కోనసీమ అల్లర్లెవరి పనో తేలిపోయింది!

Publish Date:Jun 14, 2022

Advertisement

పచ్చటి కోనసీమలో అల్లర్ల చిచ్చు ఎవరి పనో తేలిపోయింది. కోనసీమ అల్లర్ల కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారంతా వైసీపీ కార్యకర్తలే. వీరిలో మంత్రి పినిపె విశ్వరూప్ అనుచరులు సైతం ఉన్నారు. ఈ అల్లర్లలో మంత్రి పినిపె విశ్వరూప్ నివాసం దగ్ధమైన సంగతి విదితమే. పోలీసులు అల్లర్ల కేసులో అరెస్టు చేసిన వారిలో అత్యధికులు ఆ మంత్రిగారి అనుచరులే ఉండటం చూస్తుంటే నిర్ద్వంద్వంగా అల్లర్ల వెనుక ఉన్నది వైసీపీయే అన్న విషయం తేటతెల్లం అవుతుంది.

ఇప్పటి వరకూ కోనసీమ అల్లర్లకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన వారు రెండు వందల మందికి పైనే ఉన్నారు. వారంతా వైసీపీ కార్యకర్తలే. కోనసీమ సాధన సమితి నేతలనూ పోలీసులు అరెస్టు చేసి కేసులు పెట్టారు. వారు కూడా పినిపై విశ్వరూప్ అనుచరులే. ఈ అరెస్టులను బట్టే వైసీపీ కుట్రతోనే కోనసీమలో చిచ్చు పెట్టిందని అవగతమౌతోంది. వాస్తవం ఇలా ఉండగా... ఇప్పటి వరకూ కోనసీమ విధ్వంసంపై ఒక్క మాట కూడా మాట్లాడని సీఎం జగన్ అనంతపురంలో మంగళవారం కోనసీమలో విపక్షాలు చిచ్చు పెట్టాయంటూ ఆరోపణలు చేశారు.

ఏకంగా మంత్రి ఇంటిని దగ్ధం చేశారు అంటూ తెలుగుదేశం, జనసేనలపై విమర్శలు గుప్పించారు. అల్లర్ల వెనుక ఉన్నది వైసీపీయేనంటూ పోలీసులు అరెస్టుల సాక్షిగా తేటతెల్లమైపోతుంటే.. జగన్ మాత్రం ఆ అల్లర్ల వెనుక ఉన్నది విపక్షాలేనంటూ జనం సానుభూతి పోందేందుకు ప్రయత్నిస్తున్నారు. అల్లర్లు జరిగి ఇన్ని రోజులైనా.. ఆ విధ్వంసంలో ఏకంగా మంత్రి నివాసం దగ్ధమైనా జగన్ ఇప్పటి వరకూ మంత్రిని పరామర్శించిన పాపాన పోలేదు. దీనిని బట్టి కోనసీమ విధ్వంసాన్ని  విపక్షాలపై విమర్శలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలన్న యావే కానీ.. వాస్తవాలు బయటపడుతున్నా, అరెస్టయిన వారంతా అధికార పార్టీ అనుచరగణం అని తేలిపోయినా అంగీకరించేందుకు మాత్రం వైసీపీ కానీ జగన్ కానీ సిద్ధంగా లేరని అవగతమౌతోంది.

 వర్గాలు, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడమే జగన్ సర్కార్ ధ్యేయంగా కనిపిస్తున్నది. జగన్ సర్కార్ ఓట్ల వేటలో కోనసీమ జిల్లాలో చిచ్చు రగిల్చింది. అసలు  జగన్ సర్కార్ తన విధానాలతో రాష్ట్రంలో ప్రశాంతతకు తావు లేకుండా చేసింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అశాంతి, ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికి పోతోంది.అందులో భాగంగానే ప్రశాంతతకు మారు పేరైన కోససీమలో కుల చిచ్చు రేపి పబ్బం గడుపుకోవాలన్న జగన్ సర్కార్ యత్నం.. బూమరాంగ్ అయ్యింది. అల్లర్ల వెనుక ఉన్నది వైసీపీయే అన్న విషయం తేటతెల్లమయ్యేలా అల్లర్ల కారకులంటూ పోలీసులు అరెస్టు చేసిన వారంతా వైసీపీ కార్యకర్తలే ఉన్నారు,

వారిలోనూ మంత్రి అనుచరుల సంఖ్యే ఎక్కువ.  అసలు కోనసీమలో చిచ్చు పెట్టడం కోసమే  కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటించిన సమయంలోనే పలు దళిత సంఘాలు కోనసీమకు డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరాయి. అప్పడు వాటి వినతిని పెడచెవిన పెట్టి కోనసీమ జిల్లాగా నామకరణం చేసింది. అంతే కాదు నిర్ణయం తీసేసుకున్నాం ఇక మార్పు లేదంటూ ప్రభుత్వ పెద్దలు ఘనంగా ప్రకటనలు కూడా చేసేశారు.  ఆ తరువాత  హఠాత్తుగా కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తే ప్రభుత్వం ప్రకటించింది.

దీంతో వైసీపీ కార్యకర్తలే ఆ మార్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలు, అల్లర్లకు దిగారని విశ్లేషకులు అంటున్నారు. అసలు మొదటే జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ అని పేరు పెట్టి ఉంటే ఎలాంటి ఆందోళనలకూ తావుండేది కాదనీ, కానీ అలా చేస్తే వైసీపీకి పొలిటికల్ మైలేజీ ఉండదన్న ఉద్దేశంతోనే  సర్కార్ కోనసీమలో కులచ్చిచ్చును ప్రేరేపించేలా కుట్రపన్నిందనీ అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పడు అల్లర్ల కారకులంతా వైసీపీవారేనని పోలీసుల అరెస్టులతో తేటతెల్లమవ్వడంతో కోనసీమ విధ్వంసంలో దోషి ప్రభుత్వమేనని పరిశీలకులు అంటున్నారు.


 

By
en-us Political News

  
ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు ఆమోదముద్ర వేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వచ్చే నెల 1న లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కాగా ఈ అంశంలో కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి వచ్చే నెల 9న జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే 14 నుంచి17 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ఇక విపక్ష ఎస్పీయే 9 నుంచి11, నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2 నుంచి4 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.
సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలపడాన్ని మార్షల్స్ అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం మార్షల్స్‌ను అడ్డం పెట్టుకుంటోందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంద మంది ప్రముఖులతో ప్రకటించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఈ జాబితాలో 13వ స్థానం దక్కగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు.
హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయనీ, ఈ సందర్భంగా బలమైన ఈదురుగాలులతో పాటు వడగళ్లు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో పలు పథకాలు ప్రకటించారు. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని కుటుంబాల్లోని మహిళలకు ఇల్లతరసి పథకం కింద గృహోపకరణాలు కొనుగోలుకు 8వేల రూపాయల విలువైన వన్ టైమ్ కూపన్ ప్రకటించారు. ప్రస్తుతం మహిళా కుటుంబ పెద్దలకు నెలనెలా ఇస్తున్న వెయ్యిరూపాయల ఈర్థిక సయాన్ని రెండు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు ఇప్పటికీ దేశంలోని అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచాయన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవంతో, భవిష్యత్తులో అమరావతిని హైదరాబాద్‌ను మించిన ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర వాసులకు హామీ ఇచ్చారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు మరింత ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగు సమాజం మీద తెలుగేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముద్ర ఎన్నటికి చెరిగిపోనిది. నటుడిగా అయన కృషి అజరామరం. రాజకీయ నాయకుడిగా అయన 14 ఏళ్ల ప్రస్థానంలో అయన ప్రభావం మహత్తరం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడంతో పాటు, తెలుగు సమాజంలో ఫ్యూడల్ వ్యవస్థలను నిర్మూలించి, అట్టడుగు వర్గాల సామాజిక, రాజకీయ ఉన్నతికి తోడ్పడం లో ఎన్టీఆర్ చూపించిన చొరవ నభూతో నభవిష్యతి.
ఈ తీర్మానంలో ప్రధానంగా ప్ర‌స్తావించిన సెక్ష‌న్ 5 స‌వ‌ర‌ణ అత్యంత కీల‌కం. 2014 ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని సెక్ష‌న్ ఐదు ప్ర‌కారం.. హైద‌రాబాద్ ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంది. ఆ త‌ర్వాత ఏపీకి కొత్త రాజ‌ధాని ఉండాల‌ని ఉంది. కానీ, దాని పేరు అమ‌రావ‌తి అని ఎక్క‌డా స్ప‌ష్టంగా లేదు. ఈ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేసి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అనే ద‌గ్గ‌ర అమ‌రావ‌తి అనే ప‌దాన్ని చేర్చాల‌ని.. కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీ శనివారం తీర్మానం చేసింది.
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ, దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి శాశ్వతంగా స్వస్తి పలకడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
తాజాగా కాకినాడ జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివకాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ బషీర్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి సెంటిమెంట్లు బాగా ఎక్కువ‌. ఎందుకంటే ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి సెంటిమెంట్ల ద్వారా.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.