మళ్ళీ మూడు.. అసెంబ్లీలో బిల్లు ?

Publish Date:Sep 2, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకున్న మూడు రాజధానుల బిల్లును మళ్ళీ తెస్తుందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ మానస పుత్రికకు మళ్ళీ ప్రాణం పోయాలని అనుకుంటున్నారా? అంటే, అధికార వైసీపీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. గత సంవత్సరం (2021) నవంబర్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది.

ఇందుకు సమబందించి  దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా రాష్ట్ర  అడ్వకేట్ జనరల్, ఈ మేరకు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పాత బిల్లును ఉపసంహరించుకుంటూ తెచ్చిన కొత్త బిల్లును సభ ఆమోదం తెలిపింది. అయితే, అప్పుడే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ప్రభుత్వం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని, సాంకేతికంగా బిల్లును వెనక్కి తీసుకున్నా, మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అంతే కాదు, ఉపసంహరించుకున్న బిల్లు స్థానంలో మరింత పక్కా బిల్లును త్వరలోనే తీసుకొస్తామని ప్రకటించారు.

ఇదంతా చరిత్ర, అయితే ఇప్పడు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఈ నెల మూడవ వారంలో మొదలయ్యే, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో  మూడు రాజధానుల బిల్లును మళ్ళీ ప్రవేశ పెట్టె ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇంతవరకు అధికారికంగా అసెంబ్లీ సమావేశాల  తేదీలు ఖరారు కాలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఈ నెల మూడవ వారంలో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ నెల 7న జరిగే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీల పై తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అలాగే,ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలకమైన బిల్లులతో పాటుగా, మరోసారి మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. 

కాగా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని మొదటి సారిగా 2019 డిసెంబర్ 17న సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలును నిర్ణయించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మండలిలో ప్రవేశపెట్టారు. అక్కడ ఆమోదం పొందకపోవడంతో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏను రద్దు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీనిపై రాజధాని రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆందోళన  చేపట్టారు ఈ రోజుకు కూడా అమరావతి రైతుల ఆందోళన కొనసాగుతూనే వుంది. ఎండా వానలు, ప్రకృతి వైపరీత్యాలతో  పాటుగా కొవిడ్ మహమ్మారిని కూడా తట్టుకుని అమరావతి రైతులు, మహిళలు విభిన్న రూపాల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు.

న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరున అమరావతి రైతులు చారిత్రక పాదయాత్ర నిర్వహించారు. కాగా, సెప్టెంబర్ 12వ తేదీకి ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తిఅవుతున నేపధ్యంలో అదే రోజు నుంచి మరోసారి రైతులు, మహిళలు మరో మహా పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. ఈ సారి అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా సూర్యభగవానుడు కొలువైన అరసవల్లి వరకు అసెంబ్లీ నుంచి అరసవెల్లి వరకు పేరున మరో మహా పాదయత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 
మరో వంక  తెలుగు దేశం, బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలు అన్నీ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. అమరావతి రైతులకు మద్దతుగా ఆందోళనలో పాలుపంచుకున్నారు. అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మొండిగా ముందుకు పోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ నెల చివర్లో జరిగే  అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో  ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లు విషయంలో ఇటు ప్రజల్లో అతి పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠను రేపుతోంది.

By
en-us Political News

  
తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు.
భేటీ అనంతరం అంబటి రాంబాబు ముద్రగడపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన పట్టుదల, రాజకీయాలలో నిజాయితీ, విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తుతించారు. తమ మధ్య జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.
తెలుగువన్ వాస్తవ వేదిక సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.