం మాటల మధ్యలో దొర్లిన తప్పు మాత్రమేనని సప్తగిరి స్పష్టం చేశారు. మారుతి గారు ఫోన్ చేయగానే వెంటనే రియలైజ్ అయ్యానని, మీడియా ముఖంగా మరోసారి క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు. 'రాజా సాబ్'ను చిన్న సినిమా అనడంతో సోషల్ మీడియాలో సప్తగిరిపై ట్రోల్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లయింది.  
కన్నడ చిత్ర పరిశ్రమలో 'ఛాలెంజింగ్ స్టార్' గా, 'డి బాస్' గా వెలుగొందుతున్న నటుడు దర్శన్ తూగుదీప జీవితం ఇప్పుడు చీకటి కోణంలో కూరుకుపోయింది. తన వీరాభిమాని అయిన రేణుకాస్వామి అనే యువకుడిని అత్యంత పాశవికంగా హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న దర్శన్‌కు తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ‌ తగిలింది.  కర్ణాటక హైకోర్టు గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణలో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అటువంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్న వ్యక్తి బయట ఉండటం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. తక్షణమే దర్శన్‌ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించడంతో ఆయన మరోసారి జైలు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.   ఈ విషాదకరమైన కథ గతేడాది జూన్‌లో ప్రారంభమైంది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే ఫార్మసీ ఉద్యోగి, దర్శన్ సన్నిహితురాలు పవిత్ర గౌడకు సోషల్ మీడియాలో అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆగ్రహంతో ఈ ఘాతుకానికి తెరలేచింది. దర్శన్ అనుచరులు రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు కిడ్నాప్ చేసి, ఒక షెడ్డులో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందేమిటంటే, దర్శన్ స్వయంగా ఆ బాధితుడిపై దాడి చేశారని, విద్యుత్ షాక్‌లు ఇచ్చి కిరాతకంగా చంపేశారని ఆరోపణలు ఉన్నాయి.  ఒక సూపర్ స్టార్ హోదాలో ఉన్న వ్యక్తి, తనను దైవంగా భావించే అభిమానిని ఇంత దారుణంగా అంతమొందించడం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.  కోర్టు విచారణలో భాగంగా దర్శన్ అనారోగ్య కారణాలను చూపుతూ మధ్యంతర బెయిల్ పొందారు. వెన్నునొప్పి సమస్యతో చికిత్స కోసం ఆయనకు బెయిల్ మంజూరైంది. అయితే, దర్శన్ బయట ఉంటే కేసు నీరుగారిపోయే ప్రమాదం ఉందని, సాక్షులు భయభ్రాంతులకు గురవుతారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  వాదనలు విన్న సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ణయాన్ని తప్పుపడుతూ దర్శన్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. విచారణలో పురోగతి లేకపోతే ఏడాది తర్వాత మళ్ళీ బెయిల్ కోసం ప్రయత్నించవచ్చని పేర్కొంటూనే, ప్రస్తుతానికి జైలుకే వెళ్లాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం జరుగుతుందనే ఆశలు మళ్ళీ చిగురించాయి. మరోవైపు, సినిమా షూటింగ్‌లు ఆగిపోయి, నిర్మాతలు కోట్లలో నష్టపోతున్నా, చట్టం ముందు అందరూ సమానమే అని ఈ తీర్పు నిరూపించింది. కన్నడ సినీ ఇండస్ట్రీలో ఈ పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కన్నడ యాక్షన్ స్టార్ ధ్రువ్‌ స‌ర్జా, దర్శకుడు ప్రేమ్ కాంబినేషన్‌లో రూపొందిన పీరియడ్ యాక్షన్ డ్రామా 'కేడి (KD) - ది డెవిల్'. నేడు (మే 15) ఈ చిత్రం తెలుగులో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. (KD The Devil Movie Review) కథ: 1970-80ల నాటి బెంగళూరు నేపథ్యంలో సాగే కథ ఇది. కాళిదాస్ అలియాస్ కాళి (ధ్రువ్‌ స‌ర్జా) సాధారణ జీవితం సాగిస్తుంటాడు. 25 ఏళ్లుగా ఓ ముఠా నాయ‌కుడిగా కొనసాగుతున్న దేవా (సంజ‌య్‌ద‌త్‌) అంటే కాళికి చాలా ఇష్టం. అనుకోకుండా జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల కార‌ణంగా.. కాళిని, అతని కుటుంబాన్ని మ‌ట్టుబెట్టాల‌ని దేవా గ్యాంగ్ రంగంలోకి దిగుతుంది. అప్ప‌టివరకు దేవాను ఎంతో ఆరాధిస్తూ తిరిగిన కాళి.. త‌న కుటుంబం కోసం ఆయుధం పట్టి, దేవాకు ఎదురునిలబడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: సింపుల్ గా చెప్పాలంటే.. దేవాను ఆరాధించే స్థాయి నుంచి అతనికి సమానంగా నిలబడే స్థాయికి కాళీ ఎలా ఎదిగాడనేదే ఈ చిత్ర కథాంశం. ఈ తరహా అండర్ వరల్డ్ కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. కథలో కొత్తదనం లేకపోవడం, కథనం నెమ్మదిగా సాగడం ప్రధాన మైనస్ గా మారింది. దర్శకుడు ప్రేమ్ కేవలం హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్‌పైనే దృష్టి పెట్టారు తప్ప, బలమైన ఎమోషన్స్ పండించడంలో తడబడ్డారు. ఫస్ట్ హాఫ్ కాస్త ఆసక్తికరంగా ఉన్నా, సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా గాడి తప్పింది. క్లైమాక్స్ కూడా ఊహించదగ్గ రీతిలో ఉంటుంది. 1970ల కాలం నాటి బెంగళూరు అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ కథ.. అప్పటి మాస్, క్రైమ్ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు యాక్షన్ ప్రియులకు కావాల్సిన విందును దర్శకుడు అందించారు. ధ్రువ సర్జా, సంజయ్ దత్ మధ్య వచ్చే సీన్లు ఆకట్టుకున్నాయి. మాస్ సినిమాలను ఇష్టపడే వారికి, భారీ యాక్షన్ కోరుకునే వారికి 'కేడీ: ది డెవిల్' ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: మాస్ హీరోగా ధ్రువ సర్జా తన నటనతో, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో తన ఎనర్జీని ప్రదర్శించాడు. రీష్మా నానయ్య హీరోయిన్‌గా తన పరిధి మేర చక్కగా నటించింది. సీనియర్ నటుల ఉనికి సినిమాకు ఒక లెవల్ క్రేజ్ తెచ్చింది. ముఖ్యంగా సంజయ్ దత్ తన గంభీరమైన నటనతో మెప్పించారు. శిల్పా శెట్టి చాల కాలం తర్వాత ఒక బలమైన పాత్రతో ప్రేక్షకులను పలకరించారు. విలియం డేవిడ్ సినిమాటోగ్రఫీ 70-80ల నాటి వాతావరణాన్ని చక్కగా ఆవిష్కరించింది. అర్జున్ జన్యా అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను ఎలివేట్ చేశాయి. ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్ ఆ కాలానికి తగ్గట్లుగా సహజంగా ఉన్నాయి. సినిమా నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.  ప్లస్ పాయింట్స్: ధ్రువ సర్జా పర్ఫార్మెన్స్ టెక్నికల్ వాల్యూస్ మైనస్ పాయింట్స్: రొటీన్ కథనం ఓవర్ బిల్డప్స్ సెకండ్ హాఫ్ ఫైనల్ గా.. 'కేడి - ది డెవిల్' కేవలం మాస్ యాక్షన్ ప్రియులను మాత్రమే టార్గెట్ చేసిన సినిమా. ఓవర్ ది టాప్ యాక్షన్, రొటీన్ మాఫియా డ్రామా కావాలనుకునే వారు ఒకసారి చూడొచ్చు. కానీ, కథలో లోతును ఆశించే ప్రేక్షకులకు ఇది నిరాశ కలిగిస్తుంది. Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.  
నేడు మనం అత్యాధునిక మల్టీప్లెక్స్‌లు, ఐమాక్స్ స్క్రీన్‌లు, మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్స్‌తో సినిమాలను ఎంజాయ్ చేస్తున్నాం. కానీ, అసలు తెలుగు నేల మీద వెండితెర అద్భుతం ఎక్కడ మొదలైందో మీకు తెలుసా? దాదాపు వంద ఏళ్ల క్రితం, అసలు సినిమా అంటేనే తెలియని రోజుల్లో, ఒక వ్యక్తి కన్న కల తెలుగు చలనచిత్ర చరిత్రను మలుపు తిప్పింది. ఆయనే రఘుపతి వెంకయ్య నాయుడు. తెలుగు సినిమా పితామహుడు అని పిలవబడే ఆయన, మద్రాసులో మొదటి థియేటర్ నిర్మించినప్పటికీ, ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సినిమా హాలు మాత్రం మన విజయవాడలో రూపుదిద్దుకుంది. 1921వ సంవత్సరంలో విజయవాడ నడిబొడ్డున 'మరుత్ ప్రసాద్' అనే పేరుతో ఒక సినిమా థియేటర్ వెలిసింది. అప్పట్లో అది కేవలం ఒక చిన్న తాటాకు పాక లాంటి నిర్మాణం మాత్రమే. కానీ, ఆ చిన్న పాకలోనే వెండితెర వింతలను చూసేందుకు వేలాది మంది ప్రజలు ఎగబడేవారు. ఆ రోజుల్లో సినిమాలు అంటే ఇప్పుడున్నట్లుగా మాటలు ఉండేవి కావు. కేవలం బొమ్మలు మాత్రమే కదిలేవి, వాటిని 'మూకీ' చిత్రాలు అని పిలిచేవారు. ఆ కదిలే బొమ్మల వెనుక ఒక హార్మోనియం వాయిద్యకారుడు లేదా ఒక వ్యాఖ్యాత ఉండి కథను వివరించేవారు. 'మరుత్ ప్రసాద్' థియేటర్ అప్పట్లో ఒక వింతగా, ఒక సంబరంగా ఉండేది. విజయవాడలోని గాంధీ నగర్ ప్రాంతంలో ఈ థియేటర్ ఉండేదని చరిత్రకారులు చెబుతుంటారు. ఆ తర్వాత కాలంలో దీనికి 'మారుతి టాకీస్' అని పేరు మార్చారు. అప్పట్లో కేవలం ఒక అణా లేదా రెండు అణాలకే సినిమా చూపించేవారట. నేటి తరం ప్రేక్షకులకు ఇది నమ్మశక్యం కాని విషయమే అయినా, ఆ రోజుల్లో అదొక పెద్ద విలాసం. ఈ థియేటర్ కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాలేదు, స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కూడా కీలక పాత్ర పోషించింది. దేశభక్తి చిత్రాలు ప్రదర్శిస్తున్నప్పుడు ప్రజలు తండోపతండాలుగా వచ్చి అప్పట్లో బ్రిటీష్ వారిపై తమ నిరసనను వ్యక్తం చేసేవారు. అయితే, ఈ ప్రస్థానం అక్కడితో ఆగలేదు. 1930ల నాటికి టాకీ సినిమాలు (మాటలు ఉన్న సినిమాలు) రావడంతో థియేటర్ల స్వరూపం మారిపోయింది. విజయవాడ తర్వాత కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా సినిమా హాళ్లు వెలిశాయి. కానీ, 'మారుతి టాకీస్' వేసిన పునాది మాత్రం అజరామరం. నేడు మనం చూస్తున్న వేల కోట్ల రూపాయల తెలుగు సినీ సామ్రాజ్యానికి ఈ చిన్న థియేటరే తొలి మెట్టు. సినిమా చూస్తున్నప్పుడు మనకు కలిగే ఆ ఉద్వేగం, ఆ విజిల్స్, ఆ ఆనందం అన్నీ ఆనాడు మరుత్ ప్రసాద్ థియేటర్ గోడల మధ్యే మొగ్గతొడిగాయి. తెలుగు రాష్ట్రాల సినీ చరిత్రను తెలుసుకోవాలంటే, ఖచ్చితంగా మనం ఈ మొదటి థియేటర్ గురించి, ఆ కాలం నాటి ప్రేక్షకుల ఉత్సాహం గురించి తెలుసుకోవాల్సిందే. ఇది కేవలం ఒక కట్టడం కాదు, కోట్లాది మంది తెలుగు వారి సినీ ఆరాధనకు నిలువుటద్దం.
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. 'కల్కి 2898 AD' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'స్పిరిట్'. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని తెలియడంతో, ఆయన లుక్ ఎలా ఉండబోతుందోనని సోషల్ మీడియాలో నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. ఈ తరుణంలోనే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి చేతిలో గన్ పట్టుకుని, పోలీస్ యూనిఫామ్‌లో గంభీరంగా కనిపిస్తున్న ఆ ఫోటోను చూసి నెటిజన్లు ఇది 'స్పిరిట్' సినిమా సెట్ నుంచి లీక్ అయిన ప్రభాస్ ఒరిజినల్ ఫోటో అని నమ్మడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఫోటోను షేర్ చేస్తూ 'స్పిరిట్' లో ప్రభాస్ విశ్వరూపం ఇలాగే ఉండబోతోందని సంబరపడిపోయారు. అయితే, ఈ వైరల్ ఫోటో వెనుక ఉన్న అసలు నిజం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ ఫోటో నిజానికి 'స్పిరిట్' సెట్ నుంచి లీక్ అయినది కాదు, కనీసం అది ప్రభాస్ ఫోటో కూడా కాదు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సృష్టించబడిన ఒక కల్పిత చిత్రం. నేటి కాలంలో ఏఐ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే, అసలైన ఫోటోలకు ఏమాత్రం తీసిపోని విధంగా సెలబ్రిటీల రూపాలను సృష్టించగలుగుతోంది. ఈ క్రమంలోనే ఎవరో ఒక ఉత్సాహవంతుడు సందీప్ రెడ్డి వంగా మార్క్ వైలెన్స్‌ను, ప్రభాస్ కటౌట్‌ను ఊహించుకుంటూ ఈ ఏఐ ఫోటోను రూపొందించారు. అది కాస్తా ఇంటర్నెట్‌లో దావానంలా వ్యాపించి, నిజమైన లీక్ అని అందరినీ భ్రమలో పడేసింది. నిజానికి 'స్పిరిట్' సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. చిత్ర యూనిట్ ఎక్కడా కూడా ప్రభాస్ లుక్‌కు సంబంధించిన చిన్న హింట్‌ను కూడా బయట పెట్టలేదు. సందీప్ రెడ్డి వంగా తన సినిమాల విషయంలో అత్యంత రహస్యంగా వ్యవహరిస్తారని మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని విధంగా చాలా కోపంగా, గంభీరంగా కనిపించనున్నారని, కేవలం ఆయన క్యారెక్టర్ కోసం ప్రభాస్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని సమాచారం. ఈ సినిమా కోసం ప్రభాస్ సిక్స్ ప్యాక్ బాడీతో సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ఫేక్ లీక్స్ మరియు ఏఐ ఫోటోల పట్ల అభిమానులు అప్రమత్తంగా ఉండాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. అధికారికంగా చిత్ర నిర్మాతలు విడుదల చేసే వరకు వేచి చూడటమే ఉత్తమం. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తుందని, ప్రభాస్ క్రేజ్‌కు ఇది పర్ఫెక్ట్ మాస్ మూవీ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. ఈ వైరల్ ఫోటో ప్రభాస్‌ది కాకపోయినా, ఆయన పోలీస్ లుక్ కోసం ఫ్యాన్స్ చూపిస్తున్న ఈ ఆరాటం చూస్తుంటే 'స్పిరిట్' పై ఉన్న హైప్ ఏంటో అర్థమవుతోంది.
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ కొన్నిసార్లు, అనుకోకుండా అనేసిన కొన్ని మాటలు ఆ సంబంధాన్ని పాడుచేసే అవకాశం ఉంటుంది. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో వచ్చే ఏ చిన్న అపార్థమైనా.. ఏ చిన్న తప్పు మాట అయినా.. ఇద్దరి మధ్య దూరం పెంచి  బంధాన్ని నాశనం చేసి  అవకాశం ఉంటుంది.  బంధం చాలా కాలం పాటు ప్రేమ, నమ్మకంతో నిండి ఉండాలంటే చేయకూడని తప్పులేంటో తెలుసుకుంటే.. పాత బంధాల ప్రస్తావన.. కొత్తగా పెళ్లైన  తర్వాత గత సంబంధాల గురించి ప్రస్తావించడం తరచుగా భాగస్వామికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పదేపదే  పాత రిలేషన్ లో ఉన్న వ్యక్తితో  పోల్చడం లేదా పాత జ్ఞాపకాలను పంచుకోవడం సంబంధంలో అభద్రతను పెంచుతుంది. వైవాహిక బందంలో ఎప్పుజూ ప్రస్తుత కాలంపై దృష్టి పెట్టాలి. అప్పుడే బంధం బాగుంటుంది. కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడటం.. పెళ్లి తర్వాత రెండు  కుటుంబాలను గౌరవించడం చాలా ముఖ్యం. లైఫ్ పార్ట్నర్  కుటుంబం గురించి చెడుగా మాట్లాడటం లేదా వారిని ఎగతాళి చేయడం సంబంధంలో ఉద్రిక్తతను సృష్టిస్తుంది. ఒకవేళ ఏదైనా విషయం నచ్చకపోతే దాన్ని ప్రశాంతంగా వివరించడానికి ప్రయత్నించాలి. ఫిర్యాదులు.. చిన్న చిన్న విషయాల గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేస్తుంటే అది  సంబంధంలో ప్రతికూలతను పెంచుతుంది. కొత్త పెళ్లిలో ఒకరి అలవాట్లను ఒకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అందువల్ల, ఓర్పు , అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. పోలిక.. లైఫ్ పార్ట్నర్ ను  స్నేహితుడు, బంధువు లేదా సోషల్ మీడియా జంటతో పోల్చడం  బంధానికి  హాని కలిగిస్తుంది. ప్రతి వ్యక్తి, ప్రతి సంబంధం భిన్నంగా ఉంటాయి. పోలికలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, విభేదాలను పెంచుతాయి. స్వేచ్ఛ.. పెళ్లి తర్వాత అన్ని విషయాల గురించి క్వశ్చన్లు వేయడం  లేదా మితిమీరిన జోక్యం చేసుకోవడం చేస్తే అది  భాగస్వామికి బాధ కలిగించే అవకాశం ఉంటుంది. ప్రేమతో పాటు వైవాహిక జీవితంలో కూడా  వ్యక్తిగత స్వేచ్ఛ కూడా చాలా అవసరం. ఒకరినొకరు నమ్మితేనే  బంధం  బలంగా ఉంటుంది.                               *రూపశ్రీ.
వివాహం అన్ని సంబంధాల కంటే విభిన్నమైన కోణం. వివాహం ప్రారంభ రోజుల్లో భార్యాభర్తల  మధ్య ప్రేమ, ఉత్సాహం,  ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ క్రమంగా భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది.  చాలామంది వివాహం అయిన కొద్ది కాలానికే మనుషులు మారిపోయారు అని అంటూ ఉంటారు. అయితే ఇది చాలా వరకు భార్యాభర్తల మధ్య జరిగేదే. కానీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గకుండా తిరిగి ప్రేమను పెంచుకోవడం భార్యాభర్తల ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత భార్యాభర్తల బంధం కొందరికి  బోరింగ్‌గా మారుతుంది.ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడం,  బంధంలో ఉత్సాహం వంటివి అస్సలు కనిపించవు.  దీనికి బదులు వారి బంధంలో విసుగు చెందడం,  గొడవ పడటం చాలా సహజం అయిపోతుంది. కానీ వివాహం అయిన కొన్ని రోజులకే   భార్యాభర్తల మధ్య ప్రేమ ముగిసిపోవడం అనేది ఉండదు.  పెళ్లైన కొత్త రోజుల్లో ఉండే ప్రేమ ఎన్నైళ్లైనా భార్యాభర్తల మధ్య అలాగే ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.  అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గడానికి కారణమయ్యేవి ఏంటో కూడా తెలుసుకోవాలి. బాధ్యతలు, ఒత్తిడి వివాహం తర్వాత, ఉద్యోగం, ఇంటిని చూసుకోవడం, కుటుంబ అంచనాలు,  పిల్లలను పెంచడం వంటి బాధ్యతలు భార్యాభర్తలపై భారంగా మారతాయి.  ఒకరికొకరు సమయం ఇచ్చుకోవడం కష్టం అవుతుంది. క్రమంగా ప్రేమ కాస్తా బాధ్యతల్లోకి జారిపోతుంది. ఒకే దినచర్య.. ఒకే  దినచర్య సంబంధంలో విసుగును కూడా తెస్తుంది. ప్రతిరోజూ ఆఫీసు, ఇల్లు,  ఇతర పనుల మధ్య,  ప్రేమ ఎక్కడో వెనుకబడిపోతుంది. కొత్త శక్తి,  ఉత్సాహం లేకపోవడం సంబంధాన్ని మందకొడిగా చేస్తుంది. కమ్యూనికేషన్.. భార్యాభర్తల  మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం కూడా ప్రేమ తగ్గిపోవడానికి  ఒక పెద్ద కారణం. భార్యాభర్తలు తమ భావాలను, అంచనాలను,  సమస్యలను ఒకరితో ఒకరు పంచుకోనప్పుడు దూరం పెరుగుతుంది.  ఈ దూరం క్రమంగా సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ప్రేమ పెరగాలంటే.. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య  మునుపటిలా  ప్రేమను తిరిగి పుంజుకోవడానికి కొన్ని పద్ధతులను అనుసరించవచ్చు.  ఉదాహరణకు కొన్ని.. ఒకరికొకరు సమయం ఇవ్వడం... రోజంతా బిజీగా ఉన్నప్పటికీ కనీసం అరగంటైనా  ఇద్దరూ సంతోషంగా ఉండటానికి  మాత్రమే కేటాయించాలి. డేటింగ్ నైట్ ప్లాన్ చేసుకోవడం...   డేటింగ్ కి వెళ్లడం వల్ల పెళ్లైన సంవత్సరాల తర్వాత కూడా సంబంధానికి కొత్త జీవం పోస్తుంది. ఆశ్చర్యకరమైన బహుమతులు ఇవ్వడం.. చిన్న బహుమతులు కూడా పెద్ద ప్రేమ బయటకు వ్యక్తం  చేస్తాయి. సంభాషణకు ప్రాముఖ్యత ఇవ్వడం.. ప్రతిరోజూ కొంత సమయం ఒకరితో ఒకరు ఓపెన్ మాట్లాడుకోండి. శారీరక సాన్నిహిత్యంపై.. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం,  దగ్గరగా కూర్చోవడం కూడా ప్రేమను తిరిగి రేకెత్తించడానికి ఒక మార్గం కావచ్చు. నిజానికి వివాహం అయిన తరువాత పిల్లలు పుట్టగానే శారీరకంగా బంధం బలహీనమవుతుంది.  అందుకే చాలా వరకు ప్రేమ తగ్గినట్టు అనిపిస్తుంది.  సురక్షిత మార్గంలో భార్యాభర్తలు శారీరక బంధాన్ని సాగిస్తే వారి మధ్య ప్రేమ ఎప్పుడూ తాజాగా ఉంటుంది.                                  *రూపశ్రీ.
  ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా గడపాలని కోరుకుంటాడు.  మానసిక సమస్యలకు దూరంగా ఉండాలని కోరుకుంటాడు.  నేటి కాలంలో కొందరు  అనారోగ్యంతో బాధపడుతుంటే  మరికొందరు  కుటుంబ సమస్యల గురించి ఆందోళన చెందుతుంటారు. కొంతమంది ఉద్యోగం రాలేదని,   మరికొందరు తమకు జీతం తక్కువ అని, ఇంకొందరు జీతం సరిగా రావడం లేదని.. ఇలా  సగం ప్రపంచం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతోంది. కానీ ఈ ప్రపంచంలో కొంతమంది ఎటువంటి ఆందోళన లేకుండా  సంతోషంగా ఉంటుంటారు. వాళ్లు అసలు అంత సంతోషంగా ఎలా ఉన్నారు? అనే విషయం కూడా కొందరికి అర్థమే కాదు.. అసలు  జీవితాన్ని సంతోషంగా,  ప్రశాంతంగా ఉంచగల మార్గాలు ఏమిటి? దుఃఖాలకు, సమస్యలకు దూరంగా ఉండటం ఎలా తెలుసుకుంటే.. తల్లిదండ్రుల సూచనలు..  పిల్లలు తల్లిదండ్రుల  మాట విని సరైన మార్గాన్ని అనుసరిస్తే, అది తల్లిదండ్రులకు  చాలా సంతోషకరమైన విషయం. అలాంటి పిల్లలు కుటుంబానికి కీర్తిని తెస్తారు.  వారి తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారు. కాబట్టి జీవితంలో ఆనందం,  శాంతి కోరుకుంటే, ఎల్లప్పుడూ  తల్లిదండ్రుల సూచనలను పాటించాలి.  సరైన మార్గాన్ని అనుసరించాలి.  నేటి జెనరేషన్ అప్డేట్ అయి ఉండవచ్చు. కానీ తల్లిదండ్రుల దగ్గర అనుభవం ఉంటుంది.  కాబట్టి వారి అనుభవ పూరిత సలహాలు ఎప్పుడూ నష్టం మాత్రం కలిగించవు.  జీవిత భాగస్వామి మద్దతు.. జీవితంలో లైఫ్ పార్ట్నర్ చాలా ముఖ్యమైవారు.   జీవిత భాగస్వామి  సుఖదుఃఖాలన్నిటిలోనూ సపోర్ట్ ఇస్తూ అవగాహనతో మసలుకుంటే  జీవితం సులభంగా, సంతోషంగా మారుతుంది. జీవిత భాగస్వామి  అంటే పంచుకునేవారు. ఎలాంటి పరిస్థితిని అయినా అర్థవంతంగా చెప్పగలిగితే బాగస్వామి తప్పకుండా అర్థం చేసుకుంటారు.  ఎవరు అర్థం చేసుకోకపోయినా,  ఎవరు కష్టాలలో తోడు ఉండకపోయినా లైఫ్ పార్ట్నర్ తోడు ఉంటే బాధ, సమస్య ప్రభావం తెలియకుండా ఉంటుంది. తృప్తి.. ఈ కాలంలో మనిషికి లోపించినది తృప్తి.   ఎక్కువ కోసం ఆరాటపడకపోతే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, తద్వారా సంతోషంగా ఉంటాము. ముఖ్యంగా డబ్బు గురించి గొడవ చేసేవారు ఎప్పుడూ ఉన్నదాంతో  సంతృప్తి చెందరు. అందుకే మొదట డబ్బు దగ్గర ఉన్నదాంతో సంతృప్తి చెందడం నేర్చుకుంటే  అన్ని విషయాలలోనూ సంతృప్తిగా ఉండవచ్చు. ఆశించడం..  ఇతరుల సంపద,  ఆస్తి,  ఇతర వస్తువులు వంటివి కోరుకోవడం, తప్పని,  అది చాలా చీప్ మెంటాలిటీ అని  ఎప్పుడైతే తెలుసుకుంటారో.. అప్పుడు జీవితంలో దురాశను వదిలిపెడతారు. ఎవరినుండి అయినాఏదైనా ఆశించడం దురాశ చెందడమే. ఇట్లా దురాశను వదిలిన రోజు మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.  ఎటువంటి కోరిక లేకుండా జీవితాన్ని గడుపుతాము. భూత దయ.. నా వాళ్లు, మనవాళ్లు అని మాత్రమే కాదు.. అందరినీ, అన్ని జీవులను ప్రేమించాలి.అందరి పట్ల,  మూగ ప్రాణుల  పట్ల కూడా  దయ,  కరుణ కలిగి ఉంటే,   ప్రేమ,  శాంతిని నింపుకోగలుగుతారు. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు,  మంచి ఆలోచనలు,  ఇతరులను ఇబ్బంది పెట్టని,  అన్ని జీవులను సమానంగా చూసే సమభావం అలవడుతుందో.. అప్పుడు మనిషి జీవితం ఎన్ని దుఃఖాలు, సమస్యలు వచ్చినా బాధకు లోనుకాకుండా ఉంటుంది.                               *రూపశ్రీ.
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన అలవాట్ల కారణంగా మూత్రపిండాలు క్రమంగా దెబ్బతింటాయి. నేటికాలంలో ఆహారపు అలవాట్లు,  తీసుకునే పానీయాలు,  జీవనశైలి కారణంగా మూత్రపిండాల ఆరోగ్యం చాలా దెబ్బతింటోంది. గతంతో పోలిస్తే.. నేటికాలంలో మూత్రపిండాల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎక్కువ అయ్యారు. మూత్రపిండాల పనితీరు బలంగా ఉండాన్నా,  మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలన్నా కొన్ని అలవాట్లు చాలా బాగా సహాయపడతాయి.   రోజువారీ జీవితంలో పాటించదగిన ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. నీరు.. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగినంత నీరు త్రాగడం చాలా సులభమైన,  ప్రభావవంతమైన మార్గం. నీరు మూత్రం ద్వారా శరీరం నుండి విషపదార్థాలను , అదనపు ఉప్పును బయటకు పంపడానికి సహాయపడుతుంది. చాలా తక్కువ నీరు త్రాగడం వల్ల డీహైడ్రేషన్, మూత్రపిండాల్లో రాళ్లు , మూత్రపిండాలపై ఒత్తిడి పెరగడానికి దారితీస్తుంది. సగటు వ్యక్తికి రోజుకు 2–3 లీటర్ల నీరు త్రాగడం చాలా అవసరం.  ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగడం చాలా మంచి ప్రయోజనం కలిగిస్తుంది. ఉప్పు.. అధికంగా ఉప్పు తినడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మూత్రపిండాలు దెబ్బతినడానికి ఒక ప్రధాన కారణం అవుతుంది. ప్యాక్ చేసిన స్నాక్స్, చిప్స్, ఊరగాయలు , ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉప్పు అధికంగా ఉంటుంది.   ఉప్పు తక్కువగా తీసుకునేందుకు  ప్రయత్నించాలి. అలాగే  తాజాగా, ఇంట్లో వండిన భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ ఉప్పు ఉన్న ఆహారం మూత్రపిండాలపై భారాన్ని తగ్గించి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జంక్ ఫుడ్.. జంక్ ఫుడ్‌లో అధికంగా నూనె, ఉప్పు, చక్కెర  ఉంటాయి, ఇవి క్రమంగా శరీరానికి , మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి. బర్గర్లు, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, శీతల పానీయాలు , ప్రాసెస్ చేసిన ఆహారాలను అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు , మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి, తాజా పండ్లు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు ,  ఇంట్లో వండిన పోషకాలతో కూడిన  భోజనం తినడం ఉత్తమం. ధూమపానం.. ధూమపానం శరీరంలోని రక్తనాళాలను దెబ్బతీసి, మూత్రపిండాలకు తగినంత రక్త సరఫరాను అడ్డుకుంటుంది. సిగరెట్లలోని విష పదార్థాలు క్రమంగా మూత్రపిండాల పనితీరును బలహీనపరుస్తాయి. ధూమపానం మానేయడం వల్ల రక్త ప్రసరణ, శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడి, మూత్రపిండాల వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ధూమపానం ఆపేయడం వల్ల  గుండె , ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వాకింగ్.. ప్రతిరోజూ 30 నిమిషాల నడక శరీరాన్ని చురుకుగా , ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. నడక రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, బరువును అదుపులో ఉంచుతుంది , రక్తపోటును నియంత్రిస్తుంది. క్రమం తప్పకుండా నడవడం మధుమేహం , ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది, తద్వారా ఎక్కువ కాలం  మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉదయం లేదా సాయంత్రం తేలికపాటి నడక మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.                            *రూపశ్రీ.
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో తల తిరగడం సమస్యకు మన ఇంట్లో ఉండే ధనియాలతో (Coriander Seeds) సులభమైన మరియు ప్రభావవంతమైన ఆయుర్వేద చిట్కాలను వివరించారు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే అంశాలు: తల తిరగడానికి కారణాలు: అసలు వెర్టిగో లేదా తల తిరగడం ఎందుకు వస్తుంది? ధనియాల ప్రాముఖ్యత: ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ధనియాలు శరీరంలోని వేడిని తగ్గించి, నాడీ వ్యవస్థను ఎలా శాంతపరుస్తాయి? రెమెడీ తయారీ విధానం: ధనియాలను ఏ విధంగా ఉపయోగిస్తే తల తిరగడం తక్షణమే తగ్గుతుంది? ముందు జాగ్రత్తలు: ఈ సమస్య ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార నియమాలు మరియు జాగ్రత్తలు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ సహజ సిద్ధమైన చిట్కాను పాటించి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. మరిన్ని వివరాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానల్ చూడండి: సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి ఇది ఒక పెద్ద అడ్డంకి అని అంటున్నారు ప్రముఖ ఫ్యాట్ లాస్ కోచ్ విజయ్ మంగం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాత్రిపూట అన్నం తినడం వల్ల కలిగే నష్టాలు మరియు ఆరోగ్యకరమైన మార్పుల గురించి ఈ VIDEO లో వివరించారు. రాత్రిపూట అన్నం ఎందుకు వద్దు? మనం పగటిపూట రకరకాల పనులు చేస్తూ ఉంటాం కాబట్టి శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. కానీ రాత్రిపూట శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట అన్నం తిని వెంటనే పడుకోవడం వల్ల ఆ శక్తి ఖర్చు కాక, అది కొవ్వుగా (Fat) మారి శరీరంలో పేరుకుపోతుంది. దీనివల్ల ముఖ్యంగా పొట్ట రావడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రత్యామ్నాయాలు ఏమిటి? విజయ్ మంగం సూచనల ప్రకారం, రాత్రిపూట అన్నానికి బదులుగా కూరగాయలు (Vegetables), ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ఉత్తమం. సలాడ్లు, సూప్స్ లేదా తక్కువ పరిమాణంలో ఇతర చిరుధాన్యాలను ఎంచుకోవచ్చు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, శరీరానికి అనవసరమైన కొవ్వు చేరదు. ముఖ్య గమనిక: మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఫిట్‌గా కనిపించాలన్నా కేవలం వ్యాయామం మాత్రమే సరిపోదు, సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. బరువు తగ్గాలనుకునే వారు విజయ్ మంగం గారి ఈ టిప్స్ పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం మా TeluguOne Health ను సందర్శించండి.  సబ్‌స్క్రైబ్ చేసుకోండి!