ఇంతలా చెబుతున్నా ఎందుకు నమ్మరు.. జనంపై సజ్జల ఆక్రోశం!

Publish Date:Oct 19, 2023

Advertisement

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అవినీతికి  పాల్పడ్డారు. స్కిల్ స్కాంలో ఆయనకు ముడుపులు అందాయి. అని ఎంతగా చెబుతున్నా ప్రజలు ఎందుకు నమ్మడం లేదు? మేం ఇంతగా చెబుతున్నా మీరెందుకు నమ్మరు? అంటూ జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి జనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేం చెప్పేది మీరు నమ్మి తీరాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంత చెప్పినా ఎందుకు నమ్మడం లేదంటూ ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

గత  40 రోజులుగా చెప్పించే చెబుతూ వైసీపీ నేతలు మరీ ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డీ నెత్తీ నోరూ బాదుకుని మరీ చెబుతున్నా జనం చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటే నమ్మడం లేదు. ఆయనను జగన్ సర్కార్ కక్ష పూరితంగా అరెస్టు చేసిందంటూ రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు ముందు వరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడాలంటే ఎందుకొచ్చిన గొడవ.. కేసులు, దాడులను ఎదుర్కొనవలసిన అవసరం ఏముంది? అనుకుంటూ తమ ఆగ్రహాన్ని, వ్యతిరేకతనూ మనస్సులలోనే దాచుకుని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ గడిపేసిన జనం ఇప్పుడిక తమ ఆగ్రహాన్ని, వ్యతిరేకతనూ  దాచుకోవడానికి, అణచుకోవడానికి ప్రయత్నించడంలేదు.

ప్రభుత్వ వ్యతిరేకతను బాహాటంగా, బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు. దీంతో సజ్జల వారికి చిర్రెత్తుకొచ్చింది. మీడియా సమావేశం పెట్టి మరీ  ఇన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అంటూ మేం చెబుతున్నా మీరెందుకు నమ్మరు? చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని మిమ్మల్ని నమ్మించడానికి ఇంకా ఏం చేయాలి అని ప్రశ్నించారు. ఔను మీడియాలో ఆయన మాట్లాడిన విషయాల సారాంశమిదే. దీంతో ఇప్పటి వరకూ ఏమో స్కిల్ కేసులో కుంభకోణం ఉందేమో అని జనంలో ఏమూలైనా అనుమానాలు ఉండి ఉంటే అవన్నీ పటాపంచలైపోయాయి. సజ్జల మాటల తరువాత చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం కక్ష పూరితంగానే అక్రమ కేసు బనాయించి జైలుకు పంపించారని విస్పష్టంగా అర్ధమైంది.

ఇదే విషయంపై నెటిజన్లు సజ్జలను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును ఉద్దేశపూర్వకంగానే ఇరికించిందనడానికి సజ్జల మాటలే నిదర్శనమంటూ ఫైరౌతున్నారు. వైసీపీ చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలు జనం నమ్మడం లేదనడానికి సజ్జల మాటలే సాక్ష్యమంటూ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వివరిస్తున్నారు.  ఆధారాలతో సహా చంద్రబాబును అరెస్టు చేశామంటూ ఓ వైపు సజ్జల అండ్ కో  చెబుతుంటే.. న్యాయస్థానాలలో ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాదులు మాత్రం.. ఆధారాలా వాటి గురించి అడగకంటి.. స్కిల్ కేసులో అవినీతి జరిగింది. ఇక ఇప్పుడు ఆధారాలు సేకరించడం కోసమే చంద్రబాబును అరెస్టు చేశాం అంటూ చెబుతున్నారు. సెక్షన్ 17ఏపై కూడా అదే వితండ వాదన అటుతిప్పీ ఇటు తిప్పీ వినిపిస్తున్నారు.

 రేపు, మాపు అంటూ వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. స్కిల్ కేసులో తనకు కావలసింది బెయిలు కాదు.. అసలు కేసే కొట్టేయాలంటూ చంద్రబాబు ధర్మాగ్రహంతో న్యాయపోరాటం సాగిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ స్కిల్ కేసులో ఆధారాలు చూపలేక.. నీళ్లు నములుతోంది. అవినీతి జరిగిందని చెబుతున్నాం కదా.. కేసు కట్టేశాం.. ఇక ఇప్పుడు ఆధారాల కోసం విచారిస్తాం అంటున్నారు.   అందుకే సజ్జల మీడియా ముందుకు వచ్చి ఇంతగా చెబుతున్నా మీరెందుకు నమ్మరు అంటూ జనాన్ని నిందిస్తున్నారు. వాస్తవాలు కళ్లెదుట సాక్షాత్కరిస్తుంటే జనం అబద్ధాలు ఎందుకు  నమ్ముతారన్న లాజిక్ ను సజ్జల మరచిపోయారు పాపం. 

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.