కమ్యూనిష్ఠూరాలు మానుకోవాలి

Publish Date:Jan 30, 2015

Advertisement

 

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాను భారత్ పర్యటనకు ఆహ్వానించడం ద్వారా భారత్ అమెరికాకు సలాం కొట్టేందుకు సిద్దంగా ఉందని ప్రపంచ దేశాలకు భారత్ సందేశం ఇచ్చినట్లయిందని సీపీఐ (యం) నేత సీతారామ్ ఏచూరి అన్నారు. భారత్ చిరకాలంగా అనుసరిస్తూ వచ్చిన విదేశీవిదానాన్ని మోడీ ప్రభుత్వం పక్కనబెట్టి అగ్రరాజ్యంకి వంతపాడటం మంచిది కాదని హెచ్చరించారు. ఇరురుగుపొరుగు దేశాలతో సత్సంభందాలు, అన్ని దేశాలకు సమాన దూరం పాటించాలనే విదేశీ విధానమే భారత్ కి బాగా నప్పుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి చాలా నిష్టగా పాటిస్తున్న మన విదేశీవిధానం వలన భారత్ కి ఏమయినా మేలు జరిగిందా? అని ప్రశ్నించుకొంటే లేదనే సమాధానం వస్తుంది. కాశ్మీరులో కొంత భూభాగాన్ని పాకిస్తాన్ దురాక్రమణ చేస్తే భారత్ దానిని కాపాడుకొనే ప్రయత్నం చేయకుండా ఐక్య రాజ్యసమితికి వెళ్లి మొరపెట్టుకొంది. ఆకారణంగానే నేటికీ ఆ భూభాగం పాకిస్తాన్ ఆధీనంలోనే ఉండిపోయింది. అంతేకాదు అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఆ భూభాగం ద్వారా రోడ్లు, రైలు మార్గాలు వేసుకొనేందుకు చైనాకు ధారాదత్తం చేస్తోంది కూడా. అంతేకాదు మొగుడిని కొట్టి బజారు కెక్కినట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై భారత్ నే దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. గత మూడు దశాబ్దాలుగా చైనా, పాకిస్తాన్ దేశాలు భారత్ కి పక్కలు బల్లెంలా తయారయ్యాయి అంటే అందుకు మన బలహీనమయిన విదేశీ విధానాలే కారణమని చెప్పకతప్పదు.

భారత్ ఏనాడూ కూడా తనంతట తానుగా  ఇరుగుపొరుగు దేశాల మీద యుద్దానికి బయలుదేరలేదు. కానీ పాకిస్తాన్ గత ముప్పై ఏళ్ళుగా భారత్ మీద పరోక్ష యుద్ధం చేస్తూనే ఉంది. చైనా దేశం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తన భూభాగమేనని దైర్యంగా చూపుకొంటోంది. అంతే కాదు అనేకసార్లు భారత భూభాగంలో చొరబడి అది మాదేనని దైర్యంగా వాదించగలిగింది. అయినా భారత్ వారిని ఏమీ చేయలేక నిస్సహాయంగా శాంతి మంత్రం జపిస్తూనే ఉండిపోవడానికి కారణం లోపభూయిష్టమయిన మన విదేశీ విధానాలే. వాటి వలన భారత్ అంటే ప్రపంచ దేశాలకు ఒకరకమయిన చిన్న చూపు ఏర్పడింది. భారత్ చాలా బలహీనమయిన దేశమని, దైర్యంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదనే అభిప్రాయం ఏర్పడింది. అందుకే అతి చిన్న దేశమయిన శ్రీ లంక సైతం తనకు కష్టకాలంలో సహాయం చేసిన భారత్ ని కాదని దురాక్రమణదారుగా పేరుమోసిన  చైనాకు దగ్గరవుతోంది. భారతజాలర్లను జైల్లో వేస్తూ, భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చైనాకు చెందిన అణుబాంబులు ప్రయోగించే సామర్ధ్యం ఉన్న రెండు సబ్-మెరయిన్లను తన పోర్టులో నిలిపిఉంచుకొనేందుకు అనుమతించింది. శ్రీలంక యల్.టీ.టీ.ఈ ఉగ్రవాదులతో నానా ఇబ్బందులు పడుతునప్పుడు, దానికి సహాయపడేందుకు భారత్ తన సేనలను పంపించింది. ఆ కారణంగానే భారత్ తన ప్రధాని రాజీవ్ గాంధీని కోల్పోయింది.

ఇటువంటి లోపభూయిష్టమయిన విదేశీ విధానాలను నిఖచ్చిగా అమలు చేయాలని సీతారామ్ ఏచూరి వంటి రాజకీయ మేధావి కోరితే అంత కంటే పొరపాటు మరొకటి ఉండబోదు. ఆయన వామపక్ష పార్టీలకు చెందిన వారు కనుక పెట్టుబడిదారు దేశమయిన అమెరికాను దానితో స్నేహాన్ని వ్యతిరేకించడం సహజమే. కానీ ఆయన చైనా దేశం మన దేశం పట్ల వ్యవహరిస్తున్న తీరును కూడా ఇంతే గట్టిగా ఖండించి ఉంటే, ఆయన మాటలకు విలువ ఉండేది. నిజమే! అమెరికాతో స్నేహం లేదా యుద్ధం చేసిన ఏ దేశమయినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. కానీ అలాగని మన చిరకాల మిత్ర దేశమయిన రష్యాకు కూడా మనం దూరం అయ్యి చాలా కాలమే అయ్యింది. మనకు సరయిన విదేశీ విధానం లేకపోవడం, నిర్దిష్టమయిన అభిప్రాయాలు, అవసరమయినప్పుడు బలమయిన, కటినమయిన  నిర్ణయాలు తీసుకొనే తెగువ లేకపోవడం చేతనే చిన్నచిన్నదేశాలకి సైతం మనం చులకనయిపోయాము. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటివరకు ఇన్ని అనర్ధాలు జరుగుతున్నా, లోపభూయిష్టమయిన విదేశీ విధానానికే గుడ్డిగా అనుసరితున్నాము. కానీ నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన వెంటనే ప్రపంచ దేశాలకు భారత్ సత్తా చాటే విధంగా సరికొత్త విదేశీ విధానాలను అవలంభిస్తుంటే దానిని మెచ్చుకోకపోగా కొందరు విమర్శించడం చాలా విచారకరం. ఆయన అధికారం చేప్పట్టిన వెంటనే అమెరికా వెళ్ళలేదు. మనకి చిరకాలంగా మిత్రదేశాలుగా ఉన్న భూటాన్, నేపాల్, జపాన్ దేశాలకు వెళ్ళారు. ఒకప్పుడు తనకు వీసా నిరాకరించిన అమెరికా చేతనే ఆహ్వానింపజేసుకొన్న తరువాతనే ఆయన అమెరికాలో కాలు పెట్టారు. భారతదేశాన్ని వేగంగా అభివృద్ధి పదంలో పరుగులు తీయించాలంటే అగ్రరాజ్యమయిన అమెరికా సహాయసహకారాలు కూడా చాలా అవసరమని గ్రహించినందునే, ఆయన అమెరికా అధ్యక్షుడిని భారత్ కి ఆహ్వానించారు. ఒబామా కూడా పాత పద్దతులు, సంప్రదాయాలు పక్కనబెట్టి, తను భారత్ రాబోతున్నట్లు తక్షణమే ప్రకటించేరు. మోడీ అనుసరిస్తున్న నూతన విదేశీ విధానం వలన, అది ప్రపంచ దేశాలకు ఇస్తున్న బలమయిన సంకేతాల కారణంగానేఇది సాధ్యమయిందని చెప్పవచ్చును.

అమెరికా అధ్యక్షుడు భారత్ పర్యటన వలన భారత్ కి అనేక ప్రయోజనాలు చేకూరాయి. ఒకవేళ మోడీ అనుసరిస్తున్న ఈ విదేశీ విధానాలలో ఏమయినా లోపాలు ఉన్నట్లయితే, వాటిని ఆయనకు దృష్టికి తీసుకువచ్చి అప్రమత్తం చేయవలసిన బాధ్యత ప్రతిపక్షల మీదే ఉంది. కానీ గుడ్డిగా విమర్శించడం మాత్రం మంచిది కాదు. భారత ప్రధానిగా ఆయన దేశ భవిష్యత్తుకి ఏది మంచిదో అదే చేయాలనుకొంటారు తప్ప ఎవరినో ప్రసన్నం చేసుకొనేందుకు భారత్ ప్రయోజనాలను నష్టపరుచుకోవాలనుకోరు అనే సంగతిని సీతారామ్ ఏచూరి వంటివారు కూడా గుర్తుంచుకోవాలి.               

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.