గ్రూప్ వన్ మూల్యాంకన తప్పుల తడక.. కోర్టుకు నివేదిక సమర్పించిన సిట్.!

Publish Date:Aug 12, 2026

Advertisement

ఏపీలో  వైకాపా   హయాంలో నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో  అక్రమాలు,   నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ప్రత్యేక దర్యాప్తు బృందం  సిట్  తేల్చింది. ఈ   వ్యవహారంపై దర్యాప్తు జరిపిన సిట్  తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు   నివేదిక  సమర్పించింది. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో  దర్యాప్తు బృందం, మూల్యాంకన ప్రక్రియలో చోటుచేసుకున్న  నిబంధనల ఉల్లంఘనలను, సాంకేతిక,  ఫోరెన్సిక్ ఆధారాలతో సహా ధర్మాసనం ముందుంచింది. 

సిట్ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, ఏపీపీఎస్సీ ప్రాథమిక నియమావళికి  విరుద్ధంగా ఒకే జవాబు పత్రాలను  మూడు విడతలుగా మూల్యాంకనం చేసినట్లు అధికారులు శాస్త్రీయంగా నిర్ధారించారు. డిజిటల్ విధానం, హైలాండ్ రిసార్ట్, అలాగే  విజయవాడ కేంద్రంగా మూడు వేర్వేరు దశల్లో ఈ మూల్యాంకన   సాగిందని నివేదిక పేర్కొంది.

ముఖ్యంగా గ్రూప్ వన్  ఉద్యోగాలకు ఎంపికైన మొత్తం 165 మంది అభ్యర్థులలో   160 మంది జవాబు పత్రాలలో మార్కులకు సంబంధించి మార్పులు, చేర్పులు జరిగాయని సిట్ తేల్చింది. అలాగే ఎంపిక కాని 161 మందికి సంబంధించి 153 మంది పేపర్లలోనూ, న్యాయస్థానాన్ని ఆశ్రయించిన 405 మంది రిట్ పిటిషనర్ల జవాబు పత్రాలలోనూ  వ్యత్యాసాలు చోటుచేసుకున్నట్లు సిట్  దర్యాప్తులో తేల్చింది. 

ఫోరెన్సిక్ తనిఖీలలో చీఫ్ ఎగ్జామినర్లు నేరుగా మార్కులను దిద్దడం, మార్పులు చేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు రాతపూర్వక ఆధారాలు లభించాయని సిట్ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. దర్యాప్తు సమయంలో 61 జవాబు పత్రాల స్లిప్పులపై వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్  ఉపయోగించినట్లు ఫోరెన్సిక్ నిపుణులు  గుర్తించారు. దీనికి తోడు  భద్రంగా ఉంచాల్సిన పరీక్ష పత్రాలను 84 రోజుల పాటు విజయవాడ సమీపంలోని ఒక రిసార్ట్‌లో ఉంచినట్లు దర్యాప్తులో తేలింది. నిబంధనల ప్రకారం మూల్యాంకనం కోసం అందుబాటులో ఉంచాల్సిన 452 మంది అర్హులైన నిపుణుల ప్యానెల్‌ను పూర్తిగా పక్కనబెట్టి,  66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల సహాయంతోనే ఈ మూల్యాంకన ప్రక్రియను నడిపించారని సిట్ పేర్కొంది. 

 మూడోసారి అనధికారికంగా మూల్యాంకనం జరిపేందుకు కొత్తగా   బార్‌కోడ్ షీట్లను ప్రత్యేకంగా ముద్రించినట్లు సిట్ తన నివేదికలో  పేర్కొంది. నిబంధనల ప్రకారం ఒకసారి మూల్యాంకనం పూర్తయిన తర్వాత ఇలా మళ్లీ మళ్లీ పేపర్లను దిద్దడం చట్టవిరుద్ధమని సిట్ కోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారంలో పారదర్శకత   లోపించిందని, ఫోరెన్సిక్ ఆధారాలతో సహా దాదాపు 173 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి హైకోర్టుకు అందజేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. సుమారు 736 మంది అభ్యర్థుల జవాబు పత్రాలకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయిందని, మిగిలిన కొద్దిమంది నివేదికలను   త్వరలోనే అందజేస్తామని సిట్ పేర్కొంది.  కాగా అభ్యర్థుల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు సిట్ సమర్పించిన   నివేదిక ప్రతులను తమకు అందించాలని కోర్టును కోరారు. దానికి అంగీకరించిన హైకోర్టు బెంచ్, నివేదిక ప్రతులను అందుబాటులో ఉంచాలని రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది.   

APPSC Group 1 Evaluation Irregularities, AP High Court Group1,  SIT Report, AP High Court, Andhra Pradesh SIT Report, TeluguOne 

By
en-us Political News

  
సాంకేతిక పరిజ్ఞానం, పాలనా సంస్కరణలు, మౌలిక వసతుల విస్తరణ వంటి కీలక రంగాల్లో చంద్రబాబు చూపుతున్న చొరవ, ఆయన దార్శనికత ఏపీని అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తోందన్నారు. 
ఒకవైపు పార్టీ మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే.. మరొ వైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు మాత్రం ప్రజా సమస్యల సభలో గళమెత్తుతానంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం నెట్టింట తెగ ట్రోల్ అవుతోంది.
13 మందిపై 20,000 పేజీల భారీ సీబీఐ ఛార్జ్‌షీట్..!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విధానంపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో రాజకీయ చర్చ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు పదవుల కంటే పార్టీ సిద్ధాంతాలకు, ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చే నాయకులు అరుదుగా కనిపిస్తారు
రాజకీయ విభేదాల నేపథ్యంలో తనను కులం పేరుతో దూషించి, అవమానించారని ఆరోపిస్తూ ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు
 భార్య బస్సు క్లీనర్‌తో వెళ్లిపోయిందని సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశాడు ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ ..!
ఓటర్ల జాబితా పునఃపరిశీలన సమయంలో ఎన్నికల సిబ్బంది ఆయన పేర్కొన్న చిరునామాకు వెళ్లి విచారణ జరిపారు. ఆ సందర్భంగా సదరు అపార్ట్‌మెంట్‌లో ప్రకాష్ రాజ్ గడచిన నాలుగు సంవత్సరాలుగా నివసించడం తేలింది. నివాసం ఉండని వ్యక్తి పేరును ఆ ప్రాంత ఓటర్ల జాబితాలో కొనసాగించడం నిబంధనలకు విరుద్ధం కావడంతో.. అధికారులు ఆయన పేరును చిరునామా మారిన ఓటర్ల కేటగిరీ కింద వర్గీకరించారు.
అధికారుల వేధింపులు, పని ఒత్తిళ్లే కారణమంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ ఆశా వర్కర్ చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర ఘర్షణలకు, ప్రెస్ మీట్ల విమర్శలు-ప్రతివిమర్శలకు వేదికగా మారిన ముఖ్యమైన అంశాల్లో మెగా డీఎస్సీ ఒకటి..
సూర్యగ్రహణం వేళ కరెంట్ వాడకం తగ్గించిన వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఆక్టోపస్ ఎనర్జీ ఆఫర్ ప్రకటించింది. సోలార్ పవర్ కొరత, గ్రిడ్ భద్రత మరియు నిపుణుల విశ్లేషణల పూర్తి వివరాలు ఇవే!
ప్రయాణాల్లో లేదా ఎక్కడైనా సులభంగా, అత్యంత ఉత్పాదకంగా పనిచేసేందుకు అవసరమైన బెస్ట్ రిమోట్ వర్కింగ్ గ్యాడ్జెట్లు, ల్యాప్‌టాప్ స్టాండ్‌లు, నోయిస్ కాన్సెలేషన్ హెడ్‌ఫోన్లు మరియు పవర్ బ్యాంక్స్ వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.