నంద్యాల బైపోల్ తో...ఒకే దెబ్బకు రెండు పిట్టలు

Publish Date:Sep 15, 2015

Advertisement



ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హోదా కోసం జరుగుతున్న పోరాటానికి నాయకత్వం వహించి క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్న ఆయన... అందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించుకొనే పనిలో పడ్డారు. ఇలాంటి సమయంలో ఏవైనా ఎన్నికలు జరిగితే, అధికార పార్టీకి కనువిప్పు కలిగేలా ప్రజాగ్రహం బయటపడుతుందని,అందుకు నంద్యాల ఉప ఎన్నికే సరైన ఆయుధమని జగన్ భావిస్తున్నారట.

ఈ నేపథ్యంలోనే నంద్యాల ఎంపీ స్థానానికి ఉపఎన్నిక జరగాలని జగన్ బలంగా కోరుకుంటున్నారట. ఫ్యాను గుర్తుపై గెలిచి, వారం తిరక్కుండానే టీడీపీ కండువా కప్పుకున్న ఎస్పీవై రెడ్డికి బుద్ధి చెప్పినట్లూ ఉంటుంది, అటు తెలుగుదేశం పార్టీకి వైసీపీ సత్తా చాటినంటూ ఉంటుందని లెక్కలేసుకుంటున్న జగన్, ఎలాగైనా ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు పడేలా స్పీకర్ పై ఒత్తిడి పెంచాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారట. ప్రస్తుత పరిస్థితుల్లో నంద్యాల ఉపఎన్నిక జరిగితే, మనమేంటో నిరూపించుకోవచ్చని, ప్రజల అటెన్షన్ ను
కూడా తమవైపు తిప్పుకోవచ్చని జగన్ భావిస్తున్నారట.

అయితే అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా వైసీపీకి షాకిచ్చి...ఫ్యాన్ ను గాలికి వదిలేసినా, అధికారికంగా టీడీపీలో చేరలేదని, ఎస్పీవై రెడ్డి అయితే...గెలిచి వారం రోజులకే చంద్రబాబును కలిసి పార్టీలో చేరారని, దాంతో అనర్హత వేటు పడటం ఖాయమని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద...ఎస్పీవై రెడ్డిపై ఫిర్యాదు చేసి, పదిహేను నెలలు దాటిపోతున్నా, స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై పార్టీ ఎంపీలతో జగన్ చర్చించారట.

ఎలాగైనా నంద్యాలలో బైపోల్ జరగాలని కోరుకుంటున్న జగన్... ఎస్పీవై రెడ్డిపై వేటు పడేలా స్పీకర్ పై ఒత్తిడి పెంచాలని పార్టీ నేతలకు సూచించారు పార్ఠీ ఫిరాయించిన ఎంపీల అనర్హత వేటుపై మొన్నటివరకూ పెద్దగా పట్టించుకోని జగన్...నంద్యాల ఎంపీపైనే ఫోకస్ పెట్టడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. నంద్యాల పార్లమెంట్ స్థానంలో వైసీపీకి పట్టుందని, ఒకవేళ ఉప  ఎన్నిక జరిగినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని, అందుకే జగన్ నంద్యాలను ఎంచుకున్నారని చెబుతున్నారు.

By
en-us Political News

  
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.