దసరా గిఫ్ట్ గా ఎమ్మెల్యేలకు జగన్ సీల్డ్ కవర్లు.. విషయమేమిటంటే..?

Publish Date:Oct 18, 2023

Advertisement

ఏపీలో అధికార పార్టీలో ఇప్పుడు జగన్ దసరా గిఫ్టుల సంచలనం రేపుతున్నాయి. ఔను ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలు కొందరికి దసరా గిఫ్టులు పంపించారన్న ప్రజారం జోరుగా సాగుతోంది. అయితే అవేం ఆషామాషీ గిఫ్లులు కాదని పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జగన్ కొందరు ఎమ్మెల్యేలకు పింపించిన ఈ దసరా గిఫ్టులు వారి వారి నియోజకవర్గాలలో వారి పనితీరు, వారి విజయావకాశాలు తదితర అంశాలకు సంబంధించిన జగన్ సొంతంగా చేయించిన సర్వే రిపోర్టుల సీల్డ్ కవర్ లు అంటున్నారు .

అయితే ఈ సీల్డ్ కవర్ లు ఏయే ఎమ్మెల్యేలకు పంపించారన్న సమాచారం లేకపోయినా.. చాలా మంది సిట్టింగులకు ఇవి అందాయని అంటున్నారు.  దీంతో ఈ సీల్డ్ కవర్లు ఎవరెవరికి అందాయి, అందులో వివరాలేంటి అన్న వివరాలు తెలియక మొత్తం ఎమ్మెల్యేలంతా తెగ టెన్షన్ పడిపోతున్నారని పార్టీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  అక్టోబర్ నెలలో అందిన తాజా సర్వే ఫలితాలను సీల్డ్ కవర్ లో  అందుకున్న ఎమ్మెల్యేలు ఎవరన్న వివరాలు కూడా గోప్యంగానే ఉన్నాయి.  దీంతో ఆ రిపోర్టులలో ఏముంది?..  ఈసారి  పార్టీ టికెట్ గ్యారంటీ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ, అలాగే టికెట్ దక్కకుండా పోయే వారు ఎవరు? ఒక వేళ టికెట్ ఇచ్చినా.. తమ సిట్టింగ్ స్థానాలలోనే ఇస్తారా.. లేక నియోజకవర్గం షిఫ్ట్ చేస్తారా? అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి అవకాశం ఉంటుందా? లేదా ఎమ్మెల్యేగా మీ సేవలు చాలు..ఇక లోక్ సభకు పోటీ చేయండి అంటారా? అసలు ఎవరెవరికి ఈ రిపోర్టులను దసరా గిఫ్టుగా జగన్ పంపించారు అన్న ఉత్కంఠ వైసీపీ ఎమ్మెల్యేలలో  వ్యక్తమౌతోందంటున్నారు.  

ఏపీలో మరో ఐదారు నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఆరు నెలల లోపు అంటే ఇక సమయం లేదు మిత్రమా రణమే అన్నట్లుగా  పరిస్థితి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే జగన్ ఇప్పటికే పార్టీ అభ్యర్థుల ఎంపిక ఆరంభించేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  కోఆర్డినేటర్ల ద్వారా సమావేశాలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసే పని ఆరంభమైపోయిందంటున్నారు. అలాగే నియోజకవర్గాల వారీగా అసంతృప్తులను బుజ్జగిస్తూ కలిసి పనిచేసేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే, పలు నియోజకవర్గాలలో అసంతృప్తులు రెబల్స్ గా మారుతుండడం పార్టీ పెద్దలకు సైతం తలనొప్పిగా మారుతుంది. మరోవైపు  వైసీపీ సొంత సర్వే ఫలితాలు జగన్ చేతికి చేరడంతో..ఆ సర్వే ఫలితాల ఆధారంగానే  అభ్యర్థుల ఎంపికకు చేస్తున్న కసరత్తులో భాగంగానే జగన్ కొందరు ఎమ్మెల్యేలకు వారి వారి నియోజకవర్గాలలో సర్వే ఫలితానికి సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్ లో పంపారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అంతే కాదు సర్వేల ఫలితాల ఆధారంగా పంపిన సీల్డ్ కవర్ లో ఆయా నియోజకవర్గాలలో  పార్టీ పరిస్థితి, సదరు నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు, గెలుపు అవకాశాల వివరాలతో పాటు 25 అంశాలతో కూడిన లేఖలను సీఎం పంపించారని చెబుతున్నాయి. అయితే ఇప్పటికింకా ఆ లేఖలు ఎవరికీ చేరలేదనీ, ఒకటి రెండు రోజులలో అవి అందుతాయనీ పార్టీ వర్గాల సమాచారం.  దీంతో   తమ భవిష్యత్ ఎలా ఉండబోతుందోనని ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడుతున్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా తీసిన సర్వేల ఫలితాలు ఈ లేఖలో ఉండనుండగా.. పనితీరు బాగోలేని వారి పట్ల జగన్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. ప్రజా మద్దతు లేని ఎమ్మెల్యేలకు ఈసారి సీటు ఇవ్వడంలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈసారి సీటు ఉంటుందా ఉండదా అన్నది లేఖ వస్తే కాని అర్ధమయ్యే పరిస్థితి లేకపోవడంతో సిట్టింగుల్లో కలవరం మొదలైంది.  పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలు మెరుగ్గా పనిచేయాలని, లేకపోతే కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తామని గతంలోనేజగన్ సంకేతాలు  పంపారు. గతంలో తాడేపల్లిలో వర్క్ షాప్ నిర్వహించిన సందర్భం ఆ ఎమ్మెల్యేలకే ఇప్పుడు మళ్ళీ లేఖలు పంపి ఉంటారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

ఇప్పటికే రెండు విడతలుగా వైసీపీ సొంత సర్వేల ఫలితాలు వెలువడగా.. తాజాగా మూడవ విడత  ఫలితాలు కూడా అందాయి. గతంలో అందిన రెండు ఫలితాల ఆధారంగా జగన్ సమీక్షా సమావేశాలు నిర్వహించి పనితీరు మెరుగుపర్చుకోవాలని హెచ్చరించగా.. ఇప్పుడు ఈ ఫైనల్ సర్వే ఫలితాల తర్వాత మాత్రం ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. డైరెక్ట్ గా ఎమ్మెల్యేలకు లేఖలు పంపిన జగన్ అందులోనే పూర్తి వివరాలను పొందుపరిచారంటున్నారు. దాదాపుగా 25 నుండి 30 మందికి ఈసారి టికెట్లు కష్టమేనని.. ఇప్పటికే కొత్త అభ్యర్థుల కోసం అన్వేషణ కూడా మొదలైనట్లు చెప్తున్నారు. దీంతో వైసీపీలో ఇప్పుడు ఈ లేఖల కలకలం రేగుతుంది. కాగా, ఎమ్మెల్యేల పనితీరుపై లేఖలు సరే.. అసలు వైసీపీ తాజా ఫైనల్ సర్వేలో రాష్ట్రంలో ఎలాంటి ఫలితాలు అందాయన్నది రాజకీయ వర్గాలకు ఆసక్తిగా మారింది. కాగా పరిశీలకులు మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ సిట్టింగులకు టికెట్ నిరాకరించి కొత్త అసంతృప్తిని ఆహ్వానించే పరిస్థితిలో లేరనీ, పని తీరు, ప్రజా మద్దతుతో పని లేకుండానే సిట్టింగులను బుజ్జగించి పనితీరు మెరుగుపరుచుకోమని బతిమలాడుకోవడమే ఆ లేఖల సారాంశం అయి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ప్రజా వ్యతిరేక సెగ తగిలిన ఎమ్మెల్యేలూ, నేతలలో గెలుపు ఆశలు అడుగంటి పోయాయని, అందుకే పార్టీ పెద్దల హెచ్చరికలు, బెదరింపులను ఖాతరు చేసే పరిస్థితి ఉండదనీ అంటున్నారు. తాను ఎవరినీ వదులుకోననీ, అందరూ తనవారేనని గతంలో జగన్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మొత్తంగా వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి జగన్  సీల్డ్ కవర్ నివేదికల్లో ఉన్న విషయాన్ని బట్టి ప్రజ్వరిల్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.