Publish Date:Jan 30, 2019
ఏపీ రవాణా శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాల వారి కోడ్ సిరీస్ నెంబర్లకు రవాణాశాఖ స్వస్తి పలికింది. ఒకే రాష్ట్రం.. ఒకే సిరీస్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో ఏపీలో అన్ని వాహనాలకు నేటి నుంచి ఏపీ 39 సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ విధానాన్ని రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడలో ప్రారంభించారు. విజయవాడకు చెందిన ముప్పాళ్ల కల్పనకు AP 39 A002 నంబరును కేటాయించారు. ఆమెకు వెంటనే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను కూడా అందజేశారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ...గతంలో ట్రాన్సపోర్టు డిపార్టుమెంట్ అంటేనే లంచాలకు ప్రతిరూపంగా ఉండేదని, ఈ నాలుగున్నరేళ్ల వ్యవధిలో బెస్ట్ డిపార్ట్మెంట్ గా ఎదగటం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.
వన్ స్టేట్ వన్ కోడ్ విధానం ద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పారు. వేలు ముద్రతో పాటుగా ఐరిష్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ జరిగే విధంగా చూడాలన్నారు. థర్డ్ పార్టీ విధానం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రవాణా శాఖలో ఈ నూతన విధానం అమల్లోకి రానుండటంతో పక్క జిల్లాల్లో తాత్కాలిక చిరునామాలతో ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకుంటున్న వాహనదారులకు అడ్డుకట్ట పడింది. ఫలితంగా రాబోయే రోజుల్లో ఏదైనా వాహనానికి 9999 లాంటి ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకునే వాహన యజమాని ఇకపై అలాంటి నంబర్ల కోసం తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫాన్సీ నెంబర్ కావాలి అంటే ఈ – బిడ్డింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. డిమాండ్ బట్టి రేటు కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-39-registration-number-series-for-all-vehicles-in-andhra-pradesh-39-85605.html
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశమైంది.ఈ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కె. పార్థసారథి మీడియా సమావేశంలో సమావేశంలో వివరించారు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఈ దుర్ఘటనపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు డీకే క్షమాపణలు చెప్పారు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర అపశ్రుతి చోటు చేసుకుంది. ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ నిలవటంతో ఫ్యాన్స్ భారీగా స్టేడియం వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు.
ప్రతి ఒక్కరి దైనందిత జీవితoలో యోగ ఒక భాగం కావాలి అని, జిల్లా అంతటా యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతొందని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ తెలిపారు.
వేములవాడ దేవాలయంలో కోడెలు మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కోడెలను కాపాడడం ప్రభుత్వానికి చేతకాకపోతే బీఆర్ఎస్కి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి.మేం కాపాడుకుంటాం.. అంటూ హారీశ్రావు పేర్కొన్నారు
ఐపీఎల్-2025 ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తమ హోం సిటీ బెంగళూరులో అడుగుపెట్టింది. వేలాది మంది అభిమానులు నడుమ ఆర్సీబీ ఆటగాళ్లు బస్సులో ర్యాలీగా వచ్చి చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్నారు.బెంగుళూరు ఎయిర్ఫోర్ట్లో ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు.
వైసీపీలో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ పార్టీ కీలక నేతలంతా జగన్ అరెస్టు ఖాయమంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు అనివార్యమని అంతర్గత సంభాషణల్లోనే కాదు, మీడియా సమావేశాలలో కూడా చెప్పేస్తున్నారు. అదే జరిగితే పార్టీ సారథ్యం ఎవరిదన్న విషయంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనకు ముగింపు.. తెలుగుదేశం పాలనకు ఆరంభం జరిగి బుధవారం (జూన్ 4) నాటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింద. ఈ సందర్భంగా వెన్నుపోటు దినం అంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అలాగే కూటమి పార్టీలు ఏడాది పాలన సంబరాలకు సమాయత్తమయ్యాయి. ఈ రెండు కార్యక్రమాలలో ఒక కార్యక్రమం వెలవెల బోతే.. రెండోది కళకళలాడింది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం ప్రకటించారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్ కాళేశ్వరం కమిషన్ నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు
స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్.. సింపుల్గా స్వాట్. ప్రజాక్షేత్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. వీళ్లు రంగంలోకి దిగితే మొత్తం సీనే మారిపోతుంది.
హైదరాబాద్ పోలీసులు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే.. మహిళా పోలీసులతో ఓ కొత్త ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్.. ప్రధానంగా మహిళలు నిరసనలు, ఆందోళనలు చేసినప్పుడు వారిని సురక్షితంగా తరలించేందుకు తయారుచేస్తున్నారు.
గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం ర్యాలీలో ఈ గొడవ చోటుచేసుకుంది. పట్టాభిపురం సీఐ మధ్య తీవ్ర వాగ్వాదన్నికి దిగారు
క్రికెట్లో రికార్డుల కింగ్ విరాట్ కోహ్లీకి నెంబర్ 18 చాలా.. చాలా స్పెషల్. 18వ నెంబరుతో విరాట్కి ఉన్న అనుబంధం అపురూపమైంది. తాజాగా 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 18వ సీజన్లో ఆర్సీబీ ఐపీఎల్ కప్ను ముద్దాడింది.