ఖర్గే వర్సెస్ థరూర్ అధ్యక్ష పీఠం ఎవరిదో?

Publish Date:Oct 16, 2022

Advertisement

ఇంచు మించుగా రెండున్నర మూడేళ్ళుగా ఇదిగో అదిగో అంటూ వాయిదా పడుతూ వచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల  ముహూర్తం రానే వచ్చింది. సోమవారం ( అక్టోబర్ 17) కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నుకునేందుగా దేశ వ్యాప్తంగా ఒకేసారి పోలింగ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది వేల మందికి పైగా ఉన్న పీసీసీ ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజ్య సభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే, మరో సీనియర్ నేత లోక్ సభ ఎంపీ, శశి థరూర్’  పోటీ పడుతున్న విషయం తెలిసిందే. 

భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర చాలా గొప్పది, ఎప్పుడో 137 ఏళ్ల నాడు, 1885 డిసెంబరు 25న మాజీ బ్రిటిషు అధికారి ఏ. ఓ. హుమే కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. దేశ స్వాతంత్ర పోరాటం తుదిఘట్టంలో మహాత్మా గాంధీ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్ర పోరాటానికి సారధ్యం వహించిన కాంగ్రెస్ పార్ట అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం మాత్రం,ఇది ఆరవసారి. అయితే  అదంతా చరిత్ర. అలాగే, ఆ కాంగ్రేస్ ఈ కాంగ్రెస్ ఒకటేనా, అంటే అది మళ్ళీ వేరే చర్చ అవుతుంది. 1969 చీలికకు ముందున్న భారత జాతీయ కాంగ్రెస్’ ప్రస్తుత కాంగ్రెస్’, ఒకటి కాదనే వాదన ఒకటుంది.  

ఆ అంశాన్ని అలా పక్కన పెట్టి, ప్రస్తుతంలోకి వస్తే, అంతటి ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎన్నిక జరుగుతోంది. ఈ 24 ఏళ్లలో ఇంచు మించుగా 22 ఏళ్లకు పైగా సోనియా గాంధీనే అధ్యక్ష పదవిలో కొనసాగారు. మధ్యలో కొద్ది కాలం రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా, 2019 సార్వత్రిక ఎన్నికల ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ, ఆయన రాజీనామా చేయడంతో మళ్ళీ సోనియా గాంధీనే, తాత్కాలిక ప్రాతిపదికన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇదొక రికార్డ్. నెహ్రూ, ఇందిరా గాంధీ సహా ఎవరూ కూడా రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కాలం కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో లేరు. 

అదలా ఉంటే, గాంధీ కుటుంబం సభ్యులు (సోనియా, రాహుల్, ప్రియాంక) అధ్యక్ష పదవి వద్దనుకోవడంతో ఎన్నిక అనివార్యమైంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, అధ్యక్ష పదవి ముట్టేది లేదని భీష్మించుకు కూర్చోవడం వలన ఎన్నిక అనివార్యమైంది. కాగా, ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత జరిగిన అనేక నాటకీయ పరిణామాల నేపధ్యంగా గాంధీ కుటుంబ బయటి వ్యక్తులు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్’ పోటీలో నిలిచారు. గాంధీ కుటుంబం తటస్థ వైఖరిని ప్రకటించినా, తెర వెనక తతంగం మరోలా  ఉందని, శశి థరూర్’ ఆరోపించారు. గాంధీల దృష్టిలో ఇద్దరు సమానమే కానీ , ఖర్గే కాసింత చాలా ఎక్కువ సమానం’ అనే ఆరోపణలు/విశ్లేషణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.ఈ నేపధ్యంలో ఖర్గే ఎన్నిక లాంచానమే అంటున్నారు. 

నిజానికి ఖర్గే గాంధీలకు విధేయుడు అనడంలో ఎవరికీ సందేహం లేదు. అయినా  ఖర్గే, పోలింగ్;కు గంటల ముందు కూడా తమ విధేయతను మరోమారు చాటుకున్నారు. రిమోట్ కంట్రోల్ అన్నా,ఇంకొకటన్న తాను పట్టించుకోనని అవమానంగా భావించనని  స్పష్టం చేశారు. అలాగే, కాంగ్రెస్ అధ్యక్షునిగా గాంధీల సూచనలు సలహాలు తీసుకునేందుకు ఏమాత్రం సిగ్గు పడనని స్పష్టం చేశారు. ఒకటి రెండు ఎన్నికలలో ఓడి పోయినంత మాత్రాన గాంధీలను తప్పు పట్టడం సరికాదని, గాంధీలు దేశానికి, పార్టీకి చేసిన మేలును మరిచిపోలేమని అన్నారు.

మరో వంక శశి థరూర్’  కాంగ్రెస్ సిద్ధాంతాలకు సంబంధించి తనకు ఎలాంటి ఫిర్యాదు లేదని, అయితే పార్టీ పని విధానంలో మార్పు రావాలని, అన్నారు. ఖర్గే గెలిస్తే ఆయనతో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆయన యంగ్ టర్క్’ వాయిస్ వినిపించారు. మార్పు కోరుకునే యువకులంతా తన పక్షాన ఉంటే,యథాతథ స్థితిని కోరుకునే వృద్ధులు ఖర్గే పక్షాన ఉన్నారని చెప్పు కొచ్చారు. అయితే ఎవరు ఎవరి పక్షాన ఉన్నారు, ఎవరు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి పార్టీ పగ్గాలు అందుకుంటారు అనేది, అక్టోబర్ 19 న తేలి పోతుంది.

By
en-us Political News

  
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.