ఆ ఒక్కటీ అడక్కండి.. బాబు కేసులో సర్కర్ లాయర్ల వాదనల తీరు!

Publish Date:Oct 19, 2023

Advertisement

చంద్రబాబు అక్రమ అరెస్టు..తదననంతర పరిణామాలతో వైసీపీ నేతలలో గుబులు రేగుతోంది. చంద్రబాబు  అరెస్టుతో ప్రజలలో వ్యక్తమౌతున్న ఆగ్రహ జ్వాలలు తమ రాజకీయ భవిష్యత్ ను సమాధి చేయడం ఖాయమని ప్రైవేటు సంభాషణల్లో  చెబుతున్నారు. రేపు వైసీపీ పరాజయం పాలైతే.. వచ్చే కొత్త సర్కార్ ఇదే పద్ధతిని అనుసరిస్తే మన పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విషయానికి వస్తే.. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై 40 రోజులు అయ్యింది.  

ఆధారాలు లేకుండా కేసు పెట్టి అక్రమంగా ఆయనను అరెస్టు చేశారని ఇన్ని రోజులుగా ఆయన చేసిన న్యాయపోరాటంలో పసలేని ప్రభుత్వ న్యాయవాదుల వాదనతో నిర్ద్వంద్వంగా తేలిపోయింది. తొలుత అర్ధరాత్రి ఆయనను చుట్టుముట్టి అరెస్టు చేసినప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఉలిక్కిపడ్డాయి. ఆ తరువాత తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ విదేశాలలో తెలుగువారున్న ప్రతి చోటా ఆందోళనలు మిన్నంటాయి. నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బెయిలు తీసుకుని బయటకు రావడం కాకుండా అసలు తన అరెస్టు, తనపై కేసే తప్పని చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు. ఏసీబీ కోర్టు, హైకోర్టులలో క్వాష్ పిటిషన్ ను కొట్టివేసినా ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ప్రభుత్వ న్యాయవాదులు, చంద్రబాబు న్యాయవాదులు తమతమ వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ఎవరైనా.. ఇంత అడ్డగోలుగా, ఒక ప్రజా ప్రతినిథిని అరెస్టు చేసేయొచ్చా అని ఆశ్చర్యపోతారు.

ఆధారాలు చూపమని న్యాయస్థానం ఆదేశిస్తే.. ఆ ఒక్కటీ  అడక్కండి అన్నట్లుగా ఏపీ  సర్కార్ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ  వాదనలు ఉన్నాయి. అవినీతి జరిగింది. దానిలో  చంద్రబాబు  పాత్ర ఉందా లేదా అన్నది ఆయనను విచారించి  తెలుసుకుంటాం అన్నట్లుగా ముకుల్ రోహత్గీ చెబుతున్నారు. ఇక చంద్రబాబు అరెస్టు అక్రమమనీ, ఆయనను విచారించాలన్నా, అరెస్టు చేయాలన్నా గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పని  సరి  అనీ  చంద్రబాబు  తరఫు న్యాయవాది హరీష్ సాల్వే  కోర్టుకు తెలిపారు. 17ఏ సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందని చెబుతూ అందుకు ఉదాహరణగా పలు కేసులలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను ఉటంకించారు. 

చంద్రబాబు, తెలుగుదేశం ఒక వైపు న్యాయపోరాటం చేస్తూనే.. రెండో వైపు చంద్రబాబు అక్రమ అరెస్టు రాజకీయ వేధింపులలో భాగమేనని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ  ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జాతీయ మీడియా వేదికగా ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. న్యాయవాదులు కోర్టులకు కూడా ఇదే విషయాన్ని విన్నవించారు. అమిత్ షా స్వయంగా  లోకేష్ ను పిలిపించుకుని విషయాన్ని ఆరాతీశారు. చంద్రబాబు  ఆరోగ్య పరిస్థితి గురించీ వాకబు చేశారు. ఇది జరిగి వారం రోజులు దాటిపోయినా.. బీజేపీ హైకమాండ్ నుంచి చంద్రబాబు అరెస్టు విషయంలో ఎటువంటి స్పందనా రాలేదు. అయితే తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులే కాకుండా, గడ్కరీ వంటి కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు. అయితే బీజేపీ అగ్రనేతలు అ మిత్ షా, మోడీల నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదు. అది మినహా రాజకీయాలతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల నేతలూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. పారిశ్రామిక దిగ్గజాలు, ఐటీ ఉద్యోగులూ..ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. 

స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అక్రమమని న్యాయనిపుణులు సైతం చెబుతున్నారు. అయినా కోర్టులలో మాత్రం కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. చివరాఖరికి చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ అయ్యింది. ఆ తీర్పు శుక్రవారం (అక్టోబర్ 19) వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం తీర్పు ఎలా ఉంటుందన్న విషయంపైనే అందరి దృష్టీ ఉంది. సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా జరిగిన వాదనలూ, వాటిపై న్యాయమూర్తులు సంధించిన ప్రశ్నలను గమనించిన న్యాయనిపుణులు కచ్చితంగా సుప్రీం లో చంద్రబాబుకు ఊరట లభిస్తుందని అంటున్నారు. చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని చెబుతున్నారు.

అయినా గత 40 రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న సామాన్య జనంలో మాత్రం ఎక్కడో ఏ మూలో ఒక సందేహం పట్టి పీడిస్తోంది. అక్రమాస్తుల కేసులో పదేళ్లుగా బెయిలు మీద ఉన్న ముఖ్యమంత్రి జగన్, వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి దర్జాగా బయట తిరుగుతుంటే.. ఎటువంటి ఆధారాలూ లేని కేసులో చంద్రబాబు 40 రోజులుగా జైల్లో ఉండటమంటే ఏపీలో న్యాయం, ధర్మం అనే మాటలకు అర్ధం లేకుండా పోయిందా అని వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన జగన్ సర్కార్ ఇక ఇప్పుడు ఈ పద్ధతులనే ఉపయోగించి పార్టీలోని ఇతర ముఖ్య నేతలను కూడా అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నదన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ముందు అరెస్టు చేసి.. ఏవో సెక్షన్ల కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడితే చాలు.. అక్కడా జగన్ సర్కార్ కు తెలిసిన సాగదీత విధానాలతో రోజుల తరబడి బెయిలు రాకుండా వాదనలు కొనసాగించే కొత్త పద్ధతికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టిందని పరిశీలకులు అంటున్నారు. అయితే రాజకీయ అరాచకత్వానికి ఇది పరాకాష్ట అనీ, రేపు ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలైతే.. అప్పుడు జగన్ పరిస్థితి ఏమిటని పరిశీలకులు అంటున్నారు. ఇదే ఆందోళన వైసీపీ నేతలలో కూడా వ్యక్తం అవుతోంది. కొందరైతే బహిరంగంగానే ఈ విషయాన్ని చెప్పేస్తున్నారు. అయితే ఈ తీరు సరికాదనీ, కక్ష సాధింపు రాజకీయాలతో తాత్కాలికంగా పై చేయి సాధించినా, ముందు ముందు పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయనీ వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు అక్రమ అరెస్టు తమ రాజకీయ భవిష్యత్ నే ప్రమాదంలో పడేసిందన్న ఆందోళన వైసీపీ సీనియర్ నేతలలో వ్యక్తం అవుతోంది. ధర్మాన, తమ్మినేని లాంటి వారు కార్యకర్తల సమావేశాల్లో, ప్రైవేటు మీటింగులలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

By
en-us Political News

  
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు. క‌ట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.