పవిత్ర బంధానికి తూట్లు.. ప్రియుడి మోజులో భర్తను కడతేర్చిన భార్య!

Publish Date:Dec 22, 2025

Advertisement

 

ఏడు అడుగులు వేసి, జీవితాంతం తోడుంటానని బాస చేసిన భార్యే కాలయముడిగా మారింది. పరాయి వ్యక్తి మోజులో పడి, కట్టుకున్న వాడినే కడతేర్చింది. సహజ మరణంగా చిత్రీకరించేందుకు "గుండెపోటు" నాటక మాడినా.. పోలీసుల విచారణలో అసలు నిజం బట్టబయలైంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే ‌...

అశోక్,పూర్ణిమ దంపతులు... వీరికి పిల్లలున్నారు. బోడుప్పల్, ఈస్ట్ బృందావన్ కాలనీలో నివాసముంటు న్నారు. వి.జె. అశోక్ (45) శ్రీనిధి యూనివర్సిటీలో లాజిస్టిక్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య జె. పూర్ణిమ (36) ప్లే స్కూల్ నడుపుతోంది. పైకి అన్యోన్యంగా కనిపిస్తున్న వీరి కాపురంలో 'అక్రమ సంబంధం' చిచ్చు రేపింది. అదే కాలనీలో నివాసం ఉంటున్న భవన నిర్మాణ కార్మికుడు పాలేటి మహేష్ (22)తో పూర్ణిమకు పరిచయం ఏర్పడి, అది వివాేహేతర సంబంధానికి దారితీసింది.భార్య తీరుపై అనుమానం వచ్చిన అశోక్, ఆమెను పలుమార్లు మందలించారు. తన ఆనందానికి భర్త అడ్డువస్తున్నాడని భావించిన పూర్ణిమ.. ప్రియుడు మహేష్‌తో కలిసి భర్తను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.

ఆ రాత్రి జరిగింది ఇదే..

డిసెంబర్ 11, 2025 సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చిన అశోక్‌పై, పథకం ప్రకారం మాటు వేశారు. మహేష్ తన స్నేహితుడు సాయి కుమార్ (22) సహాయం తీసుకున్నాడు. అశోక్ ఇంట్లోకి రాగానే మహేష్, సాయి ఆయనను పట్టుకోగా.. కట్టుకున్న భార్య పూర్ణిమ భర్త కాళ్లను గట్టిగా పట్టుకుంది. అనంతరం మహేష్ మూడు చున్నీలతో అశోక్ మెడకు ఉరి బిగించి దారుణంగా హత్య చేశాడు.

అనుమానం రాకుండా హైడ్రామా..

హత్య అనంతరం నిందితులు అశోక్ బట్టలు మార్చి, రక్తపు మరకలున్న దుస్తులను, సాక్ష్యాలను మాయం చేశారు. డిసెంబర్ 12న పూర్ణిమ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తన భర్త బాత్‌రూమ్‌లో పడిపోయాడని, ఆసుపత్రికి తీసుకెళ్తే మృతి చెందాడని, గుండెపోటు వచ్చి ఉంటుందని నమ్మించే ప్రయత్నం చేసింది.

పోలీసుల చాకచక్యం..

మొదట సాధారణ మరణంగా కేసు నమోదు చేసినా, దర్యాప్తులో పోలీసులకు అనుమానాలు రేకెత్తాయి. అశోక్ మృతదేహంపై బుగ్గలు, మెడ భాగంలో గాయాలు ఉండటాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ పుటేజీలు, టెక్నికల్ ఆధారాలను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. అశోక్ దిన దిశ కర్మ అయి పోయిన వరకు కూడా పూర్ణిమ చాలా చాకచక్యంగా వ్యవహరించింది ..అంతేకాదు పది రోజులపాటు తన భర్త లేడు అనే విషయాన్ని జీర్ణించుకో లేకుండా పోయింది.. ఒకవైపు భర్త లేడని నాటకం ఆడుతూనే మరోవైపు తన ప్రియుడితో నిత్యం చాటింగ్ చేస్తూ ఇక్కడ జరుగుతున్న విషయాలను ఎప్పటి కప్పుడు చేరవేసింది.. 

తన భర్త తనను తన పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయాడని నిత్యం రోదించింది ..కానీ ఇదంతా నాటకం అని పోలీసుల విచారణలో బయటపడింది.. దశ దిన కర్మ పూర్తి అయిన వెంటనే పోలీసులు  విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిచి విచారించారు.. తనదైన స్టైల్ లో ఏమీ తెలియనట్టు బుకాయించే ప్రయత్నం చేసింది ..కానీ పోలీసులు తమదైన స్టైల్ లో విచారించడంతో చివరికి నిజాన్ని బయటకు వెళ్ళ గక్కింది..

తన ప్రియుడుతో కలిసి తాను ఈ హత్య చేశానని పేర్కొంది ..ఈ వరకు ప్రియుడు అయిన మహేష్ తో పాటు పూర్ణిమనీ పోలీస్ లు అరెస్టు చేశారు.. క్షణికావేశం, అక్రమ సంబంధాల మోజులో పచ్చని కాపురాన్ని కూల్చుకుని, కటకటాల పాలైన పూర్ణిమ ఉదంతం స్థానికులను విస్మయానికి గురిచేసింది.అనుమానాస్పద మృతిగా నమోదైన కేసును ఛేదించి సంచలన హత్యకేసును వెలికితీసిన మేడిపల్లి పోలీసుల పనితీరుపై ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు
 

By
en-us Political News

  
విశాఖపట్నం స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ జరగదని మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు.
తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌లు బదిలీలు అయ్యారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న ఆహార కల్తీపై కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు దిల్‍సుఖ్‍నగర్‌లో రోడ్డెక్కారు.
హైదరాబాద్ నగరంలోని సిలికాన్ సిటీగా పేరొందిన గచ్చిబౌలి ప్రాంతం మరోసారి మత్తు మాయాజాలానికి వేదికగా మారింది.
రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి.. కడప ఎమ్మెల్యే గా గెలిచిన రోజు నుంచి జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుఉన్నారు
నికోలస్ మదురో పాలనలో ఆ దేశానికి చెందిన విలువైన బంగారు నిల్వలు భారీ ఎత్తున విదేశాలకు తరలిపోయినట్లు తాజా కస్టమ్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఎన్నికల వేళ మైనారిటీల రక్షణ బాధ్యతను బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ సర్కార్ గాలికొదిలేసిందా?
హైదరాబాద్‌లో బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న మాఫియా వ్యవహారం వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేపుతుంది.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది.
అసభ్యకరమైన కంటెంట్‌ను సృష్టించి ప్రచారం చేస్తున్న యూట్యూబర్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
ప్రియురాలి మరణాన్ని తట్టు కోలేక యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్‌ను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.