యుద్ధం వస్తుందా .. వస్తే ఏమవుతుంది?

Publish Date:Apr 25, 2025

Advertisement

సర్వత్రా ఇదే ఉత్కంఠ!

పహల్గాం ఉగ్రదాడి జరిగిన మూడు రోజుల తరువాత  ప్రధానమంత్రి (గురువారం (ఏప్రిల్ 24)  తొలిసారిగా స్పందించారు. ఉగ్రదాడి నేపధ్యంలో విదేశీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని బుధవారమే(ఏప్రిల్23) స్వదేశానికి చేరుకున్న ప్రధాని మోడీ  గురువారం (ఏప్రిల్ 24) వరకూ వ్యూహాత్మక మౌనం పాటించారు. మరో వంక కాగల కార్యం, కానిచ్చేవారు  కానిచ్చారు. 
విదేశీ పర్యటన నుంచి  తిరిగి వస్తూనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా అనూహ్యమైన కీలక నిర్ణయాలు  తీసుకున్నారు.  ప్రధానంగా, 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటుగా అట్టారి భూ-రవాణా పోస్టును వెంటనే మూసివేయడం వంటి అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఒక విధంగా ఇది, అటు పాకిస్తాన్ కు ఇటు దేశంలోని పాక్ అనుకూల శక్తులకు కూడా మింగుడు పడ లేదు. నిజానికి, పాకిస్తాన్ సైన్యం, మోదీ మరో మెరుపు దాడి చేస్తారని  ఉహించి  ఎదుర్కునేందుకు సన్నద్దమైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దుల్లో వైమానిక దళాలను, సైన్యాన్నిమోహరించింది.  

అయితే  మోదీ మళ్ళీ మరో మెరుపు దాడి చేశారు కానీ..  పాకిస్తాన్, పాక్ ప్రేమికులు ఆశించిన విధంగా కాదు.. అనూహ్యంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ పాక్ పై వ్యూహాత్మక మెరుపు దాడి చేశారు. ఇంతవరకు దాయాది దేశాల మధ్య యుద్దాలు జరిగాయి, పాకిస్తాన్ సీమాంతర  ఉగ్రవాదాన్ని పతాక స్థాయికి తీసుకు పోయింది. మన దేశంలో అశాంతి సృష్టించడమే లక్ష్యంగా  ఉగ్రవాద సంస్థలకు ప్రత్యక్ష పరోక్ష సహకారం అందించింది, అయితే..  ఉభయ దేశాల మధ్య వైషమ్యాలు పతాక స్థాయికి చేరినా, మానవతా దృక్పథంతో, మంచితనంతో మన దేశం పాకిస్తాన్ కు జీవాధారం అయిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే నిర్ణయం తీసుకోలేదు. కానీ  హద్దులు దాటిన పాక్   పాపాలకు చుక్క  పెట్టేందుకు మోదీ ప్రభుత్వం ఇక ఉపేక్షించి లాభం లేదని నిర్ణయానికి వచ్చింది. కఠిన నిర్ణయం తీసుకుంది. 

అయితే.. ఇంతటితో  అయిపోయిందా, పహల్గాం ఉగ్రదాడిని ఇక్కడితో మరిచి పోవడమేనా?  అంటే,  లేదు  అసలు ‘యుద్ధం’ ఇప్పుడే మొదలైందని విశ్లేషకులు అంటున్నారు.  అవును.. ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇంచుమించుగా 48 గంటలకు పైగా వ్యూహాత్మక మౌనం పాటించిన ప్రధాని మోదీ  గురువారం (ఏప్రిల్24) బీహార్లోని మధుబనిలో జరిగిన పంచాయతీ రాజ్ కార్యక్రమంలో తొలిసారిగా  పహల్గామ్ ఉగ్రదాడి పై బహిరంగంగా స్పందించారు. నిజానికి  ప్రధాని మోదీ స్పందించారు,అనే కంటే దేశ ప్రజల గుండె మంటలను ఆవిష్కరించే విధంగా నిప్పులు చెరిగారు.  గర్జించారు అనడం సమంజసంగా ఉంటుంది. 140 కోట్ల మంది గుండె మంటలను ప్రధాని మోదీ తన గొంతుకలో వినిపించారు.  

అవును.. జమ్మూ కశ్మీర్లో అమాయకుల ప్రాణాలు హరించిన ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా, వెతికి, వెంటాడి, వేటాడి శిక్షిస్తామని హెచ్చరించారు. హంతక ముష్కరులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. అంతే కాదు..  ఉగ్రవాద మూకలకు మద్దతి స్తున్న వారిని కూడా వదిలేది లేదని, కలలో కూడా ఉహించలేని విధంగా  కఠినంగా  శిక్షిస్తామని, ప్రపంచం అంతటికీ వినిపించేలా ప్రపంచ భాష  ఇంగ్లీష్ లోనూ  చెప్పారు. 

 ఈ రోజు, బీహార్ గడ్డపై..  నేను ప్రపంచం మొత్తానికి చెబుతున్నాను, భారతదేశం ప్రతి ఉగ్రవాదిని శిక్షిస్తుంది. పహల్గాం ఉగ్రవాద దాడి వెనుక ఉన్న, కుట్రలో భాగమైన ప్రతి ఒకరినీ వారి ఊహకు కూడా అందని విధంగా కఠినంగా శిక్షిస్తాం. ఇప్పుడు.. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే సమయం ఆసన్నమైంది. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చేందుకు మిగిలి ఉన్న ఆ కొద్ది భూభాగాన్ని మట్టి కరిపిస్తాం. మొత్తం దేశం ఈ సంకల్పంలో దృఢంగా ఉంది. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మనతో ఉన్నారు  అని ప్రధానమంత్రి అన్నారు.

అయితే.. ఖచ్చితంగా ప్రభుత్వం  ఎలాంటి  చర్యలు తీసుకుంటుంది? మాటలు ఎంత వరకు కార్యరూపం దలుస్తాయి? ప్రభుతం ఎందాకా పోతుంది? ఉభయ దేశాల మధ్య మరో యుద్ధానికి దారి తీస్తుందా?  అన్నది ఇప్పుడు దేశం ముందున్నప్రశ్న. నిజానికి, దేశం ముందు కాదు,  ప్రపంచం ముందున్న ప్రశ్న కూడా ఇదే..  అలాగే..  యుద్దమే వస్తే ఏమవుతుంది? అనేది కూడా ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ..

By
en-us Political News

  
గత జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నారా బ్రహ్మణి తొలి సారిగా ప్రజల మధ్యకు వచ్చి అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
జగన్ అధికారంలో ఉన్న సమయంలో తమకు ఎదురే లేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలు, అప్పటి తన కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవించక తప్పడం లేదు.
సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
తెలుగుదేశం సీనియర్లు, అందులోనూ కమ్మసామాజికవర్గానికి చెందిన దిగ్గజాలను అంబటి పరామర్శించడం వెనుక లెక్కలేంటి? ఊరకరారు మహానుభావులు అన్నట్లు అంబటి రాక వెనుక పొలిటికల్ ఈక్వేషన్లు ఏంటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.
తమిళనాడులో బీజేపీ ఎన్ని జన్మలు ఎత్తినా అధికారంలోకి రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై ప్రతికూలతకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా సరిగ్గా పంచాయతీ ఎన్నికల వేళ కవిత చేపట్టిన జనజాగృతి యాత్ర ప్రభావం బీఆర్ఎస్ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు.
ఈ సూసైడ్ విన్న‌ర్స్ అంటే ఏంటి? ఈ పంచాయితీ ఎన్నిక‌ల్లో వెలుగులోకొచ్చిన కొత్త ప‌దం ఇది. సంగారెడ్డి, రాయికోడ్ మండ‌లం, పిప‌డ్ ప‌ల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు ఉదంతంతో ఈ పదం పుట్టుకొచ్చిందని చెప్పొచ్చు.
కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై ఎందుకు రాలేదు అని చర్చ రాజకీయంగా జరుగుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి జరిపే ఇలాంటి సమావేశాల్లో మంత్రిగా ఉన్న వ్యక్తి కచ్చితంగా హాజరవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ మాటా- మంతి పేరుతో తన శాఖకు సంబంధించి సమావేశం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
3,911 గ్రామాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 12,782 మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే.. 38,350 వార్డులకు గాను 108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. దీంతో మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
తొలి నుంచీ కూడా ఈటల బీజేపీలో ఇమడడానికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆయన పార్టీలో ఉక్కపోతను భరిస్తూనే కొనసాగుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మరో సారి ఆయన హర్టయ్యారు.
ఈ పోలింగ్ కోసం కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం అధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇకపోతే.. రెండో దశలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు తమ స్వగ్రామాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.