వైకాపా ఓటమికి సాక్షి కూడా కారణమేనా?

Publish Date:Jul 21, 2014

Advertisement

 

వైకాపా పుంగనూరు యం.యల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, “సాక్షి మీడియా వైకాపా విజయం తధ్యం అన్నట్లు చేసిన ప్రచారం కారణంగానే తమలో అతి విశ్వాసం పెరిగి చివరికి ఓడిపోయామని” చెప్పడం ఆ పార్టీ ఓటమికి గల మరో కొత్త కారణం ఆవిష్కృతమయింది. కొన్ని పత్రికలు, టీవీ చాన్నాళ్ళు తమపై విష ప్రచారం చేస్తూ, తెదేపా గెలుపుకు గట్టిగా కృషి చేశాయని వైకాపా నేతలు, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చాలా సార్లు ఆరోపించారు. అయితే ఆయనకు చెందిన సాక్షి మీడియా కూడా వారి పద్దతిలోనే విమర్శలకు చాలా ఘాటుగా ప్రతివిమర్శలు చేస్తూ వైకాపా విజయానికి చాలా కృషి చేసింది. కానీ ఇప్పుడు ఆ ‘సాక్షి’ కారణంగానే తమ పార్టీ ఓడిపోయిందని వైకాపాకు చెందిన పెద్దిరెడ్డి చెప్పడం విశేషం. సాక్షి కధనాలు తామందరినీ గెలుస్తామనే ఒక భ్రమలో ఉంచి తప్పుదారి పట్టించినట్లు ఆయన ఆరోపిస్తున్నారు.

 

సాక్షి పత్రిక వైకాపా గెలుపు కోసం చాలా కష్టపడింది. సీబీఐ కేసులతో జగన్మోహన్ రెడ్డి అరెస్టయ్యి జైలుకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డిని ఒక త్యాగమూర్తిగా, మడమ తిప్పని ఒక గొప్ప సమరయోధుడిగా అభివర్ణిస్తూ చాలా చక్కగా వెనకేసుకు రావడమే కాకుండా, ఆయనను వైకాపా అభిమానులకు చేరువ చేయడానికి విశేష కృషి చేసింది. నిజానికి జగన్ వెనుక ‘సాక్షి’ మీడియా లేకపోయి ఉంటే ఆయన పరిస్థితి, పరపతి వేరే విధంగా ఉండేదేమో? కానీ వైకాపాకు, జగన్మోహన్ రెడ్డికి సాక్షి మీడియా ఒక రక్షణ కవచంగా నిలిచి, తనొక మీడియా సంస్థననే విషయం కూడా మరిచిపోయి అచ్చు ఒక రాజాకీయ నాయకుడిలాగానే, వారి ప్రత్యర్ధులను తన ప్రత్యర్దులుగా భావించి శత్రువులతో, చివరికి సాటి మీడియాతో కూడా అలుపెరగని పోరాటం చేసింది.

 

జగన్, విజయమ్మ, షర్మిల, భారతి మరియు ఆ పార్టీలో ఇతర నేతలు చెప్పిన మాటలు పొల్లుపోకుండా ప్రచురించింది, ప్రసారం చేసింది. వారి ప్రతీ మాటకు, చర్యకు చాలా చక్కటి బాష్యం చెప్పేది. పనిలోపనిగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని, ఆయన పరిపాలనను, జగన్మోహన్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రజలను ఉద్దరించేందుకే దివి నుండి భువికి దిగివచ్చిన దైవ దూతలన్నంతగా డప్పుకొట్టింది. ఆ తమకంలోనే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైకపా తిరుగులేని మెజార్టీతోరాష్ట్రంలో అధికారం లోకి వస్తుందని బల్ల గుద్ది మరీ సాక్షి మీడియా వాదించింది. కానీ ఆ డప్పుకు ఇంకో బలమయిన కారణం కూడా ఉందని చెప్పవచ్చును.

 

జగన్మోహన్ రెడ్డి ఎవరి సలహాలు వినరని, పార్టీలో ఎవరినీ ఏ విషయంలో కూడా సంప్రదించరని, తనకు తోచిందే పార్టీ శిలాశాసనంలా అమలుచేయాలని భావిస్తారని, పార్టీలో తనకు భిన్నంగా ఎవరయినా ఆలోచనలు చేసినా,సలహాలు ఇచ్చినా సహించలేరని, ఆ పార్టీని విడిచిపెట్టి బయటకు వచ్చిన దాడి వీరభద్రరావు, సబ్బం హరి వంటి అనేక మంది సీనియర్ నేతలు చెప్పారు. అటువంటప్పుడు ‘సాక్షి’ మాత్రం పిల్లి మెడలో గంట కట్టే సాహసం ఏవిధంగా చేస్తుంది? బహుశః అందుకే జగన్మోహన్ రెడ్డి మాటలకు, ఆలోచనలకు, కోరికలకు సాక్షి అద్దంపట్టాలని చూసింది తప్ప ఆయనకు వాస్తవ పరిస్థితి వివరించి అప్రమత్తం చేసే సాహసం చేయలేకపోయి ఉండవచ్చును. లేకుంటే రాష్ట్రంలో విస్త్రుతమయిన నెట్ వర్క్ ఉన్న సాక్షికి వైకాపాకు వ్యతిరేఖంగా మారుతున్న ప్రజల ఆలోచనలను, అభిప్రాయాలను పసిగట్టలేదని అనుకోలేము.


ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సాక్షిని తన రాజకీయ ఆలోచనలకు, కోరికలకు, వ్యూహాలకు, కార్యక్రమాలకు, పర్యటనలకు సాక్షిగా కాక, ఒక మీడియా సంస్థగా భావించి స్వేచ్చనిచ్చి ఉండి ఉంటే బహుశః సాక్షి తప్పకుండా వాస్తవ పరిస్థితులను, ప్రజలలలో మారుతున్న ఆలోచనా ధోరణిని, ప్రజలపై చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్, తెదేపా-బీజేపీల ఎన్నికల పొత్తుల ప్రభావం వంటివన్నీ జగన్మోహన్ రెడ్డి కళ్ళకు కట్టినట్లు వివరించి ఉండేది. కానీ ‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్...’అనే పద్ధతిలో కలం కదపవలసి రావడంతో సాక్షి జగన్మోహన్ రెడ్డిని ఎన్నడూ అప్రమత్తం చేసే దైర్యం చేయలేకపోయింది. తన పార్టీ విజయం సాధించడం తధ్యమని అతివిశ్వాసంతో వ్యవహరించబట్టే తమ పార్టీ ఓడిపోయిందని జగన్ స్వయంగా చెప్పారు. అందుకే సాక్షి కూడా ఆయన సారధ్యంలో వైకాపా తిరుగులేని విజయం సాధిస్తుందని బాకా ఊదవలసి వచ్చింది. ఆ బాకా చెవులకింపుగా ఉన్నందున జగన్ దానిని నమ్మారు. కానీ ప్రజలు మాత్రం దానిని నమ్మకపోవడంతోనే చిక్కు వచ్చిపడింది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.