పరిశ్రమలు రావాలంటే రవాణా వ్యవస్థ మెరుగు పడాలి

Publish Date:Jan 29, 2015

Advertisement

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు, రైల్ మరియు జల రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మరియు పోర్టుల అభివృద్ధిపై దృష్టి పెడుతుంటే, కేంద్రం అంతర్గత జలరవాణ మరియు రైల్ రవాణా వ్యవస్థల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలు, పెట్టుబడులు అవసరమయితే వాటి అభివృద్ధికి చక్కటి రవాణా వ్యవస్థలు కూడా అంతే అవసరం. మంచి రవాణా వ్యవస్థ ఉన్నచోటికే పరిశ్రమలు కూడా తరలివచ్చేందుకు ఆసక్తి చూపుతాయి.

 

అయితే ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు కూడా పరిశ్రమల కోసం ప్రత్యేక పాలసీలు ప్రకటించాయే తప్ప రవాణా వ్యవస్థ కోసం నిర్దిష్టమయిన పాలసీలు ఏవీ ఏర్పాటు చేసుకోలేదు. ఆ కారణంగానే నేటికీ దేశంలో ఎక్కడా సరయిన రవాణా వ్యవస్థ లేకుండా పోయింది. భారతదేశంలో కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు నిత్యం లక్షలాది లారీలు, ట్రక్కులు, కంటెయినర్లలో భారీగా సరుకు రవాణా జరుగుతోంటుంది. కానీ దేశంలో ఎక్కడా సరయిన రోడ్లు ఉండవు. ఇన్ని దశాభ్దాలుగా ఆ గతుకుల రోడ్లపైనే వాహనాలనీ ప్రయాణిస్తూ సరుకు రవాణా చేస్తున్నాయి.

 

ఇక రోడ్డు రవాణా తరువాత దేశంలో విరివిగా వాడకంలో ఉన్నది రైల్ రవాణా వ్యవస్థ. దాని ద్వారా సరుకు రవాణా చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు అశ్రద్ధ కారణంగా నేటికీ అది కొన్ని పరిమితులకు లోబడే రవాణా చేస్తోంది. దేశంలో ఒక చోట నుండి మరొకచోటికి అత్యంత తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో అతి సురక్షితంగా సరుకు రవాణా చేయగల ఈ వ్యవస్థని మరింత అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది.

 

భారతీయ రైల్వేలో ప్రత్యేకంగా కార్గో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. కానీ కొత్తగా రైల్వే ట్రాకులు వేయనంత వరకు మిగిలిన వ్యవస్థలను ఎంత కట్టుదిట్టం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండబోదు. కనుకనే రైల్వేలలో కూడా విదేశీపెట్టుబడులను కేంద్రప్రభుత్వం అనుమతిస్తోంది. దాదాపు 125కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో రైల్ (సరుకు) రవాణా కోసం ప్రత్యేకంగా రైల్వే ట్రాకులు ఏర్పాటు చేసేందుకు దేశ, విదేశీ సంస్థలు ముందుకు వచ్చినట్లయితే అందుకు తగిన ప్రతిపలం వారు తప్పకుండా పొందే అవకాశం ఉంటుంది.

 

ఇక దేశంలో అంతర్గత జల రవాణా వ్యవస్థ నామ మాత్రంగా కనబడుతుంది. ఏవో కొన్ని రాష్ట్రాలు, జిల్లాలో మాత్రమే కనబడుతుంది. ఈ మూడు రవాణా వ్యవస్థలకు కలిపి లేదా విడివిడిగా ప్రత్యేకమయిన పాలసీలు, వాటి అభివృద్ధికి కృషి చేసే ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసుకొన్నట్లయితే వాటి పరిస్థితి మెరుగుపడుతుంది.

 

ఆంద్రప్రదేశ్ విషయం తీసుకొన్నట్లయితే రోడ్డు రవాణా వ్యవస్థ కొంచెం మెరుగుగానే కనిపిస్తున్నపటికీ, వాటిని మరింత మెరుగుపరిచి వాటిని సమీప పోర్టులతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సరుకు రవాణా కోసమే ప్రత్యేకంగా రోడ్లు నిర్మించే ఆలోచనలు కూడా చేస్తోంది. కానీ అది చాలా భారీ వ్యయంతో కూడుకొన్నది. కానీ రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న జనాభా మరియు వాహనాల కారణంగా రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కనుక అంచెలంచెలుగా అయినా సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా రోడ్లు నిర్మించగలిగితే అది తప్పకుండా చాలా మంచి ఫలితాలే ఇస్తుంది. సరుకు రవాణా వాహనాలకు అవసరమయిన అన్ని రకాల అనుమతులు అవి బయలుదేరిన చోటే ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినట్లయితే దానివలన తమకు చాలా సమయం కలిసి వస్తుందని ఒక ప్రముఖ రవాణా వ్యవస్థ యజమాని సత్య బోలిశెట్టి అన్నారు. ఈ రంగాన్ని కూడా శాస్త్రీయంగా అధ్యయనం చేసి అభివృద్ధి చేసినట్లయితే దీనిలో కూడా యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అయితే అన్నిటికంటే ముందు వీటి కోసం ప్రత్యేకంగా యంత్రాంగం ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది.

 

కేంద్రప్రభుత్వం కాకినాడ నుండి చెన్నై వరకు ఇదివరకున్న అంతర్గత జలరవాణ వ్యవస్థను మళ్ళీ ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు, కొందరు ఉన్నతాధికారులను నియమించింది. విజయవాడలో ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసింది. వారు ప్రస్తుతం మిగిలి ఉన్న జల రవాణా వ్యవస్థను అధ్యయనం చేస్తున్నారు. అది పూర్తయితే వారి సూచనలు, ప్రతిపాదనల మేరకు ఆ వ్యవస్థను చక్కదిద్దే పనులు మొదలవుతాయి.

 

ఇక రాష్ట్రంలో కొత్తగా మరో పది పోర్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అవి ఏర్పాటు చేయగలిగినట్లయితే, దేశ విదేశాలకు భారీగా సరుకు ఎగుమతులు, దిగుమతులు చేసుకొనే అవకాశం కలుగుతుంది. కానీ ఇది కూడా చాలా ఖర్చుతో కూడుకొన్న వ్యవహారమే కనుక వీటి అభివృద్ధికి కేంద్ర సహకారం చాలా అవసరం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.