జైలు నుంచి ఆస్పత్రికి రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి

Publish Date:Jan 10, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అరెస్టై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను జైలు అధికారులు ఈ రోజు ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య సమస్యలతో వారు బాధపడుతుండటంతో జైలు నుంచి ఆస్పత్రికి తరలించినట్లు జైలు అధికారులు తెలిపారు. వీరిలో మద్యం కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కసిరెడ్డి  ఆర్థోపెడిక్ సమస్యలతో గత కొద్ది రోజులుగా బాధపడుతుండటంతో జైలు అధికారులు ఆయనను ఈ రోజు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇక ఈ కేసులో ఏ38గా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెరికోజ్ వెయిన్స్ సమస్యలతో బాధపడుతుండటంతో ఆయనను మంగళగిరి ఎయిమ్స్ కు తరలించారు. జగన్ హయాంలో ఏపీలో  జరిగిన 3,200 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో వీరిరువురూ అరెస్టైన సంగతి తెలసిందే. రాజ్ కసిరెడ్డిని గత ఏడాది  ఏప్రిల్ 21న హైదరాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచీ ఆయన విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 

ఇక మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని గత ఏడాది జూన్ 17 బెంగళూరు విమానాశ్రయంలో  సిట్ అరెస్టు చేసింది. అప్పటి నుంచీ చెవిరెడ్డి కూడా రిమాండ్ ఖైదీగా విజయవాడ సెంట్రల్ జైలులోనే ఉన్నారు. వీరిరువురూ పలుమార్ల దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయి. ఇప్పుడు తాజాగా ఇరువురూ  కూడా అనారోగ్య సమస్యలతో  బాధపడుతుండటంతో జైలు అధికారులు వారిని వేరువేరు ఆస్పత్రులకు తరలించారు.  

By
en-us Political News

  
రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AP FIRST) పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు సీఎం ఆమోదముద్ర వేశారు.
మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు
ఈ సంక్రాంతి సీజ‌న్లో కేవ‌లం రెండు రోజుల‌కే ఎన్ని వేల కోట్ల మేర కోళ్ల పందేలు జ‌రిగాయో చూస్తే ఆశ్చర్యపోతారు
ఒక్క పెగ్గు కోసం సొంత అన్ననే మేడ మీద నుంచి తోసేసి చంపేసిన తమ్ముడి ఉదంతం సంక్రాంతి పండుగ నాడు హైదరాబాద్ నాచారంలో చోటు చేసుకుంది.
142 ఏళ్లు జీవించిన సౌదీ అరేబియా కురువృద్ధుడు షేక్ నాసర్ బిన్ రద్దన్ అల్ వదాయి ఇకలేరు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్ ఇంకెంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
టీవ‌ల కాలంలో ఇరాన్ కరెన్సీ విలువ భారీగా పతనం అయ్యింది. దీంతో అక్కడ ఆహార ప‌దార్థాలు స‌హా అన్నిటి ధరలూ మింటికెగశాయి. దీనికి తోడు అమెరికా నుంచి యుద్ధ భ‌యం కూడా ఉండటంతో ఇరాన్ ఇత‌ర దేశాల‌కు చెందిన వారిని ప‌నుల్లో నియ‌మించ‌రాద‌ని ఆంక్షలు విధించింది. దీనికి నిరసనగా ఇరాన్ లో ఆందోళనలను మిన్నంటాయి.
జగ్గన తోట తీర్థాన్ని జగ్గన్న తోట ప్రభల తీర్థంగా కూడా అంటారు. పచ్చని పంటపొలాల మధ్య జరిగే తిరునాళ్ళ బంధానికి శతాబ్దాల చరిత్ర ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది.
ఎన్‌ఐఏ కొత్త డైరెక్టర్ జనరల్‌ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దళపతి విజయ్ కు ఈ సంక్రాంతి చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు.
భీమవరం, అమలాపురం లాంటి ప్రాంతాల్లో ఆడే కోడి పందేలు కడపజిల్లా లోను కోత లేస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.