చంద్రబాబు ఆరు నెలల పాలన ఎలా సాగిందంటే...

Publish Date:Dec 10, 2014

Advertisement

 

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టి ఆరు నెలలు పూర్తయ్యాయి. ఈ ఆరు నెలల పాలనలో ఆయన నేతృత్వంలో ప్రభుత్వం చాలా చురుకుగా అడుగులు వేసిందని చెప్పవచ్చును. అధికారం చేప్పట్టిన మూడు నెలలలోనే రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న విద్యుత్ సంక్షోభ సమస్యను పరిష్కరించగలిగారు. మున్ముందు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సోలార్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల స్థాపనకు, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి విద్యుత్ సరఫరాకు అవసరమయిన అనేక ఒప్పందాలు చేసుకొన్నారు. హీరో మోటార్స్, కృషబ్ కో వంటి భారీ పరిశ్రమలను, అనేక చిన్న మధ్య తరహా పరిశ్రమలను రాష్ట్రంలో పెట్టేందుకు ఒప్పించగలిగారు. అవన్నీ నిర్మాణాలు పూర్తి చేసుకొని కార్యకలాపాలు మొదలుపెడితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిలో గణనీయమయిన మార్పు కనబడుతుంది.

 

కానీ చంద్రబాబు నాయుడు అధికారం చేప్పట్టగానే మొట్ట మొదటగా ఐటీ సంస్థలే రాష్ట్రానికి పరుగులు పెడుతూ వస్తాయని అందరూ ఊహించినప్పటికీ ఇంతవరకు ఐటీ సంస్థలేవీ పెద్దగా రాష్ట్రానికి తరలిరాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అందువలన ప్రభుత్వం ప్రకటించిన ఐటీ విధానాన్ని ఒకసారి సమీక్షించుకోవడం మంచిదేమో? బంగారు బాతులవంటి ఐటీ సంస్థలను, పరిశ్రమలను రాష్ట్రానికి ఆకర్షించేందుకు, కేవలం ముఖ్యమంత్రే కాకుండా రాష్ట్రంలో మంత్రులు, యంపీలు, యం.యల్.ఏలు, రాష్ట్రానికి చెందిన ప్రముఖులు అందరూ కూడా పార్టీలకతీతంగా తమ తమ పరిధిలో కృషి చేస్తే బాగుంటుంది.

 

ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న రాజధాని నిర్మాణం విషయంలో ఎన్ని అవాంతరాలు ఎదురయినప్పటికీ, నిరాశ చెందకుండా చాలా చురుకుగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అని ప్రజలందరూ ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఎక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు చేప్పట్టబోతోందో చర్చించుకొంటున్నారు తప్ప రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి మాత్రం కాదు. అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో, చాలా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నందునేనని చెప్పవచ్చును.

 

చంద్రబాబు నాయుడు ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకి పెన్షన్ పెంచారు. అదేవిధంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ పంట రుణాల మాఫీ హామీని కూడా అమలు చేస్తున్నారు. తీవ్ర ఆర్ధిక సమస్యల మధ్య అధికారం చేప్పట్టిన చంద్రబాబు నాయుడు, కేంద్ర సహాయం కానీ, రిజర్వు బ్యాంక్ సహాయం గానీ అందకపోయినా, హూద్ హూద్ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయినప్పటికీ యధావిధిగా పెంచిన పెన్షన్లను అందజేస్తుండటం, ప్రభుత్వోద్యోగులకు ఈనెలకానెల టంచనుగా జీతాలు చెల్లిస్తుండటం, వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తుండటం గమనిస్తే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఊహించిన దానికంటే త్వరగానే మెరుగయినట్లు అర్ధమవుతోంది.

 

రాష్ట్ర విభజనకు ముందు, ఆ తరువాత పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు ఒకసారి బేరీజు వేసి చూసుకొంటే చాలా స్పష్టమయిన తేడా కనిపిస్తోంది. కేవలం ఆరు నెలల కాలంలోనే ఇంత సానుకూల మార్పు కనబడటానికి కారణం ప్రభుత్వ సమర్ధత దానిని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్య దక్షతలేనని చెప్పక తప్పదు. అయితే, సమస్యలను అధిగమించేందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించడంలో ప్రభుత్వం కొంత అశ్రద్ధ కనబరుస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వ పనితీరును ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు గనుక పెద్దగా ప్రచారం చేసుకోకపోయినా, ప్రభుత్వ సమర్ధత పట్ల పూర్తి నమ్మకంతోనే ఉన్నారు.

 

ప్రభుత్వం అంటే కేవలం ముఖ్యమంత్రి ఒక్కరే అన్నట్లు కాకుండా మిగిలిన మంత్రులు అందరూ కూడా తమ సమర్ధతను నిరూపించుకొనే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి మరింత ప్రజాధారణ దక్కేది. ఒకవేళ పొరుగు రాష్ట్రమయిన తెలంగాణా సహకారం, కేంద్ర సహకారం కూడా దక్కి ఉండి ఉంటే పరిస్థితి మరింకా ఏవిధంగా ఉండేదో?

 

ఇదివరకు కేంద్రం అధికారంలో ఉన్న యూపీఏ కూటమి రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి కూడా ఆ హామీలన్నిటినీ తూచా తప్పకుండా అమలు చేస్తానంది. కానీ ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయింది. రాష్ట్రానికి ఏమి చేసినా చేయకపోయినా కనీసం ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి కొంత సహాయ సహకారాలు అందిస్తే వాటి ద్వారా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడే చక్కబెట్టేయగల సమర్ధుడు.

 

ఆయన వచ్చే ఎన్నికలలో మళ్ళీ గెలవాలని తపిస్తున్నారు కనుక రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించి తన సత్తా ఏమిటో రాష్ట్ర ప్రజలకు నిరూపించి చూపేందుకు ఎంతయినా కష్టపడతారని నమ్మవచ్చును. ఆయనను ఆదర్శంగా తీసుకొని మిగిలిన మంత్రులు అందరూ కూడా చురుకుగా, గట్టిగా సమిష్టి కృషి చేసినట్లయితే అది వారికి, పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు రాష్ట్రానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.