ఆ చంద్రబాబే కావాలి.. ఈ చంద్రబాబు వద్దు

Publish Date:Sep 15, 2015

Advertisement

 

హైదరాబాద్ ను మించిన రాజధాని నిర్మాణంకోసం, సింగపూర్ తరహా రాజధాని నిర్మాణం కోసం కట్టుబట్టలతో నడిరోడ్డుపై నిలబడిన ఆంధ్రుల పాలిట నవశకానికి నాంది పలికే నాయకుడిగా అవశేష ఆంధ్ర ప్రదేశ్ ను అట్టడుగు స్థానం నుండి అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లగలిగే స్థైర్యం ఉన్న నేతగా నమ్మి ఆంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించి పట్టం కట్టారు.

కాని నేడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు కావాలి కాని, నేటి చంద్రబాబు కాదు అని సినీ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ అందరిని ఆలోచింపజేస్తున్నాయి. ఇది కేవలం ఒక్క శివాజీ ఆరోపణ మాత్రమే కాదు. పార్టీని నమ్ముకుని, పార్టీని అంటిపెట్టుకొని, పార్టీకోసం నిరంతరం కృషి చేస్తున్న చాలా మంది సీనియర్ల నుండి కార్యకర్తల వరకు అదే భావన. చంద్రబాబు నాయుడు చుట్టూ ఒక కోటరీ ఉన్నదని.. ఆయన ఆ కోటరీ ఉచ్చులో బిగుసుకొని వాస్తవాలను గుర్తించడంలేదని చాలా మంది నేతల వేదన.

ఆయన చుట్టూ ఉన్న కోటరీని ఒకసారి గమనిస్తే క్షేత్రస్థాయి అవసరాలపై, సమస్యలపై అవగాహన లేని పరకాల ప్రభాకర్ లాంటి ప్రభుత్వ సలహాదారు, తిమ్మిని బమ్మిని చేసి చూపే ఐఏస్ ఆఫీసర్లు, బ్యూరో క్రాట్స్.  ప్రభుత్వ పథకాల పనితీరు, అమలు ఎలా ఉన్నా వీరికి అనవసరం. చంద్రబాబు నాయుడిని ఎంతగా తమ కల్లబొల్లి మాటల ద్వారా సంతృప్తి కరంగా ఉంచగలిగామన్నదే వారి ఆలోచన. దీనికి తోడు విమర్శలు గిట్టని చంద్రబాబు నైజం. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని బాబు వరకూ చేరకుండా అంతా బాగానే ఉందనే ఈ కోటరీ కితాబు. దీనితో ఆంధ్ర రాష్ట్రంలో బాబుగారి పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో అవినీతి గాడితప్పిన పాలన. బాబుగారి వ్యవహారం చూస్తేనే తన చుట్టూ ఉన్నా భజన పరుల కోటరీలో సదా కాలక్షేపం.

ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఎవరైనా సరే ఈ కోటరీని దాటి బాబుగారిని చేరే పరిస్థితి లేని కారణాన ఏం చేయాలో అర్ధంకాని దైన్యం పార్టీలో నెలకొంది. దీనికి తోడు లోకేశ్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఏ ఐఏస్ ఆఫీసర్ అయినా లోకేశ్ కన్నుసన్నల్లోనే పనిచేయాల్సి రావడంతో ఈ భజన బృందం లోకేశ్ ను కూడా అదే తరహాలో పొగడ్తలతో ముంచెత్తుతూ, తప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ పాలనను అపహాస్యం చేస్తున్నారు.

వీరికి తోడు వివిధ ప్రాజెక్టులను దక్కించుకునే యావలో కాంట్రక్టర్లు పార్టీలోని ఆర్ధిక బలంతో మధ్యలో వచ్చి పెత్తనం చేస్తున్న రాజకీయ అవగాహన, పరిపాలన అవగాహన లేని మరికొంతమంది నేతలతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట దిగజారుతోంది.

దీనికి ఉదాహరణగా రాజమండ్రిలో పుష్కరాల సంఘటన, ప్రత్యేక హోదాపై రోజుకోరకమైన ప్రభుత్వ వ్యాఖ్యానాలు, రైతు రుణమాఫీ అమలవుతున్నతీరు, నిరుద్యోగ భృతి అందని నిరుద్యోగులు, గుంటూరు నాగార్జున వ్యవహారం, రైతుల ఆత్మహత్యలు, అసెంబ్లీ నడుస్తున్న విధానం వెరసి నిజంగా ఇది చంద్రబాబు నాయుడి పాలనేనా అనే ప్రజలకు తీవ్రమైన సందేహం కలుగుతోంది.

తమ స్వలాభం కోసం, స్వార్థం కోసం వివిధ కన్సెల్టీలు, కాంట్రక్టర్లు, బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ సలహాదారుల కోటరీ నుండి చంద్రబాబు బయటపడి తన పాలనలో ప్రజలు, నేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టినిసారించక పోతే నష్టపోయేది పార్టీనే. నీతికి మారుపేరైనా పరిపాలన అందిచకుంటే, తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైన శైలి ఉందని విశ్లేషకులు సైతం విస్మయం చెందేలా అవినీతిలో కూరుకుపోయిన పాలనను ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు స్వయంగా పూనుకోకపోతే, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయం.

By
en-us Political News

  
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.