తగ్గిపోతున్న జనాభా... చైనాపై తీవ్ర ప్రభావం

Publish Date:Jun 12, 2026

Advertisement

 

అమెరికాతో పోటీ పడుతూ ప్రపంచలో శక్తివంతమైన దేశగా ఎదగాలనుకుంటున్న చైనాకు జనాభానే ప్రతిబంధంగా మారింది. చైనాలో జనాభా తగ్గుదలతో  దేశాభివృద్ధి పడిపోనుందని అమెరికన్ ఇన్వెస్టర్, మార్టిన్ క్యాపిటల్ సంస్థ వ్యవస్థాపకుడు రాడ్ డీ మార్టిన్ తాజాగా తెలిపారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే చైనా జనాభా మళ్లీ పెరగడం అసాధ్యమని స్పష్టం చేశారు. జనాభా మళ్లీ పెరిగేందుకు సరిపడా చైనాలో మహిళల సంఖ్య లేదని అన్నారు. కాలం గడిచే కొద్దీ చైనాలో వినియోగదారులు తగ్గిపోయి, మార్కెట్ పడిపోతోందన్నారు. ఐరోపా, జపాన్‌లో మాత్రం జనాభా తగ్గుదల అనేది ఒక్కసారిగా కాకుండా క్రమంగా జరుగుతోందని చెప్పారు. 

మహిళల సంఖ్య తగ్గిపోయిన కారణంగా చైనాలో తీవ్ర స్థాయి మార్పులు కనిపిస్తున్నాయని చెప్పారు.1980-2016 మధ్య చైనా అనుసరించిన ‘ఏక సంతాన విధానం’ వల్ల జనాభాలో స్త్రీపురుష నిష్ఫత్తి భారీ స్థాయిలో ప్రభావితమైందని నిపుణులు చెబుతున్నారు. ఏక సంతాన విధానానికి తోడు అబ్బాయిలే కావాలన్న తల్లిదండ్రుల భావన, ఆడపిల్లలు పుట్టకుండా అబార్షన్లు వంటివన్నీ ప్రస్తుత పరిస్థితికి దారితీశాయని చెబుతున్నారు. మునుపటి తరంలో మొదలైన అసమానతలన్నీ తదుపరి తరంలో మరింత తీవ్రంరూపం దాల్చే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. 2100 నాటికల్లా చైనా జనాభా సగానికి (633 మిలియన్లు) పడిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
 

By
en-us Political News

  
పవిత్ర మొహర్రం మాసంలో అషూరా సందర్భంగా షియా ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే చారిత్రాత్మక బీబీ-కా-ఆలం మాతం ఊరేగింపు
తెలంగాణ ఈగల్ ఫోర్స్, హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ పేరు ఓటర్ల జాబితా గల్లంతైంది.
ఢిల్లీ పర్యటనలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
నేటి ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగుల పనితీరును అంచనా వేయడానికి రకరకాల పద్ధతులను వాడుతుంటారు
దేశాన్ని కుదిపేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో మాట్లాడుతూ నిరంతరం వార్తల్లో నిలిచే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత చామకూర మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని, ప్రజలు మరోసారి తమ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
బెంగళూరు నగరంలో మానవత్వాన్ని మంటగలిపే ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్ల అరాచక, చీకటి పాలనకు తెరదించుతూ 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన అఖండ విజయం
ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారు కేవలం ఓట్లు వేయడమే కాకుండా, దేశ చరిత్రను తిరగరాయగల శక్తిమంతులని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి శ్రీధర్ నాయక్ (39) ఆత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనం రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.