తెలంగాణ కంటే 11 రెట్లు ఏపీనే బెటర్

Publish Date:Sep 15, 2015

Advertisement


 

నవ్యాంధ్రప్రదేశ్ మరో అరుదైన ఘనతను సాధించింది. రాష్ట్ర విభజనతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నా, భారతదేశంలో వ్యాపారాలకు అనువైన రాష్ట్రాల్లో మాత్రం రెండో స్థానం దక్కించుకుంది. హైదరాబాద్ లాంటి మహానగరం...ఆంధ్రప్రదేశ్ లో లేకపోయినా, పెట్టుబడులకు సెకంట్ బెస్ట్ ప్లేస్ అంటూ ప్రపంచ బ్యాంక్ తేల్చిచెప్పింది.పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విధానం, పరిశ్రమల సమాఖ్యలైన సీఐఐ, ఫిక్కీ, కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీతో కలిసి జాబితాను రూపొందించిన ప్రపంచ బ్యాంక్...రాష్ట్రాలకు ర్యాంకింగ్ లు ఇచ్చింది.

అయితే భారత్ లో వ్యాపారాలు చేయడం కష్టమని, అనేక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందన్న వరల్డ్ బ్యాంక్... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సంస్కరణలు అమలు చేయాలని సూచించింది. వ్యాపారాలకు అనుకూలమైన 182 దేశాల జాబితాలో భారత్ దాదాపు అట్టడుగున 142వ స్థానంలో ఉందన్న ప్రపంచ బ్యాంక్  డైరెక్టర్ రుహల్...నిర్మాణ అనుమతుల వంటి అంశాల్లోనైతే... ఏకంగా చివరి పది దేశాల్లో ఉందన్నారు.

ఇక టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలు కాగా, రెండో స్థానంలో నిలిచిన ఏపీలో మిత్రపక్షం టీడీపీ అధికారంలో ఉండటం విశేషం, ఈ లిస్ట్ లో గుజరాత్ మొదటి టాప్ ప్లేస్ లోనూ, జార్ఖండ్ మూడో స్థానంలో నిలవగా, మిజోరాం, జమ్మూకాశ్మీర్, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లు అట్టడుగున ఉన్నాయి, అన్ని వనరులూ కలిగి హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం...13వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య పోటీ వాతావరణాన్ని పెంచడానికే ఈ జాబితా రూపొందించినట్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. ల్యాండ్ అలాట్ మెంట్, కార్మిక సంస్కరణలు,పర్యావరణ అనుమతులు, ఇన్ ఫ్రా వంటి మొత్తం 8 అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా తయారు చేసినట్లు తెలిపారు.

పెట్టుబడులు, వ్యాపారాలకు అనుకూలమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కి రెండో స్థానం లభించడం శుభపరిణామమని, ప్రపంచ బ్యాంక్ నివేదిక నవ్యాంధ్ర అభివద్ధికి తోడ్పడుతుందని ప్రభుత్వ వర్గాలు సంతోషం వ్యక్తంచేస్తున్నాయి

By
en-us Political News

  
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.