వైసీపీ నేత పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు

Publish Date:Apr 16, 2026

Advertisement

 

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గత రెండు రోజులుగా ఉత్కంఠ రేపిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టు ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీహరికి కుప్పం కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 33 గంటల పాటు పోలీసుల అదుపులో ఉన్న ఆయనకు న్యాయస్థానం నుంచి ఊరట లభించింది.

బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పోలీసులు పూడి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిబంధనల ప్రకారం 24 గంటల లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉండగా, పోలీసులు ఆయనను సుదీర్ఘకాలం పాటు అజ్ఞాతంలో ఉంచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బుధవారం రోజంతా ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆందోళన చెందారు.

అరెస్టు చేసిన 33 గంటల తర్వాతే శ్రీహరికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు, ఆపై కుప్పం కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు కావాలనే ఆయనను ఇబ్బంది పెట్టేందుకు కాలయాపన చేశారని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వాదనలు విన్న న్యాయమూర్తి, శ్రీహరికి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో, కుప్పం నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

By
en-us Political News

  
హర్మూజ్ ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరోసారి పీక్స్ కు చేరింది. హ‌ర్మూజ్‌పై అమెరికా నౌకా దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
డీలిమిటేషన్ బిల్లులో ఉన్న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోని నియోజకవర్గాల పునర్విభజన చేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కట్టబెడుతూ డీ లిమిటేషన్ బిల్లులోని ప్రతిపాదనలపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేస్తూ, ఈ ప్రక్రియను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ అజింక్యా రహానే డకౌట్‌గా వెనుదిరిడాడు. అయితే, స్టార్ బ్యాటర్ కామెరూన్ గ్రీన్ 55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. కామెరూన్ గ్రీన్ కు రోవ్‌మన్ పావెల్, రమణ్‌దీప్ సింగ్ సహకారాన్ని అందించారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అత్యంత ఘాటుగా స్పందించారు.
డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ చమురు రవాణాలో ఈ మార్గం అత్యంత ప్రాధాన్యత కలిగినదని, దీని ద్వారానే ప్రపంచంలోని మూడో వంతు ముడి చమురు సరఫరా జరుగుతుందని తెలిసిందే. తాజాగా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల బార్గవ్ రెడ్డి, ఇతర నిందితులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు.
లైంగిక వేధింపులే కాకుండా, బలవంతపు మత మార్పిడిలు, గూమింగ్, అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్, టెర్రర్ ఫండింగ్ లాంటి తీవ్రమైన అంశాలు ఈ కేసులో ముడిపడి ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.
ఇది కేవలం బిల్లు ఓటమి కాదని, భారత ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయమని రాహుల్ గాంధీ అభివర్ణించారు
చైనా ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితులు సాధారణ మందగమనం కంటే ఎక్కువగా, ఒక లోతైన వ్యవస్థాత్మక సంక్షోభాన్ని సూచిస్తున్నాయి.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేత చర్యలు ఏడో రోజుకి చేరుకున్నాయి.
దేశ అత్యున్నత చట్టసభ అయిన లోక్‌సభలో శుక్రవారం అనూహ్యమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.