అన్న క్యాంటీన్లకు స్పందన అద్భుతం.. సామాజిక విప్లవంగా మారిన వైనం

Publish Date:Apr 14, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునరుద్ధరించిన  అన్న క్యాంటీన్లకు అద్భుతమైన ప్రజా స్పందన లభిస్తున్నది.   రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ క్యాంటీన్లలో భోజనం చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.  పేద, మధ్యతరగతి ప్రజలకు కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన అన్న క్యాంటిన్ పథకం..  ఇప్పుడు  లక్షలాది మంది ఆకలి తీరుస్తూ ఒక సామాజిక విప్లవంగా మారింది. తాజా లెక్కల ప్రకారం, ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు  .8 కోట్ల మంది ప్రజలు ఈసేవలను వినియోగించుకున్నారు. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా   ప్రాంతాల్లో 207 అన్న క్యాంటీన్లు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. నిత్యం దాదాపు  2.10 లక్షల మందికి పైగా ప్రజలు ఈ క్యాంటీన్ల ద్వారా ఉపాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాన్ని స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా కూలీలు, చిరుద్యోగులు వివిధ పనుల నిమిత్తం నగరం, పట్టణాలకు వచ్చే  సామాన్యులకు ఇది ఒక వరప్రదాయినిగా మారింది. శుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరకే అందిస్తుండటంతో, భోజన సమయాల్లో ఈ కేంద్రాల వద్ద భారీగా క్యూలు కనిపిస్తున్నాయి.

ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం భారీగా నిధులను వెచ్చిస్తోంది. ప్రతిరోజూ అన్న క్యాంటీన్ల నిర్వహణ   54 లక్షల రూపాయల వ్యయం అవుతోంది. ఇందులో సింహభాగం ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుండగా, మరికొంత మొత్తాన్ని దాతల నుంచి సేకరిస్తున్నారు. ఈ పథకం పునఃప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటిన్లపై  243 కోట్ల రూపాయలను వ్యయం చేసింది.   లాభాపేక్ష లేకుండా సామాన్యుడి కడుపు నింపడమే ధ్యేయంగా చేపట్టిన ఈ కార్యక్రమం నిర్విఘ్ణంగా, అశేష ప్రజలకు అన్నదాతగా కొనసాగుతోంది.  

జగన్ హయాంలో ఈ క్యాంటీన్లు మూతపడటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం వీటిని తిరిగి ప్రారంభించడమే కాకుండా..  మరింత మెరుగైన సౌకర్యాలతో  నిర్వహిస్తున్నది. ఇస్కాన్ వంటి సంస్థల సహకారంతో ఆహారం తయారీలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నది.  ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందనను గమనించిన ప్రభుత్వం, రానున్న రోజుల్లో ఈ సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. 

అన్న క్యాంటీన్ల విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం త్వరలోనే గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రామాల్లోని నిరుపేదలకు కూడా 5 రూపాయలకే భోజనం అందించాలనేది ప్రభుత్వ సంకల్పం. గ్రామీణ ప్రాంతాల్లో క్యాంటీన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం అదనంగా 58 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో విజయవంతమైన ఈ మోడల్‌ను పల్లెల్లో కూడా అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో ఆకలి చావులు లేని సమాజాన్ని నిర్మించవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. 

ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకుని మరిన్ని  క్యాంటీన్ల ఏర్పాటుకు   కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వంటి రద్దీ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల సంఖ్యను పెంచాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించింది. అన్న క్యాంటీన్లు కేవలం ఆహార కేంద్రాలుగా మాత్రమే కాకుండా, ప్రభుత్వ సామాజిక బాధ్యతకు చిహ్నంగా నిలుస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి.   

By
en-us Political News

  
లోక్‌సభలో తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం భారీగా పెరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లో ఓ రిటైర్డ్ సైనికుడి ధైర్యసాహసం చైన్ స్నాచర్‌ను పోలీసులకు పట్టించింది.
హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన మైక్రో ఫైనాన్స్ మోసం కేసు కొత్త మలుపు తిరిగింది.
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు అయింది
దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మూడు కీలక బిల్లులు లోక్‌సభ ముందుకు రావడంతో ఉత్కంఠ పెరిగింది.
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణను వేసింది
ఒక పార్టీ త‌ర‌ఫున ఎంత మంది స‌భ్యులు మాట్లాడాల‌ని అనుకున్నా అవకాశం ఇస్తానన్న ఆయన ఒక‌వేళ ఒక పార్టీ త‌ర‌ఫున ఒక స‌భ్యుడే ప్రసంగిస్తానంటే.. ఆ స‌భ్యుడికి కావాల్సినంత స‌మ‌యం ఇస్తామ‌న్నారు చెప్పారు. బిల్లుల‌పై 22 గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం ఉంటుందని చెప్పారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల గొంతు నొక్కేస్తున్నారంటూ విపక్ష సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అధికార ప‌క్షం ఇలా స‌మ‌యం ఇవ్వ‌డం, సభ్యులందరూ మాట్లాడేందుకు అవకాశం ఇస్తాననడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మంత్రి లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లుపై తమిళనాడులో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ద్వేషాన్ని వెళ్లగక్కారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
జగన్ మనసంతా విధ్వంసం, నిలువెల్లా స్వార్థం నిండి ఉందని మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు
ఆ చోక్ పాయింట్లే ఇప్పుడు ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మార్గాల్లో తలెత్తే అతిచిన్న లోపం లేదా యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసే ప్రమాదం పొంచి ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.